లాక్డౌన్ వల్ల రెండున్నర నెలల పాటు మూతపడిన ఆలయాలు సోమవారం తెరుచుకున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి భయపడిన భక్తులు పదుల సంఖ్యలోనే దర్శనమిచ్చారు. ఆలయాల్లో ఎలాంటి అభిషేకాలు గానీ, గుడిగంటలు మోగించకూడదనే కేంద్ర సూచనలను ఆదిలాబాద్ జిల్లాలో భక్తులు పాటిస్తూ మూలవిరాట్టును దర్శించుకున్నారు.
పట్టణంలోని అన్ని మందిరాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేశాక, మాస్కులు ధరిస్తేనే లోనికి వెళ్లేందుకు అనుతిస్తున్నారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా అధికారులు గుండ్రటి సున్నాలు గీశారు. పదేళ్లలోపు చిన్నారులు, అరవై ఏళ్లు దాటిన వృద్ధులను అనుమతించట్లేదని ఆలయాల అధికారులు వెల్లడించారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో... స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష