ETV Bharat / sports

T20 World Cup: టీమ్​ఇండియాకు కివీస్ గండం!

ఐసీసీ ట్రోఫీలు దక్కించుకోవడంలో భారత జట్టుకు (Team India News) కొన్నేళ్లుగా కలిసిరావడంలేదు. అద్భుత ఫామ్​లో ఉన్న క్రికెటర్లు, టైటిల్​ ఫేవరెట్​గా బరిలో దిగే టీమ్​ఇండియాకు.. గత కొన్నేళ్లుగా ప్రతిసారి ఒకే ఒక అడ్డంకి ఎదురవుతోంది. అదే న్యూజిలాండ్​ (India vs New Zealand). వన్డేలు, టెస్టుల్లో ఐసీసీ ట్రోఫీ కలలకు గండి కొట్టిన కివీస్.​. ఇప్పుడు టీ20 ప్రపంచకప్​ ఆశలనూ గల్లంతు చేసింది.

author img

By

Published : Nov 7, 2021, 10:08 PM IST

Team India News
టీమ్​ఇండియా

టీమ్​ఇండియా పాలిట(India vs New Zealand) న్యూజిలాండ్ శాపంలా మారింది​! గత రెండేళ్లలో వన్డే, టెస్టు, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఐసీసీ ట్రోఫీలను దక్కించుకోవాలనే కలకు గండికొట్టింది. 2019 వన్డే ప్రపంచకప్​లో (2019 World Cup) కివీస్ వల్ల ఫైనల్ చేరలేకపోయిన భారత్.. 2021లో టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో (2021 WTC Final) న్యూజిలాండ్​​ చేతిలోనే ఓడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్​లోనూ (T20 World Cup 2021) కివీస్​ వల్లే సెమీస్​ చేరలేకపోయింది. దీంతో సగటు అభిమాని.. టీమ్​ఇండియాకు కివీస్​ గండం పట్టుకుందని ఆవేదన చెందుతున్నాడు.

2019 వన్డే ప్రపంచకప్​..

2019 వన్డే ప్రపంచకప్​లో లీగ్​ దశలో గ్రూప్​ టాపర్​గా నిలిచి సెమీస్​ చేరిన టీమ్​ఇండియా.. 18 పరుగుల తేడాతో కివీస్​ చేతిలో (2019 World Cup Ind vs NZ) ఓడింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు దారుణంగా విఫలం కాగా.. రవీంద్ర జడేజా (77), ధోనీ (50) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి నిష్క్రమణతో ఆ ప్రపంచకప్​ ఆశలు ముగిశాయి.

Team India News
2019 వన్డే ప్రపంచకప్​ సెమీస్​లో ధోనీ రనౌట్

డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ..

ఈ ఏడాది జూన్​లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో (India vs New Zealand WTC Final) టీమ్​ఇండియాపై 8 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్​ ఎగరేసుకుపోయింది కివీస్. చివరి రోజు 53 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉండగా.. మరో 7 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టెస్టుల్లో తొలి ఐసీసీ ట్రోఫీ ముద్దాడాలనే భారత్​ లక్ష్యానికి కివీస్ అడ్డుకట్ట వేసింది.

Team India News
డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్​ చేతిలో ఓటమి

టీ20ల్లోనూ నిరాశే..

విరాట్​ కోహ్లీ కెప్టెన్సీలోని చివరి టీ20 ప్రపంచకప్​లోనైనా (Ind vs NZ T20 World Cup 2021) కప్పు గెలవాలనే టీమ్​ఇండియా కలను మళ్లీ కివీస్ జట్టే దూరం చేసింది. లీగ్​ మ్యాచ్​ల్లో టీమ్​ఇండియాను ఓడించిన న్యూజిలాండ్​.. భారత్​ సెమీస్​ చేరడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని చెరిపేసింది. అదే అఫ్గాన్​తో మ్యాచ్​. ఆ మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో గెలిచి కోహ్లీసేనకు నిరాశ మిగిల్చింది.

Team India News
2021 టీ20 ప్రపంచకప్​ నుంచి కోహ్లీసేన నిష్క్రమణ

2007లో టీ20 ప్రపంచకప్​ కొట్టిన టీమ్​ఇండియా.. 2009, 2010, 2012లో సూపర్​ 8 వరకూ వెళ్లింది. 2014లో రన్నరప్​గా నిలిచింది. 2016లో సెమీస్​ వరకు చేరుకోగలిగింది. కానీ ఇప్పుడు సూపర్ 12తోనే సరిపెట్టుకుంది. 2012 తర్వాత.. మన పురుషుల క్రికెట్ జట్టు.. వన్డే, టీ 20 ప్రపంచకప్​ సెమీస్​ చేరకపోవడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: అఫ్గాన్​పై న్యూజిలాండ్ విజయం.. ఇండియా ఇంటికి

టీమ్​ఇండియా పాలిట(India vs New Zealand) న్యూజిలాండ్ శాపంలా మారింది​! గత రెండేళ్లలో వన్డే, టెస్టు, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లలోనూ ఐసీసీ ట్రోఫీలను దక్కించుకోవాలనే కలకు గండికొట్టింది. 2019 వన్డే ప్రపంచకప్​లో (2019 World Cup) కివీస్ వల్ల ఫైనల్ చేరలేకపోయిన భారత్.. 2021లో టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో (2021 WTC Final) న్యూజిలాండ్​​ చేతిలోనే ఓడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్​లోనూ (T20 World Cup 2021) కివీస్​ వల్లే సెమీస్​ చేరలేకపోయింది. దీంతో సగటు అభిమాని.. టీమ్​ఇండియాకు కివీస్​ గండం పట్టుకుందని ఆవేదన చెందుతున్నాడు.

2019 వన్డే ప్రపంచకప్​..

2019 వన్డే ప్రపంచకప్​లో లీగ్​ దశలో గ్రూప్​ టాపర్​గా నిలిచి సెమీస్​ చేరిన టీమ్​ఇండియా.. 18 పరుగుల తేడాతో కివీస్​ చేతిలో (2019 World Cup Ind vs NZ) ఓడింది. 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు దారుణంగా విఫలం కాగా.. రవీంద్ర జడేజా (77), ధోనీ (50) ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వారి నిష్క్రమణతో ఆ ప్రపంచకప్​ ఆశలు ముగిశాయి.

Team India News
2019 వన్డే ప్రపంచకప్​ సెమీస్​లో ధోనీ రనౌట్

డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ..

ఈ ఏడాది జూన్​లో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్లో (India vs New Zealand WTC Final) టీమ్​ఇండియాపై 8 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్​ ఎగరేసుకుపోయింది కివీస్. చివరి రోజు 53 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉండగా.. మరో 7 ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో టెస్టుల్లో తొలి ఐసీసీ ట్రోఫీ ముద్దాడాలనే భారత్​ లక్ష్యానికి కివీస్ అడ్డుకట్ట వేసింది.

Team India News
డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్​ చేతిలో ఓటమి

టీ20ల్లోనూ నిరాశే..

విరాట్​ కోహ్లీ కెప్టెన్సీలోని చివరి టీ20 ప్రపంచకప్​లోనైనా (Ind vs NZ T20 World Cup 2021) కప్పు గెలవాలనే టీమ్​ఇండియా కలను మళ్లీ కివీస్ జట్టే దూరం చేసింది. లీగ్​ మ్యాచ్​ల్లో టీమ్​ఇండియాను ఓడించిన న్యూజిలాండ్​.. భారత్​ సెమీస్​ చేరడానికి ఉన్న ఏకైక అవకాశాన్ని చెరిపేసింది. అదే అఫ్గాన్​తో మ్యాచ్​. ఆ మ్యాచ్​లో 8 వికెట్ల తేడాతో గెలిచి కోహ్లీసేనకు నిరాశ మిగిల్చింది.

Team India News
2021 టీ20 ప్రపంచకప్​ నుంచి కోహ్లీసేన నిష్క్రమణ

2007లో టీ20 ప్రపంచకప్​ కొట్టిన టీమ్​ఇండియా.. 2009, 2010, 2012లో సూపర్​ 8 వరకూ వెళ్లింది. 2014లో రన్నరప్​గా నిలిచింది. 2016లో సెమీస్​ వరకు చేరుకోగలిగింది. కానీ ఇప్పుడు సూపర్ 12తోనే సరిపెట్టుకుంది. 2012 తర్వాత.. మన పురుషుల క్రికెట్ జట్టు.. వన్డే, టీ 20 ప్రపంచకప్​ సెమీస్​ చేరకపోవడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: అఫ్గాన్​పై న్యూజిలాండ్ విజయం.. ఇండియా ఇంటికి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.