భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. కొత్తగూడెంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్, ఫైరింగ్ రేంజ్ను ప్రారంభించిన అనంతరం... గుండాల స్టేషన్ను సందర్శించారు. తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రధాన కర్తవ్యమన్నారు.
పోలీసు నియామకాల్లో గ్రామీణ యువతకు ప్రాధాన్యత కల్పించేందుకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు మహేందర్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రాన్ని శాంతియుత ప్రాంతంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'జనవరి 26న దిల్లీ వీధుల్లో రైతుల పరేడ్'