ETV Bharat / sports

Olympics: రెజ్లర్లపై భారీ అంచనాలు.. పతకాలు సాధిస్తారా?

author img

By

Published : Jul 19, 2021, 6:40 AM IST

టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics) మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే రెజ్లింగ్​లో భారత్​కు ఒకటి కన్నా ఎక్కువ పతకాలు వస్తాయని భారీగా అంచనాలు ఉన్నాయి. రెజ్లర్లు మంచి ఫామ్​లో ఉండటమే ఇందుకు కారణం. మరి మనోళ్లు ఎవరి మీద ఆశలు పెట్టుకున్నారో చూద్దాం..

wrestling
రెజ్లింగ్​

స్వతంత్ర భారతావనికి ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) తొలి వ్యక్తిగత పతకం దక్కింది ఆ క్రీడలోనే.. ఆ తర్వాత అర్ధశతాబ్దం పాటు ఆ ఆటలో మరో పతకం సొంతం కాలేదు. కానీ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ మొదలు ప్రతిసారి విశ్వ క్రీడల్లో ఆ ఆటలో కనీసం ఒక్క పతకమైనా భారత ఖాతాలో చేరుతోంది. ఈ సారి కూడా ఆ క్రీడలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు కచ్చితంగా వస్తాయనే అంచనాలున్నాయి. ఆ ఆటే.. రెజ్లింగ్‌. ఒలింపిక్స్‌లో హాకీ తర్వాత దేశానికి ఎక్కువ పతకాలు వచ్చింది ఈ క్రీడలోనే. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకాలు వచ్చేట్లు.. రెజ్లర్లు పట్టు పడతారనే నమ్మకం ఉంది. రెజ్లర్లు మంచి ఫామ్‌లో ఉండడం పతక ఆశలను పెంచుతోంది.

అయిదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు మాత్రమే దక్కాయి. అందులో ఒకటి బ్యాడ్మింటన్‌లో మన సింధు రజతం గెలవగా.. ఇంకోటి రెజ్లింగ్‌లో వచ్చిందే. కాంస్యం గెలిచిన సాక్షి మలిక్‌ మహిళల రెజ్లింగ్‌లో దేశానికి తొలి ఒలింపిక్‌ పతకం అందించి చరిత్ర సృష్టించింది. అంతకుముందు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రెండు, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఓ పతకం రెజ్లింగ్‌లోనే దక్కాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లోనూ రెజ్లింగ్‌లో కచ్చితంగా కనీసం నాలుగు పతకాలైనా వస్తాయనే అంచనాలున్నాయి. ఇలా నమ్మకం పెట్టుకోవడానికి కారణం జోరు మీదున్న మన రెజ్లర్లే. ఈ విశ్వ క్రీడల్లో మొత్తం ఏడుగురు రెజ్లర్లు పతకం కోసం బరిలో దిగనున్నారు. పురుషుల్లో బజ్‌రంగ్‌ పునియా (65 కేజీలు), రవి కుమార్‌ (57 కేజీలు), దీపక్‌ పునియా (86 కేజీలు).. మహిళల్లో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), సీమా బిస్లా (50 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు) టోక్యో బరిలో ఉన్నారు. ఈ అత్యున్నత క్రీడా సంగ్రామంలో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు గెలిచి దేశానికి గర్వకారణంగా నిలవడం సహా ఇటీవలి పరిణామాలతో దెబ్బ తిన్న భారత రెజ్లింగ్‌ గౌరవాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వీళ్లపై ఉంది. రెజ్లింగ్‌ దిగ్గజం సుశీల్‌ కుమార్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవల జైలుకు వెళ్లడం, టోక్యో క్రీడలకు అర్హత సాధించిన సుమిత్‌ మలిక్‌ డోప్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలి నిషేధం ఎదుర్కోవడం ఈ మధ్య జరిగింది.

టాప్‌సీడ్‌గా..

2016 ఒలింపిక్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గాయంతో విలవిలలాడుతూ.. దేశానికి పతకం అందించే అవకాశం కోల్పోయానని కన్నీళ్లు పెడుతూ మ్యాట్‌ నుంచి నిష్క్రమించిన వినేశ్‌ ఫొగాట్‌(Vinesh Phogat).. టోక్యోలో మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలతో ఉంది. 53 కేజీల విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలో దిగుతున్న ఆమె.. ఈ ఏడాది పోటీపడ్డ ఒక్క టోర్నీలోనూ ఓడిపోలేదు. 2021లో అజేయంగా కొనసాగుతోన్న ఈ 26 ఏళ్ల రెజ్లర్‌.. ఒలింపిక్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. స్వర్ణంతోనే తిరిగి వస్తుందని వినేశ్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది. అయితే దాన్ని అందుకునే దిశగా ఆమెకు సోఫియా (స్వీడన్‌), పాంగ్‌ (చైనా), మయు (జపాన్‌) నుంచి సవాలు ఎదురుకానుంది. గతంలో సోఫియా, పాంగ్‌పై విజయాలు సాధించడం వినేశ్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు ఇప్పటివరకూ మూడుసార్లు మయు చేతిలో ఓడిన వినేశ్‌.. ఆమెతో ఫైనల్లో తలపడే అవకాశముంది. ఆ పోరులో పైచేయి సాధిస్తే పసిడి ఆమెదే. టీనేజీ సంచలనాలు అన్షు మలిక్‌, సోనమ్‌ మలిక్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మ్యాట్‌లో వేగంగా కదులుతూ.. ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ 19 ఏళ్ల అమ్మాయిలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కోసం ఆసియా క్వాలిఫయర్‌ టోర్నీ సెమీస్‌లో గాయంతోనే ప్రత్యర్థితో పోటీపడి గెలిచిన సోనమ్‌ తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాక్షి మాలిక్‌ లాంటి అగ్రశ్రేణి రెజ్లర్‌నే నాలుగు సార్లు ఓడించిన ఆమె ఆత్మవిశ్వాసంతో ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. మరోవైపు 50 కేజీల విభాగంలో సీమా బిస్లా కూడా చూడదగ్గ రెజ్లరే.

vinesh phogat
వినేశ్​ ఫొగాట్​

బజ్‌రంగ్‌ భళీ..

టోక్యో ఒలింపిక్స్‌ పురుషుల రెజ్లింగ్‌లో దేశానికి పతకం అందించే రెజ్లర్‌ ఎవరూ అనే ప్రశ్నకు అందరి నుంచి వస్తున్న సమాధానం.. బజ్‌రంగ్‌ పునియా(Bajrang punia). కొన్నేళ్ల నుంచి ప్రపంచస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనతో తనపై అంచనాలను అతను పెంచేశాడు. మ్యాట్‌లో దూకుడైన ఆటతీరు.. ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా తన పట్టుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. 2017 నుంచి అతని వాట్సాప్‌ డీపీగా టోక్యో ఒలింపిక్స్‌ నమూనా స్వర్ణ పతకమే ఉందంటే దాన్ని అందుకునే దిశగా అతను ఎలాంటి బలమైన కోరికతో ఉన్నాడో స్పష్టమవుతోంది. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల్లో పతకాలతో అతను ప్రపంచ అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. 65 కేజీల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా టోక్యోలో అడుగుపెట్టబోతున్న ఈ రెండో సీడ్‌ రెజ్లర్‌కు ఈ విభాగంలో కఠినమైన పోటీ ఎదురు కానుంది. ప్రపంచంలోని అత్యుత్తమ రెజ్లర్లతో అతను తలపడనున్నాడు. పసిడి వేటలో అతనికి ప్రపంచ ఛాంపియన్‌ రషిదోవ్‌ (రష్యా), తకుటో (జపాన్‌), నియాబెకోవ్‌ (కజికిస్థాన్‌), ఇస్మాయిల్‌ (హంగేరీ) అడ్డుగా నిలవొచ్చు. ఇప్పటివరకూ రషిదోవ్‌తో పోటీపడని బజ్‌రంగ్‌.. ఒలింపిక్స్‌ ఫైనల్లో అతణ్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల బజ్‌రంగ్‌పై కచ్చితంగా ఏదో ఒక పతకం సాధిస్తాడనే ఆశలున్నాయి. కానీ తన కఠోర శ్రమ, అత్యుత్తమ శిక్షణతో అతను పసిడిని అందుకుంటే చూడాలని దేశం కోరుకుంటోంది. మరోవైపు 2018లో ప్రపంచ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 22 ఏళ్ల దీపక్‌ పునియాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. 2019 ప్రపంచ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అతను టోక్యో క్రీడల్లో 86 కేజీల విభాగంలో రెండో సీడ్‌గా మ్యాట్‌లో అడుగుపెట్టనున్నాడు. 57 కిలోల కేటగిరీలో నాలుగో సీడ్‌గా బరిలో దిగనున్న 23 ఏళ్ల రవి కుమార్‌ కూడా పతకం సాధించాలనే ధ్యేయంతో ఉన్నాడు.

punia
భజరంగ్​ పునియా

1952 హెల్సింకీ ఒలింపిక్స్‌ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్యం గెలిచిన కేడీ జాదవ్‌.. స్వాతంత్య్రం వచ్చాక దేశానికి తొలి వ్యక్తిగత పతకం అందించిన అథ్లెట్‌గా నిలిచాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత 2008లో సుశీల్‌ కుమార్‌ కాంస్యం నెగ్గాడు. 2012 లండన్‌ క్రీడల్లో సుశీల్‌ రజతం, యోగేశ్వర్‌ దత్‌ కాంస్యం గెలిచారు. గత రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్‌ కంచు పతకం సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: Olympics: మ్యాచ్​లు ఓడినా.. పతకం గెలిచిన అమెరికా!

స్వతంత్ర భారతావనికి ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) తొలి వ్యక్తిగత పతకం దక్కింది ఆ క్రీడలోనే.. ఆ తర్వాత అర్ధశతాబ్దం పాటు ఆ ఆటలో మరో పతకం సొంతం కాలేదు. కానీ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ మొదలు ప్రతిసారి విశ్వ క్రీడల్లో ఆ ఆటలో కనీసం ఒక్క పతకమైనా భారత ఖాతాలో చేరుతోంది. ఈ సారి కూడా ఆ క్రీడలో ఒకటి కంటే ఎక్కువ పతకాలు కచ్చితంగా వస్తాయనే అంచనాలున్నాయి. ఆ ఆటే.. రెజ్లింగ్‌. ఒలింపిక్స్‌లో హాకీ తర్వాత దేశానికి ఎక్కువ పతకాలు వచ్చింది ఈ క్రీడలోనే. టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకాలు వచ్చేట్లు.. రెజ్లర్లు పట్టు పడతారనే నమ్మకం ఉంది. రెజ్లర్లు మంచి ఫామ్‌లో ఉండడం పతక ఆశలను పెంచుతోంది.

అయిదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు మాత్రమే దక్కాయి. అందులో ఒకటి బ్యాడ్మింటన్‌లో మన సింధు రజతం గెలవగా.. ఇంకోటి రెజ్లింగ్‌లో వచ్చిందే. కాంస్యం గెలిచిన సాక్షి మలిక్‌ మహిళల రెజ్లింగ్‌లో దేశానికి తొలి ఒలింపిక్‌ పతకం అందించి చరిత్ర సృష్టించింది. అంతకుముందు 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రెండు, 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో ఓ పతకం రెజ్లింగ్‌లోనే దక్కాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆరంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లోనూ రెజ్లింగ్‌లో కచ్చితంగా కనీసం నాలుగు పతకాలైనా వస్తాయనే అంచనాలున్నాయి. ఇలా నమ్మకం పెట్టుకోవడానికి కారణం జోరు మీదున్న మన రెజ్లర్లే. ఈ విశ్వ క్రీడల్లో మొత్తం ఏడుగురు రెజ్లర్లు పతకం కోసం బరిలో దిగనున్నారు. పురుషుల్లో బజ్‌రంగ్‌ పునియా (65 కేజీలు), రవి కుమార్‌ (57 కేజీలు), దీపక్‌ పునియా (86 కేజీలు).. మహిళల్లో వినేశ్‌ ఫొగాట్‌ (53 కేజీలు), సీమా బిస్లా (50 కేజీలు), అన్షు మలిక్‌ (57 కేజీలు), సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు) టోక్యో బరిలో ఉన్నారు. ఈ అత్యున్నత క్రీడా సంగ్రామంలో అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు గెలిచి దేశానికి గర్వకారణంగా నిలవడం సహా ఇటీవలి పరిణామాలతో దెబ్బ తిన్న భారత రెజ్లింగ్‌ గౌరవాన్ని తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత కూడా వీళ్లపై ఉంది. రెజ్లింగ్‌ దిగ్గజం సుశీల్‌ కుమార్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఇటీవల జైలుకు వెళ్లడం, టోక్యో క్రీడలకు అర్హత సాధించిన సుమిత్‌ మలిక్‌ డోప్‌ పరీక్షలో పాజిటివ్‌గా తేలి నిషేధం ఎదుర్కోవడం ఈ మధ్య జరిగింది.

టాప్‌సీడ్‌గా..

2016 ఒలింపిక్స్‌ క్వార్టర్‌ఫైనల్లో గాయంతో విలవిలలాడుతూ.. దేశానికి పతకం అందించే అవకాశం కోల్పోయానని కన్నీళ్లు పెడుతూ మ్యాట్‌ నుంచి నిష్క్రమించిన వినేశ్‌ ఫొగాట్‌(Vinesh Phogat).. టోక్యోలో మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలతో ఉంది. 53 కేజీల విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలో దిగుతున్న ఆమె.. ఈ ఏడాది పోటీపడ్డ ఒక్క టోర్నీలోనూ ఓడిపోలేదు. 2021లో అజేయంగా కొనసాగుతోన్న ఈ 26 ఏళ్ల రెజ్లర్‌.. ఒలింపిక్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది. స్వర్ణంతోనే తిరిగి వస్తుందని వినేశ్‌పై ప్రజల్లో నమ్మకం ఉంది. అయితే దాన్ని అందుకునే దిశగా ఆమెకు సోఫియా (స్వీడన్‌), పాంగ్‌ (చైనా), మయు (జపాన్‌) నుంచి సవాలు ఎదురుకానుంది. గతంలో సోఫియా, పాంగ్‌పై విజయాలు సాధించడం వినేశ్‌కు కలిసొచ్చే అంశం. మరోవైపు ఇప్పటివరకూ మూడుసార్లు మయు చేతిలో ఓడిన వినేశ్‌.. ఆమెతో ఫైనల్లో తలపడే అవకాశముంది. ఆ పోరులో పైచేయి సాధిస్తే పసిడి ఆమెదే. టీనేజీ సంచలనాలు అన్షు మలిక్‌, సోనమ్‌ మలిక్‌ ఆసక్తి రేకెత్తిస్తున్నారు. మ్యాట్‌లో వేగంగా కదులుతూ.. ప్రత్యర్థులను చిత్తు చేసే ఈ 19 ఏళ్ల అమ్మాయిలను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం కోసం ఆసియా క్వాలిఫయర్‌ టోర్నీ సెమీస్‌లో గాయంతోనే ప్రత్యర్థితో పోటీపడి గెలిచిన సోనమ్‌ తెగువ గురించి ఎంత చెప్పినా తక్కువే. సాక్షి మాలిక్‌ లాంటి అగ్రశ్రేణి రెజ్లర్‌నే నాలుగు సార్లు ఓడించిన ఆమె ఆత్మవిశ్వాసంతో ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. మరోవైపు 50 కేజీల విభాగంలో సీమా బిస్లా కూడా చూడదగ్గ రెజ్లరే.

vinesh phogat
వినేశ్​ ఫొగాట్​

బజ్‌రంగ్‌ భళీ..

టోక్యో ఒలింపిక్స్‌ పురుషుల రెజ్లింగ్‌లో దేశానికి పతకం అందించే రెజ్లర్‌ ఎవరూ అనే ప్రశ్నకు అందరి నుంచి వస్తున్న సమాధానం.. బజ్‌రంగ్‌ పునియా(Bajrang punia). కొన్నేళ్ల నుంచి ప్రపంచస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనతో తనపై అంచనాలను అతను పెంచేశాడు. మ్యాట్‌లో దూకుడైన ఆటతీరు.. ప్రత్యర్థిపై పైచేయి సాధించేలా తన పట్టుతో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాడు. 2017 నుంచి అతని వాట్సాప్‌ డీపీగా టోక్యో ఒలింపిక్స్‌ నమూనా స్వర్ణ పతకమే ఉందంటే దాన్ని అందుకునే దిశగా అతను ఎలాంటి బలమైన కోరికతో ఉన్నాడో స్పష్టమవుతోంది. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ఆసియా, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల్లో పతకాలతో అతను ప్రపంచ అగ్రశ్రేణి రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. 65 కేజీల విభాగంలో ప్రపంచ రెండో ర్యాంకర్‌గా టోక్యోలో అడుగుపెట్టబోతున్న ఈ రెండో సీడ్‌ రెజ్లర్‌కు ఈ విభాగంలో కఠినమైన పోటీ ఎదురు కానుంది. ప్రపంచంలోని అత్యుత్తమ రెజ్లర్లతో అతను తలపడనున్నాడు. పసిడి వేటలో అతనికి ప్రపంచ ఛాంపియన్‌ రషిదోవ్‌ (రష్యా), తకుటో (జపాన్‌), నియాబెకోవ్‌ (కజికిస్థాన్‌), ఇస్మాయిల్‌ (హంగేరీ) అడ్డుగా నిలవొచ్చు. ఇప్పటివరకూ రషిదోవ్‌తో పోటీపడని బజ్‌రంగ్‌.. ఒలింపిక్స్‌ ఫైనల్లో అతణ్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. తొలిసారి ఒలింపిక్స్‌లో ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల బజ్‌రంగ్‌పై కచ్చితంగా ఏదో ఒక పతకం సాధిస్తాడనే ఆశలున్నాయి. కానీ తన కఠోర శ్రమ, అత్యుత్తమ శిక్షణతో అతను పసిడిని అందుకుంటే చూడాలని దేశం కోరుకుంటోంది. మరోవైపు 2018లో ప్రపంచ క్యాడెట్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 22 ఏళ్ల దీపక్‌ పునియాపైనా మంచి అంచనాలే ఉన్నాయి. 2019 ప్రపంచ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన అతను టోక్యో క్రీడల్లో 86 కేజీల విభాగంలో రెండో సీడ్‌గా మ్యాట్‌లో అడుగుపెట్టనున్నాడు. 57 కిలోల కేటగిరీలో నాలుగో సీడ్‌గా బరిలో దిగనున్న 23 ఏళ్ల రవి కుమార్‌ కూడా పతకం సాధించాలనే ధ్యేయంతో ఉన్నాడు.

punia
భజరంగ్​ పునియా

1952 హెల్సింకీ ఒలింపిక్స్‌ పురుషుల 57 కేజీల విభాగంలో కాంస్యం గెలిచిన కేడీ జాదవ్‌.. స్వాతంత్య్రం వచ్చాక దేశానికి తొలి వ్యక్తిగత పతకం అందించిన అథ్లెట్‌గా నిలిచాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత 2008లో సుశీల్‌ కుమార్‌ కాంస్యం నెగ్గాడు. 2012 లండన్‌ క్రీడల్లో సుశీల్‌ రజతం, యోగేశ్వర్‌ దత్‌ కాంస్యం గెలిచారు. గత రియో ఒలింపిక్స్‌లో సాక్షి మాలిక్‌ కంచు పతకం సొంతం చేసుకుంది.

ఇదీ చూడండి: Olympics: మ్యాచ్​లు ఓడినా.. పతకం గెలిచిన అమెరికా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.