ETV Bharat / sports

World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌.. భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 11, 2023, 7:44 PM IST

World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌ పీసీబీ చీఫ్‌ భారత్​కు రానున్నారు. ఈ మేరకు ఓ సందేశం పంపారు. ఆ సందేశంలో ఆయన ఏం అన్నారంటే?

World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌..  భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌
World Cup 2023 IND vs PAK : టీమ్​ ఇండియా - పాకిస్థాన్​ మ్యాచ్‌.. భారత్‌కు రానున్న పీసీబీ చీఫ్‌

World Cup 2023 IND vs PAK : ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్​ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానుండటం విశేషం. కాగా ఇప్పటికే ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్​ జర్నలిస్ట్‌లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం 60 మంది జర్నలిస్టులతో కలిసి జకా అష్రఫ్ కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. "నేను గురువారం భారత్‌కు రానున్నాను. నా జర్నీ కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్‌ చేయడానికి పాకిస్థాన్​ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. వీసాల జారీపై భారత రాయబార కార్యాలయం సానుకూలంగా స్పందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా జర్నలిస్టులతో కలిసి భారత్‌కు వస్తున్నాను. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో మా టీమ్​ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్లేయర్ల ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. టీమ్​ను ప్రోత్సహించేందుకు నేను భారత్‌కు వెళ్తున్నాను. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు మా జట్టుకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడండి " అని జకా అష్రఫ్ పేర్కొన్నారు.

Ind Pak Match Tickets Price : ఆకాశాన్నంటుతున్న ధరలు.. వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు చేరకోనున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు మ్యాచ్‌ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. భారతీయ రైల్వే.. ఈ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లను నడపనున్నట్లు ఈ మధ్యే తెలిపింది.

  • Pakistani journalist have received visa to cover the India vs Pakistan match in Ahmedabad on 14th October in this World Cup 2023. (RevSportz)

    60 Pakistani journalists are set to arrive in India for this World Cup..!! pic.twitter.com/XR1szRhy4H

    — CricketMAN2 (@ImTanujSingh) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ODI World Cup 2023 AFG vs IND : చరిత్ర సృష్టించిన కెప్టెన్​ రోహిత్ శర్మ.. ఆ రికార్డ్ బ్రేక్ చేసి తొలి క్రికెటర్​గా ఘనత

Hardik Pandya Birthday : ​పాండ్య దిగితే పూనకాలే.. పాక్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషల్!

World Cup 2023 IND vs PAK : ప్రపంచ క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు సమయం దగ్గరపడుతోంది. ఆక్టోబర్‌ 14న అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-పాకిస్థాన్​ జట్లు తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను చూసేందుకు పాకిస్థాన్ క్రికెట్‌ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ జకా అష్రఫ్ భారత్‌కు రానుండటం విశేషం. కాగా ఇప్పటికే ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్​ జర్నలిస్ట్‌లకు భారత ప్రభుత్వం వీసాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మొత్తం 60 మంది జర్నలిస్టులతో కలిసి జకా అష్రఫ్ కూడా భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. "నేను గురువారం భారత్‌కు రానున్నాను. నా జర్నీ కాస్త ఆలస్యమైంది. ఈ మెగా ఈవెంట్‌ను కవర్‌ చేయడానికి పాకిస్థాన్​ జర్నలిస్ట్‌లకు వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. వీసాల జారీపై భారత రాయబార కార్యాలయం సానుకూలంగా స్పందించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా జర్నలిస్టులతో కలిసి భారత్‌కు వస్తున్నాను. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో మా టీమ్​ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ప్లేయర్ల ప్రదర్శన పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. టీమ్​ను ప్రోత్సహించేందుకు నేను భారత్‌కు వెళ్తున్నాను. భారత్‌తో కీలక మ్యాచ్‌కు ముందు మా జట్టుకు నేను ఇచ్చే సందేశం ఒక్కటే. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆడండి " అని జకా అష్రఫ్ పేర్కొన్నారు.

Ind Pak Match Tickets Price : ఆకాశాన్నంటుతున్న ధరలు.. వన్డే ప్రపంచకప్‌(ODI World Cup 2023)లో ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు అహ్మదాబాద్‌కు చేరకోనున్నారు. ఈ క్రమంలో అక్కడి హోటళ్లకు డిమాండ్ బాగా పెరిగింది. మరోవైపు మ్యాచ్‌ జరిగే రోజు వివిధ నగరాల నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లే విమాన టికెట్‌ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. భారతీయ రైల్వే.. ఈ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్‌ రైళ్లను నడపనున్నట్లు ఈ మధ్యే తెలిపింది.

  • Pakistani journalist have received visa to cover the India vs Pakistan match in Ahmedabad on 14th October in this World Cup 2023. (RevSportz)

    60 Pakistani journalists are set to arrive in India for this World Cup..!! pic.twitter.com/XR1szRhy4H

    — CricketMAN2 (@ImTanujSingh) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ODI World Cup 2023 AFG vs IND : చరిత్ర సృష్టించిన కెప్టెన్​ రోహిత్ శర్మ.. ఆ రికార్డ్ బ్రేక్ చేసి తొలి క్రికెటర్​గా ఘనత

Hardik Pandya Birthday : ​పాండ్య దిగితే పూనకాలే.. పాక్​పై ఆ ఇన్నింగ్స్​ ఎప్పటికీ స్పెషల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.