భైంసా పట్టణానికి చెందిన అశోక్ విషయం గమనించి ఆరా తీశాడు. మరికొందరి ప్రయాణికులతో కలిసి డిపో మేనేజర్ని కలిశారు. ఆర్డినరి బస్సులో ఎక్స్ప్రెస్ ఛార్జీలు వసూలు చేయడం సరికాదని తెలిపారు.
పల్లె వెలుగు బస్సులైనప్పటికీ... ప్రయాణికులను సరైన సమయంలో గమ్యానికి చేర్చేందుకే ఎక్స్ప్రెస్ బస్సుగా మార్చి నడుపుతున్నామని డిపో మేనేజర్ తెలిపారు.
వెంటనే పల్లెవెలుగు బస్సుల్లో ఆర్డినరి ఛార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేశారు.