ETV Bharat / sports

'ఒలింపిక్స్​ పతకం సాధించడంలో వాళ్లే నా ప్రేరణ'

author img

By

Published : Jun 18, 2020, 5:27 AM IST

ఒలిపింక్స్​లో పతకాలు సాధించడానికి భారత రెజ్లర్లు సుశీల్​ కుమార్​, యోగేశ్వర్​ దత్​లు తనకు ప్రేరణగా నిలిచారని తాజాగా వెల్లడించింది మహిళా రెజ్లర్​ సాక్షి మాలిక్​. రియో ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన క్షణం తనకు ఎప్పటికీ అపరూప జ్ఞాపకంగా ఉంటుందని తెలిపింది.

Sushil and Yogeshwar's medals motivated me, says Sakshi Malik
'ఒలింపిక్స్​లో పతకాన్ని సాధించడానికి వాళ్లే నా ప్రేరణ'

భారత రెజ్లర్లు సుశీల్​ కుమార్​, యోగేశ్వర్​ దత్​లు ఒలింపిక్స్​ పతకం సాధించే విషయంలో తనకు ప్రేరణగా నిలిచారని రెజ్లర్​ సాక్షి మాలిక్ చెప్పింది​. 2016 పోటీల్లో కాంస్య పతకం అందుకున్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేసింది. క్రీడాకారుల కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్​), రెజ్లింగ్​ సమాఖ్యలు ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ క్లాసుల్లో పాల్గొన్న సాక్షి.. వీటిని వెల్లడించింది.

Sushil and Yogeshwar's medals motivated me, says Sakshi Malik
సుశీల్​ కుమార్​

"నా చిన్నతనంలోనే ఆడటం మొదలుపెట్టాను. అప్పట్లో ఒలింపిక్స్​, కామన్​వెల్త్​ గేమ్స్​, ఆసియన్​ గేమ్స్​ అంటే అవగాహన కొంచెమే ఉండేది. ఎప్పుడైతే కుస్తీలో అడుగుపెట్టానో జూనియర్​ స్థాయి నుంచి ఈ టోర్నీలపై ఆసక్తి పెరిగింది. సుశీల్​ కుమార్​, యోగేశ్వర్​ దత్​లు ఒలింపిక్స్​లో పతకాలను సాధించడం నాకు ప్రేరణగా నిలిచింది. రియో ఒలింపిక్స్​లో నేను ఎప్పుడైతే కాంస్య పతకానికి చేరుకున్నానో.. చివరి మ్యాచ్​ వరకు ఓడిపోకూడదని అనుకున్నాను. ప్రత్యర్థి కంటే నేను ఉత్తమ క్రీడాకారిణి అని మా కోచ్​ చెబుతూనే ఉన్నాడు. అలా కఠినమైన ఆ మ్యాచ్​లో విజయం సాధించాను. గెలిచిన అనుభూతిని నా మాటల్లో వర్ణించలేకపోయాను. ఆ సమయంలో నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు"

- సాక్షి మాలిక్​, భారత మహిళా రెజ్లర్

"పతకం సాధించిన తర్వాత నా జీవితమే మారిపోతుందని కోచ్ చెప్పారు. కానీ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ అపురూపమైన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఒలింపిక్స్​లో పతకం సాధించిన తర్వాత నాపై ప్రేమ కురిపించిన భారతీయులకు కృతజ్ఞురాలిని" అంటూ చెప్పుకొచ్చింది సాక్షి.

Sushil and Yogeshwar's medals motivated me, says Sakshi Malik
యోగేశ్వర్​ దత్​

కరోనా సంక్షోభ సమయంలో ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఆన్​లైన్​ క్లాసులు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో సాయ్​, రెజ్లింగ్​ సమాఖ్యలు చూపిన చొరవను సాక్షి మాలిక్​ ప్రశంసించింది. దీనివల్ల క్రీడాకారులు ఇంట్లోనే ఉండి, చాలా అంశాలు నేర్చుకొవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి... 'గంగూలీ వ్యాఖ్యలతో యువ క్రికెటర్లకు భరోసా'

భారత రెజ్లర్లు సుశీల్​ కుమార్​, యోగేశ్వర్​ దత్​లు ఒలింపిక్స్​ పతకం సాధించే విషయంలో తనకు ప్రేరణగా నిలిచారని రెజ్లర్​ సాక్షి మాలిక్ చెప్పింది​. 2016 పోటీల్లో కాంస్య పతకం అందుకున్న క్షణాలు తనతో ఎప్పటికీ ఉంటాయని స్పష్టం చేసింది. క్రీడాకారుల కోసం భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్​), రెజ్లింగ్​ సమాఖ్యలు ఏర్పాటు చేసిన ఆన్​లైన్​ క్లాసుల్లో పాల్గొన్న సాక్షి.. వీటిని వెల్లడించింది.

Sushil and Yogeshwar's medals motivated me, says Sakshi Malik
సుశీల్​ కుమార్​

"నా చిన్నతనంలోనే ఆడటం మొదలుపెట్టాను. అప్పట్లో ఒలింపిక్స్​, కామన్​వెల్త్​ గేమ్స్​, ఆసియన్​ గేమ్స్​ అంటే అవగాహన కొంచెమే ఉండేది. ఎప్పుడైతే కుస్తీలో అడుగుపెట్టానో జూనియర్​ స్థాయి నుంచి ఈ టోర్నీలపై ఆసక్తి పెరిగింది. సుశీల్​ కుమార్​, యోగేశ్వర్​ దత్​లు ఒలింపిక్స్​లో పతకాలను సాధించడం నాకు ప్రేరణగా నిలిచింది. రియో ఒలింపిక్స్​లో నేను ఎప్పుడైతే కాంస్య పతకానికి చేరుకున్నానో.. చివరి మ్యాచ్​ వరకు ఓడిపోకూడదని అనుకున్నాను. ప్రత్యర్థి కంటే నేను ఉత్తమ క్రీడాకారిణి అని మా కోచ్​ చెబుతూనే ఉన్నాడు. అలా కఠినమైన ఆ మ్యాచ్​లో విజయం సాధించాను. గెలిచిన అనుభూతిని నా మాటల్లో వర్ణించలేకపోయాను. ఆ సమయంలో నవ్వాలో, ఏడ్వాలో అర్థం కాలేదు"

- సాక్షి మాలిక్​, భారత మహిళా రెజ్లర్

"పతకం సాధించిన తర్వాత నా జీవితమే మారిపోతుందని కోచ్ చెప్పారు. కానీ ఏ స్థాయిలో ఉన్నా సరే ఆ అపురూపమైన జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. ఒలింపిక్స్​లో పతకం సాధించిన తర్వాత నాపై ప్రేమ కురిపించిన భారతీయులకు కృతజ్ఞురాలిని" అంటూ చెప్పుకొచ్చింది సాక్షి.

Sushil and Yogeshwar's medals motivated me, says Sakshi Malik
యోగేశ్వర్​ దత్​

కరోనా సంక్షోభ సమయంలో ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు ఆన్​లైన్​ క్లాసులు ఏర్పాటు చేశారు. అయితే ఈ విషయంలో సాయ్​, రెజ్లింగ్​ సమాఖ్యలు చూపిన చొరవను సాక్షి మాలిక్​ ప్రశంసించింది. దీనివల్ల క్రీడాకారులు ఇంట్లోనే ఉండి, చాలా అంశాలు నేర్చుకొవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి... 'గంగూలీ వ్యాఖ్యలతో యువ క్రికెటర్లకు భరోసా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.