ETV Bharat / state

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు ప్రారంభం

author img

By

Published : Oct 6, 2020, 11:43 AM IST

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంగళవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా.. లక్ష్మణ సమేత సీతారాములకు నిత్య కల్యాణ మండపం వద్ద కల్యాణ వేడుక నిర్వహించారు.

bhadradri seetha rama swamy kalyanam
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు ప్రారంభం

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంగళవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిత్య కల్యాణ మండపం వద్ద సీతారాములకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు.

పుణ్యహవచనం నిర్వహించి కన్యాదానం, జీలకరబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు కావడం వల్ల స్వామివారి నిత్యకల్యాణంలో ఒకే జంట పాల్గొన్నారు. ఈరోజు నుంచి యథాతథంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ శివాజీ తెలిపారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో మంగళవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిత్య కల్యాణ మండపం వద్ద సీతారాములకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను నిత్య కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చి కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు.

పుణ్యహవచనం నిర్వహించి కన్యాదానం, జీలకరబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు కావడం వల్ల స్వామివారి నిత్యకల్యాణంలో ఒకే జంట పాల్గొన్నారు. ఈరోజు నుంచి యథాతథంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఆర్జిత సేవలు నిర్వహిస్తామని ఆలయ ఈఓ శివాజీ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.