ETV Bharat / state

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో నేతల వ్యక్తిగత విమర్శలు

ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ ఐటీడీఏ పాలకమండలి సమావేశం ఎంపీ, ఎమ్మెల్యేల వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకు వేదికైంది. రాష్ట్రమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సమక్షంలో జరిగిన సమావేశం ఆరంభంలోనే పట్టుతప్పింది.

author img

By

Published : Oct 31, 2019, 3:45 AM IST

Updated : Oct 31, 2019, 8:00 AM IST

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో నేతల వ్యక్తిగత విమర్శలు

సుదీర్ఘకాలం తరువాత జరిగిన ఉట్నూర్‌ ఐటీడీఏ సమావేశంలో... ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకే ప్రాధాన్యమిచ్చారే తప్పా... గిరిజన సమస్యలపై చర్చకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు... కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు ఉండవంటూనే తనపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసినందున వాటిని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్‌ చేశారు. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకొని... వేదికపైనే ఉన్న.. సోయం బాపురావును వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించగా.. ఆయన అందుకు నిరాకరించడంతో సమావేశం.. గరంగరంగా సాగింది. ఇదే క్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా... ప్రజాప్రతినిధులు, అధికారుల ఆదేశాలతో పోలీసులు మీడియాను సమావేశం నుంచి బయటకు పంపించడం విమర్శలకు తావిచ్చింది.

సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు

ఆదిలాబాద్‌ పాలనాధికారిపై తిరగబడతాం అని జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌రాఠోడ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్యలు తీసుకోవాలని....... తలమడుగు మండలం కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యుడు గోక గణేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ స్పందిస్తూ... సమావేశంలో గిరిజన సమస్యలను చర్చించాలే తప్పా.. వ్యక్తిగత విమర్శలకు తావీయరాదని సూచించారు.

అర్థవంతమైన చర్చ జరగలేదు

మూడేళ్ల వ్యవధి తరువాత జరిగిన ఐటీడీఏ సమావేశానికి చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్‌ మినహా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, పురాణం సతీష్‌, ఎంపీలు సోయం బాపురావు, వెంకటేష్‌ నేత హాజరైనప్పటికీ... అర్థవంతమైన చర్చజరగలేదనే విమర్శ అధికార తెరాస పార్టీ నుంచే వినిపించడం విశేషం.

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో నేతల వ్యక్తిగత విమర్శలు

ఇవీ చూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు

సుదీర్ఘకాలం తరువాత జరిగిన ఉట్నూర్‌ ఐటీడీఏ సమావేశంలో... ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకే ప్రాధాన్యమిచ్చారే తప్పా... గిరిజన సమస్యలపై చర్చకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు... కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలు ఉండవంటూనే తనపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసినందున వాటిని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే జోగు రామన్న డిమాండ్‌ చేశారు. దీంతో ఇంద్రకరణ్‌రెడ్డి జోక్యం చేసుకొని... వేదికపైనే ఉన్న.. సోయం బాపురావును వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని సూచించగా.. ఆయన అందుకు నిరాకరించడంతో సమావేశం.. గరంగరంగా సాగింది. ఇదే క్రమంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా... ప్రజాప్రతినిధులు, అధికారుల ఆదేశాలతో పోలీసులు మీడియాను సమావేశం నుంచి బయటకు పంపించడం విమర్శలకు తావిచ్చింది.

సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు

ఆదిలాబాద్‌ పాలనాధికారిపై తిరగబడతాం అని జడ్పీ ఛైర్మన్‌ జనార్దన్‌రాఠోడ్ చేసిన వ్యాఖ్యలపై కూడా చర్యలు తీసుకోవాలని....... తలమడుగు మండలం కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యుడు గోక గణేష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. దీంతో సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ స్పందిస్తూ... సమావేశంలో గిరిజన సమస్యలను చర్చించాలే తప్పా.. వ్యక్తిగత విమర్శలకు తావీయరాదని సూచించారు.

అర్థవంతమైన చర్చ జరగలేదు

మూడేళ్ల వ్యవధి తరువాత జరిగిన ఐటీడీఏ సమావేశానికి చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్‌ మినహా ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, పురాణం సతీష్‌, ఎంపీలు సోయం బాపురావు, వెంకటేష్‌ నేత హాజరైనప్పటికీ... అర్థవంతమైన చర్చజరగలేదనే విమర్శ అధికార తెరాస పార్టీ నుంచే వినిపించడం విశేషం.

ఐటీడీఏ పాలకవర్గ సమావేశంలో నేతల వ్యక్తిగత విమర్శలు

ఇవీ చూడండి: సకల జనుల భేరికి పోటెత్తిన మద్దతు

sample description
Last Updated : Oct 31, 2019, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.