ETV Bharat / sports

11 మంది ఆటగాళ్లకు కరోనా.. హాకీ టోర్నీ వాయిదా

author img

By

Published : Mar 31, 2021, 2:12 PM IST

Updated : Mar 31, 2021, 2:37 PM IST

త్వరలో జరగాల్సిన జూనియర్ హాకీ టోర్నీ వాయిదా పడింది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు కరోనా వచ్చినట్లు తేలడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.

Players test positive, National Junior Hockey Championship postponed
11 మంది ఆటగాళ్లకు కరోనా.. హాకీ టోర్నీ వాయిదా

కరోనా ప్రభావం మరో టోర్నీపై పడింది. ఝార్ఖండ్​లో ఏప్రిల్ 3న ప్రారంభం కావాల్సిన 'జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్​' వాయిదా పడింది. అందులో పాల్గొనాల్సిన కొందరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్​గా తేలడమే ఇందుకు కారణం.

ఆతిథ్య వేదిక సిమ్దేగాకు వచ్చిన చంఢీగడ్​ జట్టు ఆటగాళ్లకు పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి పాజిటివ్​గా తేలింది. ఝార్ఖండ్ బృందంలోని ఆరుగురు ప్లేయర్లకు కూడా కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో వారందరినీ ఐసోలేషన్​కు పంపి, ముందు జాగ్రత్తగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

కరోనా ప్రభావం మరో టోర్నీపై పడింది. ఝార్ఖండ్​లో ఏప్రిల్ 3న ప్రారంభం కావాల్సిన 'జాతీయ జూనియర్ హాకీ టోర్నమెంట్​' వాయిదా పడింది. అందులో పాల్గొనాల్సిన కొందరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్​గా తేలడమే ఇందుకు కారణం.

ఆతిథ్య వేదిక సిమ్దేగాకు వచ్చిన చంఢీగడ్​ జట్టు ఆటగాళ్లకు పరీక్షలు చేయగా, అందులో ఐదుగురికి పాజిటివ్​గా తేలింది. ఝార్ఖండ్ బృందంలోని ఆరుగురు ప్లేయర్లకు కూడా కొవిడ్ సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో వారందరినీ ఐసోలేషన్​కు పంపి, ముందు జాగ్రత్తగా టోర్నీని వాయిదా వేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

Last Updated : Mar 31, 2021, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.