భారత సీనియర్ టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్ తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలకనున్నాడు. 2020లో ఆటకు గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నాడు. బుధవారం ఈ విషయాన్ని తెలియజేశాడు. కెరీర్లో మొత్తం 54 టైటిల్స్ గెలిచాడు. ఇందులో 18 గ్రాండ్స్లామ్ డబుల్స్ ట్రోఫీలు ఉన్నాయి.
"2020లో ఆటకు గుడ్బై చెప్పాలని అనుకుంటున్నా. వచ్చే ఏడాది ఎంపిక చేసుకున్న టోర్నీల్లోనే ఆడాలనుకుంటున్నా. కుటుంబం, మిత్రులతో నా రిటైర్మెంట్ వేడుకలను జరుపుకోవాలనుకుంటున్నా. నాకు మద్దతుగా నిలిచిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. మీ ప్రోత్సాహం, క్రమశిక్షణ, పెంపకం, ప్రేమ ఇక్కడకు వరకు వచ్చా. మీరు లేకుంటే నేను లేను. ఐ లవ్యూ" - లియాండర్ పేస్, టెన్నిస్ స్టార్
తన సొదరీమణులకు, కూతురు ఐనాకు కూడా ధన్యవాదాలు చెప్పాడు పేస్. #వన్ లాస్ట్ రోర్ అనే హ్యాష్ట్యాగ్తో తన మధుర జ్ఞాపకాలను షేర్ చేయాలని అభిమానులను కోరాడు. 2020 భావోద్వేగంతో ఉండబోతోందని తెలిపాడు.
డెవిస్కప్లో అత్యధిక డబుల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా పేస్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 44 టైటిల్స్తో ఘనత సాధించాడు. ఇటీవలే గత 19ఏళ్లలో మొదటి సారి టాప్-100లో చోటు కోల్పోయాడు లియాండర్ పేస్.
ఇదీ చదవండి: మగబిడ్డకు జన్మనిచ్చిన గీతా కుమారి ఫొగాట్