ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో(Fifa Worldcup) భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. సునీల్ ఛెత్రి(Sunil Chhetri) రెండు గోల్స్ చేయడం వల్ల 2-0తో బంగ్లాదేశ్పై విజయం సాధించింది. 79వ నిమిషంలో గోల్తో ఛెత్రి జట్టు ఖాతా తెరిచాడు.
రెండో అర్ధభాగంలో సబ్స్టిట్యూట్గా వచ్చిన ఆషిక్ కురునియన్ ఎడమ నుంచి ఇచ్చిన క్రాస్ను ఛెత్రి తలతో నెట్లోకి కొట్టాడు. ఇంజురీ సమయంలో మరో గోల్ (90+2)తో ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు. ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. 11 అర్హత మ్యాచ్ల తర్వాత భారత్కు విజయం దక్కింది.
మెస్సీని దాటి.. రికార్డు
ఈ మ్యాచ్తో కలిపి ఛెత్రి ఇప్పటివరకు 74 గోల్స్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అంతర్జాతీయ కెరీర్లో అత్యధిక గోల్స్ సాధించిన రెండో ప్లేయర్గా నిలిచాడు. తనతో సమానంగా ఉన్న అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని(72) అధిగమించాడు. క్రిస్టియానో రొనాల్డో(103) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. మూడో స్థానంలో అలీ మబ్ఖౌత్(Ali Mabkhout) ఉన్నాడు.
ఇదీ చూడండి: ఛాంపియన్స్ లీగ్ ఛాంప్ చెల్సీ