కరోనా వ్యాప్తి వల్ల వచ్చే ఏడాదికి వాయిదా పడ్డ టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ ఎలా సాగుతుందనేది నిక్కచ్చిగా చెప్పడం కష్టమని అన్నారు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన టోక్యో నిర్వహణ కమిటీ 136వ సెషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు.
వైరస్ వల్ల ఎన్నడూ చూడని వివిధ ఆరోగ్య పరిస్థితులనూ ఎదుర్కొవలసి వస్తుందని హెచ్చరించారు. ఫలితంగా ఈ మెగాటోర్నీకి తక్కువ మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు.
హాకీ షెడ్యూల్
వచ్చే ఏడాది జులై 23 నుంచి విశ్వ క్రీడాసంబురం ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన హాకీ షెడ్యూల్ను జులై 17న (శుక్రవారం) విడుదల చేశారు. భారత పురుషుల జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. మహిళల జట్టు నెదర్లాండ్స్తో పోటీపడనుంది.
ఇది చూడండి : తెలుగు బాక్సర్కు రూ.5 కోట్ల నగదు ప్రోత్సాహం