ETV Bharat / sports

బాక్సింగ్‌లో భారత్‌ జోరు.. ఫైనల్స్​కు ఎనిమిది మంది

author img

By

Published : Apr 22, 2021, 8:14 AM IST

ప్రపంచ యువ బాక్సింగ్​ ఛాంపియన్​షిప్స్​లో ఎనిమిది మంది భారత బాక్సర్లు సెమీఫైనల్స్‌లో సత్తాచాటి ఫైనల్స్​కు దూసుకెళ్లారు. వీరిలో ఏడుగురు అమ్మాయిలే కావడం విశేషం.

boxing
బాక్సింగ్‌లో భారత్‌ జోరు

ప్రపంచ యువ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు. ఇందులో ఏడుగురు అమ్మాయిలే కావడం విశేషం.

గీతిక (48కేజీ), బేబీరోజిసనా చాను (51కేజీ), వింకా (60కేజీ), అరుంధతి చౌదరి (69కేజీ), పూనమ్‌ (57కేజీ), సనమాచు చాను (75కేజీ), అల్ఫియా పఠాన్‌ (+81కేజీ) మహిళల విభాగం సెమీఫైనల్స్‌లో నెగ్గి స్వర్ణ పోరుకు అర్హత సాధించారు.

పురుషుల విభాగంలో సచిన్‌ (56కేజీ) పసిడి కోసం పోటీపడనున్నాడు. మరో ముగ్గురు భారత బాక్సర్లు అంకిత నర్వాల్‌ (64కేజీ), విశ్వామిత్ర చొంగ్తామ్‌ (49కేజీ), విశాల్‌ గుప్తా (91 కేజీ) కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు.

మొత్తం మీద 11 పతకాలతో భారత్‌ టోర్నీని ముగించనుంది. ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు అత్యధికంగా 2018లో 10 పతకాలు సాధించింది.

ప్రపంచ యువ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఎనిమిది మంది భారత బాక్సర్లు ఫైనల్లో అడుగుపెట్టారు. ఇందులో ఏడుగురు అమ్మాయిలే కావడం విశేషం.

గీతిక (48కేజీ), బేబీరోజిసనా చాను (51కేజీ), వింకా (60కేజీ), అరుంధతి చౌదరి (69కేజీ), పూనమ్‌ (57కేజీ), సనమాచు చాను (75కేజీ), అల్ఫియా పఠాన్‌ (+81కేజీ) మహిళల విభాగం సెమీఫైనల్స్‌లో నెగ్గి స్వర్ణ పోరుకు అర్హత సాధించారు.

పురుషుల విభాగంలో సచిన్‌ (56కేజీ) పసిడి కోసం పోటీపడనున్నాడు. మరో ముగ్గురు భారత బాక్సర్లు అంకిత నర్వాల్‌ (64కేజీ), విశ్వామిత్ర చొంగ్తామ్‌ (49కేజీ), విశాల్‌ గుప్తా (91 కేజీ) కాంస్య పతకాలతో సంతృప్తి చెందారు.

మొత్తం మీద 11 పతకాలతో భారత్‌ టోర్నీని ముగించనుంది. ప్రపంచ యూత్‌ బాక్సింగ్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇంతకుముందు అత్యధికంగా 2018లో 10 పతకాలు సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.