అభాగ్యులు, మతిస్థిమితం లేనివారు, అనాధలు, వృద్ధులను చేరదీస్తున్న అన్నం ఫౌండేషన్ మరోసారి తమ సేవా గుణాన్ని చాటుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఓ మహిళను చేరదీసి అన్నం శ్రీనివాసరావు తన సేవా గుణాన్ని చాటుకున్నారు. మండలంలోని బొజ్జ గూడెం పంచాయతీలలో రోడ్లపై తిరుగుతున్న మహిళను గమనించిన స్థానికులు వారి దృష్టికి తీసుకెళ్లడంతో... ఆయనే స్వయంగా వచ్చి మహిళను ఆశ్రమానికి తీసుకెళ్లారు.
ఆ మహిళ కొంతకాలంగా అక్కడే తిరుగుతోందని... అప్పుడప్పుడు ఆంగ్లంలో మాట్లాడుతుందని స్థానికులు తెలిపారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులే వెనుకడుగేసిన సమయంలో కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహించి అన్నం ఫౌండేషన్ సభ్యులు మానవత్వం చాటుకున్నారు.
ఇదీ చదవండి: అధిక వడ్డీల పేరుతో రూ. 2 కోట్లు మోసం.. ముగ్గురు అరెస్ట్