అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్ఐహెచ్) చీఫ్గా ఉన్న నరీందర్ బత్రా పదవీకాలాన్ని వచ్చే ఏడాది మే వరకు పొడిగించారు. కరోనా ప్రభావంతో వార్షిక సమావేశం వాయిదా పడటం వల్లే ఈ నిర్ణయం తీసుకునే పరిస్థితులు వచ్చాయి. ఈయనతో పాటు కార్యవర్గం పదవీకాలాన్ని పొడిగించారు. ప్రస్తుతం నరీందర్.. భారత ఒలింపిక్ అసోసియేషన్కు అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు.
శుక్రవారం ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఎఫ్ఐహెచ్ కార్యవర్గ భేటీలో మాట్లాడుతూ.. అక్టోబరు 28న జరగాల్సిన వార్షిక కాంగ్రెస్ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు నిర్వహించేది త్వరలో చెబుతామని పేర్కొన్నారు.