గల్ఫ్ దేశాల నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన ప్రజలను జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ మనోహర్ పరిశీలించారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
విదేశాల నుంచి వచ్చిన వారు వీలైనంత వరకు ప్రత్యేక గదిలో ఉండాలని డాక్టర్ మనోహర్ సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో వైరస్ సోకకుండా జాగ్రత్తపడవచ్చని తెలిపారు.
- ఇదీ చూడండి : కరోనా రోగితో సెల్ఫీ- ఆరుగురు అధికారులు సస్పెండ్