ETV Bharat / sports

రివ్యూ 2019 : క్రీడల్లో సరికొత్త శిఖరాలకు భారత్​

author img

By

Published : Dec 26, 2019, 7:01 AM IST

Updated : Dec 26, 2019, 12:01 PM IST

2019లో భారత క్రీడాకారులు అన్ని రంగాల్లోనూ మెరుగ్గా రాణించారు. ఇప్పటి వరకు క్రికెట్​కే పట్టం కట్టిన భారతీయులు ఇతర క్రీడలనూ ఆదిరిస్తున్నారు. ఆయా రంగాల క్రీడల్లో విశేష ప్రతిభ కనబర్చారు.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
రివ్యూ 2019 : క్రీడల్లో సరికొత్త శిఖరాలకు భారత్​

క్రికెట్​... భారతదేశంలో దాదాపు ఏ టీవీలో చూసినా కనిపించేది ఇదే. ప్రపంచకప్​ నుంచి ద్వైపాక్షిక సిరీస్​ల వరకూ ప్రత్యేక ప్రమోషన్లు అవసరం లేకుండానే 'మెన్ ఇన్​ బ్లూ' జట్టు ఆడే ప్రతి మ్యాచ్​కూ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. అయితే క్రికెట్​ను ఇంతలా ఆదరిస్తోన్న భారతీయులు ఇతర క్రీడలను మాత్రం అంతగా పట్టించుకోరనే మాట కాస్త కఠినమైనదే అయినా ఇప్పటి వరకు అది వాస్తవమే. ఫుట్​బాల్​, బ్యాడ్మింటన్​, టెన్నిస్​, బాక్సింగ్​, రెజ్లింగ్​ తదితర ఆటలకు దేశంలో ఆదరణ చాలా తక్కువ.

కానీ '2019' మాత్రం ఇందుకు భిన్నం. క్రికెట్​తో పాటు ఇతర క్రీడాకారులకు ఈ ఏడాది బాగా గుర్తుండిపోనుంది. పీవీ సింధు, మేరీ కోమ్​, మానసి జోషి, భజరంగ్ పునియా తదితర క్రీడాకారులు ఆయా రంగాల్లో ప్రపంచ వేదికలపై మెరిసి.. భారత ప్రేక్షకుల మనసులను తమవైపు తిప్పుకున్నారు. క్రికెట్​తో పాటు ఇతర క్రీడలకూ ప్రేక్షకాదరణ చూరగొన్నారు.

బ్యాడ్మింటన్​

2019లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం​ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. ప్రపంచ పారా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ షిప్​లో మానసి జోషి కూడా బంగార పతకాన్ని కైవసం చేసుకుంది.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
పీవీ సింధు

సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ద్వయం 'థాయ్​లాండ్​ ఓపెన్​ సూపర్​ 500' టైటిల్​ విజేతగా నిలిచింది. ఫ్రెంచ్​ ఓపెన్​ 750 టైటిల్​లోనూ ఫైనల్​ వరకూ వెళ్లింది. 36 ఏళ్ల నిరీక్షణకు చెక్​ పెడుతూ స్విట్జర్లాండ్​లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్ పురుషుల సింగిల్స్​​లో సాయి ప్రణీత్​ కాంస్య పతకం సాధించాడు. 1983లో ప్రకాశ్​ పదుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. వీరితో పాటు 18 ఏళ్ల లక్ష్యసేన్​ కూడా ఈ ఏడాది ఏకంగా 5 పతకాలు సాధించి అందరినీ ఆకర్షించాడు.

టెన్నిస్​

ఈ ఏడాది యూఎస్​ ఓపెన్​ సందర్భంగా సుమిత్​ నాగల్​-రోజర్​ ఫెదరర్​ మధ్య జరిగిన మ్యాచ్ భారతీయులందరికీ గుర్తుండిపోతుంది​. ప్రపంచ మేటి టెన్నిస్​ ప్లేయర్లలో ఒకరైన ఫెదరర్​ను తొలి సెట్లోనే ఓడించి ఒక్కసారిగా అందరినీ తనవైపు ఆకర్షించాడు సుమిత్​. చివరకు మ్యాచ్​ ఓడినప్పటికీ ఫెదరర్​కు గట్టిపోటీనిచ్చి.. భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందితో శభాష్​ అనిపించుకున్నాడు. నాగల్​తో పాటు మరికొంత మంది తమ ప్రతిభను కనబర్చారు.

బాక్సింగ్​

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
మేరీకోమ్​

2019 మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో మేరీ కోమ్​ కాంస్య పతకం నెగ్గింది. అయితే అదే టోర్నీలో మేరీ కోమ్ సెమీఫైనల్ మ్యాచ్​ సందర్భంగా అంతర్జాతీయ బాక్సింగ్ అసోషియేషన్​ అఫీషియల్​ యూట్యూబ్​ ఛానెల్​ 'ఏఐబీఏ'కు ఒక్కసారిగా వీక్షకులు కూడా పెరిగారు. అధికారుల తీరుపై ఆమె ఫిర్యాదు చేసినప్పుడు దేశం మొత్తం మేరీకి బాసటగా నిలిచింది. మరో బాక్సర్​ మంజు రాణి కూడా మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో వెండి పతకాన్ని సాధించింది.

రెజ్లింగ్​

భారత రెజ్లింగ్ క్రీడాకారులకు 2019 మరచిపోలేని ఏడాదిగా మిగిలిపోతుంది. రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో దీపక్​ పునియా వెండి పతకాన్ని కైవసం చేసుకోగా.. వినేశ్ ఫొగట్​, రవి కుమార్​, బజరంగ్​ పూనియా, రాహుల్​ అవారేలు కాంస్య పతకాలు సాధించారు.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
వినేశ్ ఫొగాట్​

ఫుట్​బాల్​

అయితే ఫుట్​బాల్​లో మాత్రం భారత్​ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ, భారత ప్రేక్షకులు ఇతర క్రీడలతో పాటు ఫుట్​బాల్​ను కూడా ఆదిరించాలన్న భారత ఫుట్​బాల్​ కెప్టెన్​ సునీల్ ఛెత్రీ సందేశంతో 2022 ఫిఫా వరల్డ్​కప్​ క్వాలిఫయింగ్​ మ్యాచులకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

దక్షిణాసియా క్రీడల్లో భారత్​ రికార్డు

2019లో దక్షిణాసియా క్రీడల్లో భారత్​ సరికొత్త చరిత్ర లిఖించింది. 174 బంగారు, 93 వెండి, 45 కాంస్య పతకాలతో చరిత్రలో తొలిసారి అత్యధికంగా 312 పతకాలను ఖాతాలో వేసుకుంది. గతంలో అత్యుత్తుమంగా 309 పతకాలు సాధించింది భారత్​.

భారత ప్రేక్షకులు అంతగా ఆదరించని మార్షల్​ ఆర్ట్స్​ కూడా రితూ ఫొగాట్​ రాకతో ఈ ఏడాది మంచి ఆదరణ పొందింది.

క్రికెట్​

భారత్​లో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్​.. ఈ ఏడాది నూతన శిఖరాలకు చేరింది. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో మొదటి స్థానంలో నిలిచింది.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
ప్రపంచకప్​లో కివీస్ - ఇంగ్లాండ్

ఈ ఏడాది ఇంగ్లాండ్​, వేల్స్​ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్​ ప్రపంచకప్​లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. సెమీఫైనల్​ వరకు చేరింది. అయితే అనూహ్య రీతిలో సెమీఫైనల్లో న్యూజిలాండ్​ చేతిలో పరాజయం పొంది కోట్ల మంది భారతీయుల ప్రపంచకప్​ ఆశలను నెరవేర్చలేక పోయింది.

2020లో టోక్యో ఒలింపిక్స్​, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్​, మహిళల టీ20 ప్రపంచకప్​ తదితర మెగా ఈవెంట్లకు రానున్న 2020 ఏడాది వేదిక కానుంది. ఈ తరుణంలో దేశంలో క్రికెట్​తో పాటు ఇతర క్రీడలకు ప్రేక్షకాదరణ లభిస్తుండటం శుభపరిణామంగా పరిగణించొచ్చు. అలాగే భవిష్యత్​లో భారత్​.. క్రీడాసంపత్తికి కేంద్రంగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్​.. 2020లో వీడ్కోలు

క్రికెట్​... భారతదేశంలో దాదాపు ఏ టీవీలో చూసినా కనిపించేది ఇదే. ప్రపంచకప్​ నుంచి ద్వైపాక్షిక సిరీస్​ల వరకూ ప్రత్యేక ప్రమోషన్లు అవసరం లేకుండానే 'మెన్ ఇన్​ బ్లూ' జట్టు ఆడే ప్రతి మ్యాచ్​కూ ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతారు. అయితే క్రికెట్​ను ఇంతలా ఆదరిస్తోన్న భారతీయులు ఇతర క్రీడలను మాత్రం అంతగా పట్టించుకోరనే మాట కాస్త కఠినమైనదే అయినా ఇప్పటి వరకు అది వాస్తవమే. ఫుట్​బాల్​, బ్యాడ్మింటన్​, టెన్నిస్​, బాక్సింగ్​, రెజ్లింగ్​ తదితర ఆటలకు దేశంలో ఆదరణ చాలా తక్కువ.

కానీ '2019' మాత్రం ఇందుకు భిన్నం. క్రికెట్​తో పాటు ఇతర క్రీడాకారులకు ఈ ఏడాది బాగా గుర్తుండిపోనుంది. పీవీ సింధు, మేరీ కోమ్​, మానసి జోషి, భజరంగ్ పునియా తదితర క్రీడాకారులు ఆయా రంగాల్లో ప్రపంచ వేదికలపై మెరిసి.. భారత ప్రేక్షకుల మనసులను తమవైపు తిప్పుకున్నారు. క్రికెట్​తో పాటు ఇతర క్రీడలకూ ప్రేక్షకాదరణ చూరగొన్నారు.

బ్యాడ్మింటన్​

2019లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం​ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించింది. ప్రపంచ పారా బ్యాడ్మింటన్​ ఛాంపియన్​ షిప్​లో మానసి జోషి కూడా బంగార పతకాన్ని కైవసం చేసుకుంది.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
పీవీ సింధు

సాత్విక్​ సాయిరాజ్​ రంకిరెడ్డి - చిరాగ్ శెట్టి ద్వయం 'థాయ్​లాండ్​ ఓపెన్​ సూపర్​ 500' టైటిల్​ విజేతగా నిలిచింది. ఫ్రెంచ్​ ఓపెన్​ 750 టైటిల్​లోనూ ఫైనల్​ వరకూ వెళ్లింది. 36 ఏళ్ల నిరీక్షణకు చెక్​ పెడుతూ స్విట్జర్లాండ్​లో జరిగిన ప్రపంచ ఛాంపియన్​షిప్ పురుషుల సింగిల్స్​​లో సాయి ప్రణీత్​ కాంస్య పతకం సాధించాడు. 1983లో ప్రకాశ్​ పదుకొనే తర్వాత ఈ ఘనత సాధించిన తొలి క్రీడాకారుడిగా నిలిచాడు. వీరితో పాటు 18 ఏళ్ల లక్ష్యసేన్​ కూడా ఈ ఏడాది ఏకంగా 5 పతకాలు సాధించి అందరినీ ఆకర్షించాడు.

టెన్నిస్​

ఈ ఏడాది యూఎస్​ ఓపెన్​ సందర్భంగా సుమిత్​ నాగల్​-రోజర్​ ఫెదరర్​ మధ్య జరిగిన మ్యాచ్ భారతీయులందరికీ గుర్తుండిపోతుంది​. ప్రపంచ మేటి టెన్నిస్​ ప్లేయర్లలో ఒకరైన ఫెదరర్​ను తొలి సెట్లోనే ఓడించి ఒక్కసారిగా అందరినీ తనవైపు ఆకర్షించాడు సుమిత్​. చివరకు మ్యాచ్​ ఓడినప్పటికీ ఫెదరర్​కు గట్టిపోటీనిచ్చి.. భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చాలా మందితో శభాష్​ అనిపించుకున్నాడు. నాగల్​తో పాటు మరికొంత మంది తమ ప్రతిభను కనబర్చారు.

బాక్సింగ్​

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
మేరీకోమ్​

2019 మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో మేరీ కోమ్​ కాంస్య పతకం నెగ్గింది. అయితే అదే టోర్నీలో మేరీ కోమ్ సెమీఫైనల్ మ్యాచ్​ సందర్భంగా అంతర్జాతీయ బాక్సింగ్ అసోషియేషన్​ అఫీషియల్​ యూట్యూబ్​ ఛానెల్​ 'ఏఐబీఏ'కు ఒక్కసారిగా వీక్షకులు కూడా పెరిగారు. అధికారుల తీరుపై ఆమె ఫిర్యాదు చేసినప్పుడు దేశం మొత్తం మేరీకి బాసటగా నిలిచింది. మరో బాక్సర్​ మంజు రాణి కూడా మహిళల బాక్సింగ్​ ఛాంపియన్​షిప్​లో వెండి పతకాన్ని సాధించింది.

రెజ్లింగ్​

భారత రెజ్లింగ్ క్రీడాకారులకు 2019 మరచిపోలేని ఏడాదిగా మిగిలిపోతుంది. రెజ్లింగ్​ ఛాంపియన్​షిప్​లో దీపక్​ పునియా వెండి పతకాన్ని కైవసం చేసుకోగా.. వినేశ్ ఫొగట్​, రవి కుమార్​, బజరంగ్​ పూనియా, రాహుల్​ అవారేలు కాంస్య పతకాలు సాధించారు.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
వినేశ్ ఫొగాట్​

ఫుట్​బాల్​

అయితే ఫుట్​బాల్​లో మాత్రం భారత్​ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కానీ, భారత ప్రేక్షకులు ఇతర క్రీడలతో పాటు ఫుట్​బాల్​ను కూడా ఆదిరించాలన్న భారత ఫుట్​బాల్​ కెప్టెన్​ సునీల్ ఛెత్రీ సందేశంతో 2022 ఫిఫా వరల్డ్​కప్​ క్వాలిఫయింగ్​ మ్యాచులకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

దక్షిణాసియా క్రీడల్లో భారత్​ రికార్డు

2019లో దక్షిణాసియా క్రీడల్లో భారత్​ సరికొత్త చరిత్ర లిఖించింది. 174 బంగారు, 93 వెండి, 45 కాంస్య పతకాలతో చరిత్రలో తొలిసారి అత్యధికంగా 312 పతకాలను ఖాతాలో వేసుకుంది. గతంలో అత్యుత్తుమంగా 309 పతకాలు సాధించింది భారత్​.

భారత ప్రేక్షకులు అంతగా ఆదరించని మార్షల్​ ఆర్ట్స్​ కూడా రితూ ఫొగాట్​ రాకతో ఈ ఏడాది మంచి ఆదరణ పొందింది.

క్రికెట్​

భారత్​లో అత్యంత ఆదరణ ఉన్న క్రికెట్​.. ఈ ఏడాది నూతన శిఖరాలకు చేరింది. కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో మొదటి స్థానంలో నిలిచింది.

How 2019 diversified cricket crazy nation's attention to other sports!
ప్రపంచకప్​లో కివీస్ - ఇంగ్లాండ్

ఈ ఏడాది ఇంగ్లాండ్​, వేల్స్​ వేదికగా జరిగిన ఐసీసీ క్రికెట్​ ప్రపంచకప్​లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తూ.. సెమీఫైనల్​ వరకు చేరింది. అయితే అనూహ్య రీతిలో సెమీఫైనల్లో న్యూజిలాండ్​ చేతిలో పరాజయం పొంది కోట్ల మంది భారతీయుల ప్రపంచకప్​ ఆశలను నెరవేర్చలేక పోయింది.

2020లో టోక్యో ఒలింపిక్స్​, ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్​, మహిళల టీ20 ప్రపంచకప్​ తదితర మెగా ఈవెంట్లకు రానున్న 2020 ఏడాది వేదిక కానుంది. ఈ తరుణంలో దేశంలో క్రికెట్​తో పాటు ఇతర క్రీడలకు ప్రేక్షకాదరణ లభిస్తుండటం శుభపరిణామంగా పరిగణించొచ్చు. అలాగే భవిష్యత్​లో భారత్​.. క్రీడాసంపత్తికి కేంద్రంగా మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: చివరిసారిగా గర్జించాలనుకుంటున్న పేస్​.. 2020లో వీడ్కోలు

RESTRICTION SUMMARY: MANDATORY ON-SCREEN CREDIT TO SYRIAN CIVIL DEFENCE IDLIB
SHOTLIST:
VALIDATED UGC - MUST CREDIT SYRIAN CIVIL DEFENCE IDLIB
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients
Southern Idlib countryside - 24 December 2019
1. Trucks loaded with belongings for people escaping attacks in Idlib
2. Children in a truck
3. Truck parking near a house
4. Displaced getting out of a truck
5. Various of White Helmets (Syrian Civil Defence) volunteers and displaced people unloading truck
VALIDATED UGC - MUST CREDIT SYRIAN CIVIL DEFENCE IDLIB
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients
Southern Idlib countryside - 25 December 2019
6. Girl crying outside her house
++VIDEO QUALITY AS INCOMING++
7. Various of White Helmets (Syrian Civil Defence) volunteers and displaced people loading truck
8. SOUNDBITE (Arabic) Displaced person (no name given):
"Because of shelling and due to fears about our children and the deterioration of the situation we are leaving. Would anyone leave on his own, would anyone leave his house?"
9. Truck loaded with belongings for displaced people
STORYLINE:
A further wave of Syrians fled the rebel-held Idlib region and headed towards the Turkish border on Wednesday.
Syria's opposition civil defence movement - also known as the White Helmets - released video Tuesday showing queues of trucks and vehicles loaded with people and their belongings.
Syrian government forces have been slowly chipping away at Idlib, despite a fragile Russian-brokered cease-fire three months ago.
Since the cease-fire, the government has been pushing to clear access to a strategic highway that links the capital Damascus and northwestern city of Aleppo.
The United Nations estimates that some 60,000 people have fled from the area, heading south, after attacks on Idlib intensified earlier this month.
Thousands have fled towards the border in recent days, where the UN has warned of the growing risk of a humanitarian catastrophe.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 26, 2019, 12:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.