ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బాలికల సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాలను బోథ్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. బి. కిరణ్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. కళాశాల పని తీరు, వసతుల కల్పన, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ప్రిన్సిపల్ శ్రీమతితో కళాశాల నిర్వహణపై ఆరా తీసి ఆమెకు తగు సూచనలు చేశారు. వర్షపు నీరు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కళాశాలలో బాలికల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తానని న్యాయమూర్తి హామీ ఇచ్చారు.
ఇదీచూడండి: మన ఫ్రెండల్లే ఇంకెవరుంటారూ...!