ETV Bharat / state

బోథ్ ఎంపీపీ, సర్పంచ్​, ఎంపీవోలపై చర్యలు తీసుకోవాలి: ప్రభుత్వ వైద్యులు

author img

By

Published : May 8, 2021, 9:50 PM IST

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ, సర్పంచ్​, ఎంపీవోలపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ వైద్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి విన్నవించారు.

ప్రభుత్వ వైద్యుల నిరసన
ప్రభుత్వ వైద్యుల నిరసన

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్​, ఎంపీవోలను వెంటనే అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించాలని డిమాండ్​ చేస్తూ ప్రభుత్వ వైద్యులు నిరసనకు దిగారు. లేనిపక్షంలో సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి విన్నవించారు.

విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న వైద్యులను భయబ్రాంతులకు గురిచేసిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుని తమకు భరోసా కల్పించాలని కోరారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ ఎంపీపీ తుల శ్రీనివాస్, సర్పంచ్​, ఎంపీవోలను వెంటనే అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించాలని డిమాండ్​ చేస్తూ ప్రభుత్వ వైద్యులు నిరసనకు దిగారు. లేనిపక్షంలో సోమవారం నుంచి జిల్లావ్యాప్తంగా విధులు బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు వైద్యుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా ఇంఛార్జీ ఎస్పీని కలిసి విన్నవించారు.

విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తోన్న వైద్యులను భయబ్రాంతులకు గురిచేసిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుని తమకు భరోసా కల్పించాలని కోరారు.

ఇదీ చూడండి: గోల్కొండ ఏరియా ఆస్పత్రిని సందర్శించిన సీఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.