రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహన ఘటనకు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ విధులను బహిష్కరించారు. ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరుకాకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వెలవెలబోయింది. ఆయా పనుల నిమిత్తం వచ్చిన వారు అధికారులు, సిబ్బంది కనిపించకపోవడం నిరాశతో వెనుదిరిగారు. కలెక్టర్, జేసీ సహా అన్ని తహసీల్దార్ కార్యాలయాలు తెరుచుకోలేదు.
ఇదీ చూడండి: ప్రజలు ఇబ్బంది పడుతున్నారు... సమస్య పరిష్కరించండి..