ETV Bharat / sports

డైమండ్‌ లీగ్‌పై నీరజ్ ఫోకస్​.. టార్గెట్​ ఎంతంటే ?

author img

By

Published : Jun 30, 2023, 6:47 AM IST

Updated : Jun 30, 2023, 7:59 AM IST

గాయం నుంచి కోలుకున్న భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా మరోసారి బరిలోకి దూసుకెళ్లనున్నాడు. స్విట్జర్లాండ్​ వేదికగా శుక్రవారం ఆరంభమయ్యే డైమండ్‌ లీగ్‌ లుసానె అంచె టోర్నీలో పాల్గొని తన సత్త చాటనున్నాడు. ఈ క్రమంలో అతని టార్గెట్​ ఎంతంటే ?

neeraj chopra for Lausanne Diamond League
Neeraj chopra

Neeraj Chopra Javelin: ఒలంపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్​ నీరజ్ చోప్రా మరోసారి డైమండ్ లీగ్‌లో సత్తా చాటాలని కసరత్తలు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ స్టార్​ ప్లేయర్​.. శుక్రవారం ప్రారంభం కానున్న డైమండ్‌ లీగ్‌ లుసానె టోర్నీలో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది దోహాలో జరిగిన తొలి డైమండ్‌ లీగ్‌ టోర్నీలో 88.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత గాయంతో ఎఫ్‌బీకే క్రీడలు (నెదర్లాండ్స్‌), పావో నూర్మి ఈవెంట్‌ (ఫిన్లాండ్‌)లకు దూరమయ్యాడు. అయితే ఈ సీజన్లో ఎలాగైనా 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్‌కు ఇప్పుడు లుసానె టోర్నీ మరో అవకాశాన్ని ఇస్తోంది.

ఈ పోటీల్లో విజేతగా నిలవడం చోప్రాకు అంత సులభం కాకపోవచ్చు. ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత జాకబ్‌ వాద్లిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌),జులియన్‌ వెబర్‌ (జర్మనీ), అలివర్‌ హెలాండర్‌ (ఫిన్లాండ్‌), వాల్కాట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో), లాంటి స్టార్లు నీరజ్‌కు గట్టి పోటీనివ్వనున్నారు. అంతే కాకుండా మరో భారత అథ్లెట్‌ మురళీ శ్రీశంకర్‌ (లాంగ్‌జంప్‌) కూడా ఈ లుసానె ఈవెంట్‌ బరిలో ఉన్నాడు.

Neeraj Chopra Records : ఇక నీరజ్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 2022 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 89.94 మీటర్ల దూరానికి జావెలిన్​ను విసిరి రికార్డుకెక్కాడు. అభినవ్ బింద్రా తర్వాత, వ్యక్తిగత ఆటల విభాగంలో భారత్​కు ఒలంపిక్స్‌లో బంగారు పతకం అందించాడు నీరజ్​ చోప్రా. ఇటీవలే ఓ అరుదైన రికార్డును సైతం తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో వరల్డ్ నెంబర్‌ ర్యాంకింగ్‌ని దక్కించుకున్న తొలి ఇండియన్ అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.

మరోవైపు దోహా డైమండ్ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచి 8 పాయింట్లు సాధించి, స్విస్‌ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాద్లెక్‌ 7 పాయింట్లతో రెండవ స్థానంలో నిలవగా.. గ్రెనాడాకి ఆండర్సన్ పీటర్స్ 6 పాయింట్లతో రేసులో ఉన్నాడు. జూన్ 30న స్విట్జర్జాండ్‌లో 2వ ఈవెంట్ తర్వాత, జులై 21న మొనాకో డైమండ్ లీగ్, ఆగస్ట్ 31న జురిచ్ లీగ్‌లు జరగనున్నాయి. ఇక చివరి ఫైనల్ డైమండ్ లీగ్‌ యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరగనుంది.

Neeraj Chopra Javelin: ఒలంపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్​ నీరజ్ చోప్రా మరోసారి డైమండ్ లీగ్‌లో సత్తా చాటాలని కసరత్తలు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ స్టార్​ ప్లేయర్​.. శుక్రవారం ప్రారంభం కానున్న డైమండ్‌ లీగ్‌ లుసానె టోర్నీలో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది దోహాలో జరిగిన తొలి డైమండ్‌ లీగ్‌ టోర్నీలో 88.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత గాయంతో ఎఫ్‌బీకే క్రీడలు (నెదర్లాండ్స్‌), పావో నూర్మి ఈవెంట్‌ (ఫిన్లాండ్‌)లకు దూరమయ్యాడు. అయితే ఈ సీజన్లో ఎలాగైనా 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్‌కు ఇప్పుడు లుసానె టోర్నీ మరో అవకాశాన్ని ఇస్తోంది.

ఈ పోటీల్లో విజేతగా నిలవడం చోప్రాకు అంత సులభం కాకపోవచ్చు. ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత జాకబ్‌ వాద్లిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌),జులియన్‌ వెబర్‌ (జర్మనీ), అలివర్‌ హెలాండర్‌ (ఫిన్లాండ్‌), వాల్కాట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో), లాంటి స్టార్లు నీరజ్‌కు గట్టి పోటీనివ్వనున్నారు. అంతే కాకుండా మరో భారత అథ్లెట్‌ మురళీ శ్రీశంకర్‌ (లాంగ్‌జంప్‌) కూడా ఈ లుసానె ఈవెంట్‌ బరిలో ఉన్నాడు.

Neeraj Chopra Records : ఇక నీరజ్‌ తన కెరీర్‌లో అత్యుత్తమంగా 2022 వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 89.94 మీటర్ల దూరానికి జావెలిన్​ను విసిరి రికార్డుకెక్కాడు. అభినవ్ బింద్రా తర్వాత, వ్యక్తిగత ఆటల విభాగంలో భారత్​కు ఒలంపిక్స్‌లో బంగారు పతకం అందించాడు నీరజ్​ చోప్రా. ఇటీవలే ఓ అరుదైన రికార్డును సైతం తన పేరిట లిఖించుకున్నాడు. పురుషుల జావెలిన్ త్రోలో వరల్డ్ నెంబర్‌ ర్యాంకింగ్‌ని దక్కించుకున్న తొలి ఇండియన్ అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు.

మరోవైపు దోహా డైమండ్ లీగ్‌లో తొలి స్థానంలో నిలిచి 8 పాయింట్లు సాధించి, స్విస్‌ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన జాకుబ్ వాద్లెక్‌ 7 పాయింట్లతో రెండవ స్థానంలో నిలవగా.. గ్రెనాడాకి ఆండర్సన్ పీటర్స్ 6 పాయింట్లతో రేసులో ఉన్నాడు. జూన్ 30న స్విట్జర్జాండ్‌లో 2వ ఈవెంట్ తర్వాత, జులై 21న మొనాకో డైమండ్ లీగ్, ఆగస్ట్ 31న జురిచ్ లీగ్‌లు జరగనున్నాయి. ఇక చివరి ఫైనల్ డైమండ్ లీగ్‌ యునైటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సెప్టెంబర్ 16, 17 తేదీల్లో జరగనుంది.

Last Updated : Jun 30, 2023, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.