Owner Locked Government School: ఆదిలాబాద్ గ్రామీణ మండలం బట్టిసావర్గాం పంచాయతీ పరిధిలోని దుబ్బగూడలో గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నడుస్తోంది. పక్కా భవనం లేని కారణంగా అద్దె తీసుకుని బోధన సాగిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న బడిని ఖాళీ చేయాలని యజమాని రెండు గదుల్లో ఓ గదికి తాళం వేసి వేరో చోటుకి తరలిపోవాలని పురమాయించాడు.
ఇప్పటికిప్పుడు ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటేసుకుని ప్రజావాణి విభాగాన్ని ఆశ్రయించారు. కలెక్టర్కు సమస్యను విన్నవించారు. తమకు కొత్త భవనం మంజూరుచేయాలని కోరారు. ఇదేవిషయమై ఈటీవీ బృందం క్షేత్రస్థాయికి వెళ్లి చూడగా విద్యార్థులు ఆరుబయట పాఠాలు వింటున్న దృశ్యాలు కనిపించాయి. ఎంఈవో జయశీల విద్యార్థులు సమీపంలోని బట్టిసావర్గాం ప్రాథమికోన్నత పాఠశాలకు తరలిస్తామని చెప్పారు. తల్లిదండ్రులు, పిల్లలు తమ గోడును వివరించారు.
ఇవీ చదవండి: