ETV Bharat / sports

ఆర్చరీ: ఐదు పతకాల రేసులో భారత్‌

author img

By

Published : Apr 24, 2021, 6:27 AM IST

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్ 1 టోర్నమెంట్లో భారత్ ఐదు పతకాలకు రేసులో నిలిచింది. దీపికా కుమారి, అతాను దాస్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జత కట్టి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు.

deepika
దీపికా కుమారి

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నమెంట్లో భారత్‌ ఐదు పతకాలకు రేసులో నిలిచింది. రికర్వ్‌ పురుషుల విభాగం, మహిళల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌ చేరుకున్న దీపికా కుమారి, అతాను దాస్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జత కట్టి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. పురుషుల క్వార్టర్స్‌లో అతాను దాస్‌ 6-4తో ఎరిక్‌ పీటర్స్‌ (కెనడా)ను ఓడించగా.. మహిళల క్వార్టర్స్‌లో దీపిక 6-0తో మిచెలీ క్రోపెన్‌ (జర్మనీ)ని చిత్తు చేసింది. మహిళల రికర్వ్‌ క్వార్టర్స్‌లో అంకిత భాకత్‌ 2-6తో వెలాన్సియా (ఇటలీ) చేతిలో ఓడింది.

అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మొదట స్పెయిన్‌ జోడీని ఓడించి సెమీస్‌ చేరిన దీపిక-దాస్‌.. మెక్సికోతో సెమీస్‌లో షూట్‌ ఆఫ్‌లో ఓడిపోయారు. మొదట 4-4తో స్కోర్లు సమం కాగా... షూట్‌ ఆఫ్‌లో మెక్సికో జోడీ పైచేయి సాధించింది. పురుషులు, మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగాల్లో క్వార్టర్స్‌ చేరడం ద్వారా భారత్‌ మరో రెండు పతకాలకు పోటీలో నిలిచింది.

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నమెంట్లో భారత్‌ ఐదు పతకాలకు రేసులో నిలిచింది. రికర్వ్‌ పురుషుల విభాగం, మహిళల వ్యక్తిగత విభాగాల్లో సెమీఫైనల్‌ చేరుకున్న దీపికా కుమారి, అతాను దాస్‌.. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో జత కట్టి కాంస్య పతక పోరుకు అర్హత సాధించారు. పురుషుల క్వార్టర్స్‌లో అతాను దాస్‌ 6-4తో ఎరిక్‌ పీటర్స్‌ (కెనడా)ను ఓడించగా.. మహిళల క్వార్టర్స్‌లో దీపిక 6-0తో మిచెలీ క్రోపెన్‌ (జర్మనీ)ని చిత్తు చేసింది. మహిళల రికర్వ్‌ క్వార్టర్స్‌లో అంకిత భాకత్‌ 2-6తో వెలాన్సియా (ఇటలీ) చేతిలో ఓడింది.

అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మొదట స్పెయిన్‌ జోడీని ఓడించి సెమీస్‌ చేరిన దీపిక-దాస్‌.. మెక్సికోతో సెమీస్‌లో షూట్‌ ఆఫ్‌లో ఓడిపోయారు. మొదట 4-4తో స్కోర్లు సమం కాగా... షూట్‌ ఆఫ్‌లో మెక్సికో జోడీ పైచేయి సాధించింది. పురుషులు, మహిళల రికర్వ్‌ టీమ్‌ విభాగాల్లో క్వార్టర్స్‌ చేరడం ద్వారా భారత్‌ మరో రెండు పతకాలకు పోటీలో నిలిచింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.