ETV Bharat / sports

T20 world cup 2021: టీ20 ప్రపంచకప్​లో ఆ రోజు రానే వచ్చింది!

author img

By

Published : Oct 24, 2021, 7:10 AM IST

ఆ ఒక్క మ్యాచ్‌ కోసం పదుల కోట్లమంది (T20 world cup 2021 latest news) ఎదురు చూస్తున్నారంటే.. రెండు దేశాలే కాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల దృష్టి ఆ మ్యాచ్‌పై పడిందంటే.. అది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి!. అలాంటి అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో క్రికెట్‌ మైదానంలో భారత జట్టు యుద్ధం ఆదివారమే. అందుకు టీ20 ప్రపంచకప్‌ వేదికైంది.

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్​ 2021

ఓడితే కన్నీళ్లతో బరువెక్కే హృదయాలు.. ఆగ్రహంతో ఇళ్లలో బద్దలయ్యే టీవీలు.. ఓటమి బాధతో కొన్నిసార్లు (T20 world cup 2021) ఊపిరే ఆగిపోయే సందర్భాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయంటే.. అది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి!

T20 world cup 2021
భారత్- పాక్ మ్యాచ్

ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. అదొక ఒక పండుగలా మారి దేశమంతా సంబరాలు చేసుకుంటుందంటే.. ఆ పండుగ వాతావరణాన్ని సృష్టించే ఇది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి! అలాంటి అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసే ఆ రోజు రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో క్రికెట్‌ మైదానంలో భారత జట్టు యుద్ధం ఆదివారమే. అందుకు టీ20 ప్రపంచకప్‌ వేదికైంది. టైటిల్‌ అందుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న భారత్‌.. తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి టోర్నీని గొప్పగా ఆరంభించాలని చూస్తోంది.

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్​

దుబాయ్‌

చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ (india vs pakistan match latest news) అంటే క్రికెట్‌ ప్రపంచానికే పూనకం వచ్చేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో ఐసీసీ టోర్నీల్లోనే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతోంది. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాక.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేననే ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిందే లేదు. తలపడ్డ 12సార్లూ టీమ్‌ఇండియాదే విజయం. ఈ ఘనమైన రికార్డుకు తోడు బలమైన జట్టుతో బరిలో దిగుతున్న భారత్‌.. పాక్‌పై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది.

5 - 0

T20 world cup 2021
బుమ్రా

టీ20 ప్రపంచకప్‌ల్లో గతంలో ఈ రెండు జట్ల మధ్య (ind vs pak match updates) జరిగిన అయిదు మ్యాచ్‌ల్లో భారత్‌దే విజయం. ఈసారి కూడా భారత్‌ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా చూస్తే జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. తుది జట్టు ఎంపిక ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్యకుమార్‌, కిషాన్‌ల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇక బౌలింగ్‌ వేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్యను కేవలం స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే ఆడిస్తారా? లేక రెండు విధాలా ఉపయోగపడే శార్దూల్‌ జట్టులోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరం. ఇక జడేజాతో కలిసి అశ్విన్‌ స్పిన్‌ భారాన్ని పంచుకోవచ్చు. అశ్విన్‌ వద్దనుకుంటే వరుణ్‌, రాహుల్‌ చాహర్‌ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ కీలకం కానున్నారు. టీ20ల్లో పాక్‌పై కోహ్లీకి మంచి రికార్డుంది. ఆరు మ్యాచ్‌ల్లో 84.66 సగటుతో 254 పరుగులు చేశాడు. ఇక పేస్‌ పదునుతో పాక్‌ బ్యాటర్లను కట్టడి చేసేందుకు బుమ్రా, షమి, భువి త్రయం సిద్ధమైంది.

T20 world cup 2021
రోహిత్​ శర్మ

పిచ్‌ ఎలా

దుబాయ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడి పరిస్థితుల ప్రకారం టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపాలి. కానీ ఛేదనలో తడబడే పాక్‌.. ఆ సాహసం చేయకపోవచ్చు. భారత్‌ కూడా టాస్‌ గెలిస్తే బ్యాటింగే చేయొచ్చు. ఇక్కడ టీ20 తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 144.

తుది జట్లు (అంచనా): భారత్‌: రోహిత్‌, రాహుల్‌, కోహ్లి, సూర్య, పంత్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌, అశ్విన్‌/వరుణ్‌, భువనేశ్వర్‌/షమి, బుమ్రా.

పాకిస్థాన్‌: బాబర్‌, రిజ్వాన్‌, ఫకార్‌, హఫీజ్‌/హైదర్‌ అలీ, మాలిక్‌, అసిఫ్‌, ఇమాద్‌ వసీమ్‌, షాదాబ్‌, హసన్‌ అలీ, హారిస్‌, షహీన్‌.

టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్‌ × పాక్‌

1. 2007 ప్రపంచకప్‌ గ్రూప్‌- డి మ్యాచ్‌లో భారత్‌, పాక్‌ తొలిసారి తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 141/9 స్కోరు చేయగా.. పాక్‌ కూడా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి అన్నే పరుగులు చేయడంతో టై అయింది. దీంతో బౌలౌట్‌ నిర్వహించగా.. టీమ్‌ఇండియా గెలిచింది.

2. 2007 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ అయిదు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 157/5 స్కోరు చేసింది. గంభీర్‌ (75) గొప్పగా పోరాడాడు. ఛేదనలో విజయానికి చేరువగా వచ్చిన పాక్‌ 152 పరుగులకు ఆలౌటైంది. జోగిందర్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌ మూడో బంతికి మిస్బా క్యాచ్‌ను శ్రీశాంత్‌ పట్టుకున్న దృశ్యం ఇప్పటికీ తాజాగానే ఉంది.

3. 2012లో సూపర్‌ 8 దశ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను మన బౌలర్లు 128కే ఆలౌట్‌ చేశారు. ఛేదనలో కోహ్లి 78 పరుగులతో అజేయంగా నిలవడంతో 17 ఓవర్లలో జట్టు లక్ష్యాన్ని చేరుకుంది.

4. 2014లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట పాక్‌ 20 ఓవర్లలో 130/7కే పరిమితం కాగా.. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారత్‌ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

5. 2016లో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది. నిర్ణీత ఓవర్లలో పాక్‌ 118/5 స్కోరు చేసింది. ఛేదనలో కోహ్లి (55 నాటౌట్‌) అజేయ అర్ధశతకంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ప్రత్యర్థికే అనుకూలం.. కానీ!

తమ దేశంలో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు ముందుకు రాకపోవడంతో యూఏఈలోనే పాక్‌ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడుతోంది. ఇక్కడి పిచ్‌లపై దానికున్నంత అవగాహన మరే జట్టుకు లేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ జరిగే దుబాయ్‌లో 2016 నుంచి ఇప్పటివరకూ ఆడిన ఆరు టీ20ల్లోనూ పాక్‌ గెలిచింది. ఇక్కడి పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయో.. వాటిపై ఎలా బ్యాటింగ్‌ చేయాలో ఆ జట్టు బ్యాటర్లకు కొట్టిన పిండే. ఇక గతేడాది పూర్తి ఐపీఎల్‌.. ఈ ఏడాది రెండో దశ పోటీలను యూఏఈలో ఆడడంతో భారత్‌కు ఇక్కడి పిచ్‌లు అలవాటు అయినట్లే కనిపిస్తున్నాయి. కానీ పాక్‌కు రెండో సొంతగడ్డ లాంటి ఈ వేదికలో దాన్ని ఓడించాలంటే టీమ్‌ఇండియా అందుకు తగిన వ్యూహాలు రచించాలి.

ఆ ముగ్గురే కీలకం

T20 world cup 2021
ఫకార్​ జమాన్​

ప్రపంచకప్‌ల్లో పాక్‌పై ఎంత మంచి రికార్డున్నా.. బలాబలాల్లో భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా.. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే కష్టమే. 2017లో ఇలా అంచనా వేసే భారత్‌ గట్టి ఎదురు దెబ్బ తింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో సంచలన సెంచరీతో ఫకార్‌.. టీమ్‌ఇండియాకు విజయాన్ని దూరం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి భారత్‌పై సత్తాచాటేందుకు అతను సిద్ధమయ్యాడు. ఇటీవల అతని ఫామ్‌ కూడా గొప్పగా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ల నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉంది. ఇక అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న బాబర్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌కు చేరిస్తే అంత మంచిది. అతను కుదురుకుంటే మన జట్టుకు ఇబ్బందులు తప్పవు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న రిజ్వాన్‌ (33 మ్యాచ్‌ల్లో 1462 పరుగులు)ను వీలైనంత త్వరగా ఔట్‌ చేయాల్సిందే. వయసు పెరుగుతున్నా సత్తా తగ్గని మాలిక్‌, హఫీజ్‌లతోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే.

T20 world cup 2021
టాప్​ బౌలర్​ షహీన్

బౌలింగ్‌లోనూ..: పాకిస్థాన్‌ బౌలింగ్‌లో ఎప్పుడూ బలమైన జట్టే. గత రెండేళ్లలో ప్రపంచ స్థాయి పేసర్‌గా ఎదిగిన షహీన్‌ షా అఫ్రిదితో భారత బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంకా హసన్‌ అలీ, హారిస్‌ రవూఫ్‌ లాంటి ప్రతిభావంతులైన పేసర్లు ఆ జట్టు సొంతం. షహీన్‌ను ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ ఎలా ఎదుర్కుంటారో చూడాలి. లోపలికి వచ్చే బంతులను ఆడడంలో వాళ్ల బలహీనతను ఈ పేసర్‌ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. స్పిన్నర్లు ఇమాద్‌, షాదాబ్‌లు ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌ కోసం 12 మంది జట్టును పాక్‌ ప్రకటించింది.

"పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు బయట నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మామూలే. మేం ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌. క్రికెట్‌ గురించి మాత్రమే ఆలోచించాలి. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇదొక మ్యాచ్‌లా భావించాలి. పాక్‌తో మ్యాచ్‌లో మైదానంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. కానీ మా మానసిక స్థితి, సన్నద్ధత మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి. తుది జట్టు వివరాలు వెల్లడించలేను. వీలైనంత సమతూకంతో కూడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌లో బరిలో దించుతాం. ప్రస్తుతం భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటీవల ఐపీఎల్‌ ఆడిన అనుభవంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తమ పాత్రలేంటో స్పష్టత ఉంది. టోర్నీకి మంచి సన్నద్ధతతో వచ్చాం"

- కోహ్లి

"గతం గురించి మాకవసరం లేదు. ఈ ప్రపంచకప్‌పైనే మా దృష్టి. మా సామర్థ్యం, నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టి మ్యాచ్‌లో వాటిని ప్రదర్శిస్తాం. పరిస్థితులను సాధారణంగా ఉంచడం, ప్రాథమిక అంశాలను పట్టించుకోవడం ముఖ్యం. ఇప్పటికే భారత్‌తో ప్రపంచకప్‌ల్లో ఆడాం. ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేశాం. ఆ జట్టుతో పోరును ఎంత సాధారణంగా ఉంచితే అంత మాకే మంచిది. ప్రశాంతంగా ఉండడం ప్రధానం. షోయబ్‌ స్పిన్‌ బాగా ఆడగలడు. అందుకే సర్ఫరాజ్‌ను కాదని అతణ్ని తుది జట్టులోకి తీసుకున్నాం"

- పాక్‌ కెప్టెన్‌ బాబర్‌

  • ఇప్పటివరకూ టీ20ల్లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడ్డ మ్యాచ్‌లు 8. భారత్‌ ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. పాక్‌ ఓ విజయం సాధించింది.
  • గత మూడేళ్లలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్‌ (1173) అగ్రస్థానంలో ఉన్నాడు. 993 పరుగులతో కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
  • టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌తో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి అజేయంగా నిలవడం విశేషం. 2012లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసిన అతను.. ఒక్కసారి కూడా ఔట్‌ కాలేదు.
  • టీ20 ప్రపంచకప్‌ల్లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు 5. ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది.
  • టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత్‌ నమోదు చేసిన అత్యధిక స్కోరు 157/5. 2007 ఫైనల్లో ప్రత్యర్థిపై భారత్‌ ఈ స్కోరు చేసింది.
    ఇదీ చదవండి:INS VS PAK T20: హై ఓల్టేజీ మ్యాచ్​లో పైచేయి ఎవరిదో!

ఓడితే కన్నీళ్లతో బరువెక్కే హృదయాలు.. ఆగ్రహంతో ఇళ్లలో బద్దలయ్యే టీవీలు.. ఓటమి బాధతో కొన్నిసార్లు (T20 world cup 2021) ఊపిరే ఆగిపోయే సందర్భాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయంటే.. అది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి!

T20 world cup 2021
భారత్- పాక్ మ్యాచ్

ఈ మ్యాచ్‌లో గెలిస్తే చాలు.. అదొక ఒక పండుగలా మారి దేశమంతా సంబరాలు చేసుకుంటుందంటే.. ఆ పండుగ వాతావరణాన్ని సృష్టించే ఇది కేవలం మ్యాచ్‌ మాత్రమే కాదు.. అంతకుమించి! అలాంటి అరుదైన పోరుకు రంగం సిద్ధమైంది. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసే ఆ రోజు రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో క్రికెట్‌ మైదానంలో భారత జట్టు యుద్ధం ఆదివారమే. అందుకు టీ20 ప్రపంచకప్‌ వేదికైంది. టైటిల్‌ అందుకోవడమే లక్ష్యంగా బరిలో దిగుతున్న భారత్‌.. తొలి మ్యాచ్‌లో పాక్‌ను ఓడించి టోర్నీని గొప్పగా ఆరంభించాలని చూస్తోంది.

T20 world cup 2021
టీ20 ప్రపంచకప్​

దుబాయ్‌

చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ (india vs pakistan match latest news) అంటే క్రికెట్‌ ప్రపంచానికే పూనకం వచ్చేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో ఐసీసీ టోర్నీల్లోనే ఈ జట్ల మధ్య పోరాటాలను చూసే అవకాశం కలుగుతోంది. చివరగా 2019 వన్డే ప్రపంచకప్‌లో తలపడ్డాక.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లో దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కోహ్లీసేననే ఫేవరేట్‌ అనడంలో సందేహం లేదు. వన్డేల్లో కానీ, టీ20ల్లో కానీ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో భారత్‌ ఓడిందే లేదు. తలపడ్డ 12సార్లూ టీమ్‌ఇండియాదే విజయం. ఈ ఘనమైన రికార్డుకు తోడు బలమైన జట్టుతో బరిలో దిగుతున్న భారత్‌.. పాక్‌పై మరోసారి ఆధిపత్యం ప్రదర్శించాలనే పట్టుదలతో ఉంది.

5 - 0

T20 world cup 2021
బుమ్రా

టీ20 ప్రపంచకప్‌ల్లో గతంలో ఈ రెండు జట్ల మధ్య (ind vs pak match updates) జరిగిన అయిదు మ్యాచ్‌ల్లో భారత్‌దే విజయం. ఈసారి కూడా భారత్‌ పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా చూస్తే జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. తుది జట్టు ఎంపిక ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్యకుమార్‌, కిషాన్‌ల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి. ఇక బౌలింగ్‌ వేయలేకపోతున్న హార్దిక్‌ పాండ్యను కేవలం స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే ఆడిస్తారా? లేక రెండు విధాలా ఉపయోగపడే శార్దూల్‌ జట్టులోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరం. ఇక జడేజాతో కలిసి అశ్విన్‌ స్పిన్‌ భారాన్ని పంచుకోవచ్చు. అశ్విన్‌ వద్దనుకుంటే వరుణ్‌, రాహుల్‌ చాహర్‌ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది. బ్యాటింగ్‌లో కోహ్లి, రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ కీలకం కానున్నారు. టీ20ల్లో పాక్‌పై కోహ్లీకి మంచి రికార్డుంది. ఆరు మ్యాచ్‌ల్లో 84.66 సగటుతో 254 పరుగులు చేశాడు. ఇక పేస్‌ పదునుతో పాక్‌ బ్యాటర్లను కట్టడి చేసేందుకు బుమ్రా, షమి, భువి త్రయం సిద్ధమైంది.

T20 world cup 2021
రోహిత్​ శర్మ

పిచ్‌ ఎలా

దుబాయ్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఇక్కడి పరిస్థితుల ప్రకారం టాస్‌ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపాలి. కానీ ఛేదనలో తడబడే పాక్‌.. ఆ సాహసం చేయకపోవచ్చు. భారత్‌ కూడా టాస్‌ గెలిస్తే బ్యాటింగే చేయొచ్చు. ఇక్కడ టీ20 తొలి ఇన్నింగ్స్‌ సగటు స్కోరు 144.

తుది జట్లు (అంచనా): భారత్‌: రోహిత్‌, రాహుల్‌, కోహ్లి, సూర్య, పంత్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌, అశ్విన్‌/వరుణ్‌, భువనేశ్వర్‌/షమి, బుమ్రా.

పాకిస్థాన్‌: బాబర్‌, రిజ్వాన్‌, ఫకార్‌, హఫీజ్‌/హైదర్‌ అలీ, మాలిక్‌, అసిఫ్‌, ఇమాద్‌ వసీమ్‌, షాదాబ్‌, హసన్‌ అలీ, హారిస్‌, షహీన్‌.

టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్‌ × పాక్‌

1. 2007 ప్రపంచకప్‌ గ్రూప్‌- డి మ్యాచ్‌లో భారత్‌, పాక్‌ తొలిసారి తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 141/9 స్కోరు చేయగా.. పాక్‌ కూడా నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి అన్నే పరుగులు చేయడంతో టై అయింది. దీంతో బౌలౌట్‌ నిర్వహించగా.. టీమ్‌ఇండియా గెలిచింది.

2. 2007 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ అయిదు పరుగుల తేడాతో పాక్‌పై గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 157/5 స్కోరు చేసింది. గంభీర్‌ (75) గొప్పగా పోరాడాడు. ఛేదనలో విజయానికి చేరువగా వచ్చిన పాక్‌ 152 పరుగులకు ఆలౌటైంది. జోగిందర్‌ శర్మ వేసిన ఆఖరి ఓవర్‌ మూడో బంతికి మిస్బా క్యాచ్‌ను శ్రీశాంత్‌ పట్టుకున్న దృశ్యం ఇప్పటికీ తాజాగానే ఉంది.

3. 2012లో సూపర్‌ 8 దశ మ్యాచ్‌లో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను మన బౌలర్లు 128కే ఆలౌట్‌ చేశారు. ఛేదనలో కోహ్లి 78 పరుగులతో అజేయంగా నిలవడంతో 17 ఓవర్లలో జట్టు లక్ష్యాన్ని చేరుకుంది.

4. 2014లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట పాక్‌ 20 ఓవర్లలో 130/7కే పరిమితం కాగా.. బ్యాటర్లు సమష్టిగా రాణించడంతో భారత్‌ 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది.

5. 2016లో ధోనీ సేన 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసింది. నిర్ణీత ఓవర్లలో పాక్‌ 118/5 స్కోరు చేసింది. ఛేదనలో కోహ్లి (55 నాటౌట్‌) అజేయ అర్ధశతకంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది.

ప్రత్యర్థికే అనుకూలం.. కానీ!

తమ దేశంలో క్రికెట్‌ ఆడేందుకు ఇతర దేశాలు ముందుకు రాకపోవడంతో యూఏఈలోనే పాక్‌ ఎక్కువగా మ్యాచ్‌లు ఆడుతోంది. ఇక్కడి పిచ్‌లపై దానికున్నంత అవగాహన మరే జట్టుకు లేదు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ జరిగే దుబాయ్‌లో 2016 నుంచి ఇప్పటివరకూ ఆడిన ఆరు టీ20ల్లోనూ పాక్‌ గెలిచింది. ఇక్కడి పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తాయో.. వాటిపై ఎలా బ్యాటింగ్‌ చేయాలో ఆ జట్టు బ్యాటర్లకు కొట్టిన పిండే. ఇక గతేడాది పూర్తి ఐపీఎల్‌.. ఈ ఏడాది రెండో దశ పోటీలను యూఏఈలో ఆడడంతో భారత్‌కు ఇక్కడి పిచ్‌లు అలవాటు అయినట్లే కనిపిస్తున్నాయి. కానీ పాక్‌కు రెండో సొంతగడ్డ లాంటి ఈ వేదికలో దాన్ని ఓడించాలంటే టీమ్‌ఇండియా అందుకు తగిన వ్యూహాలు రచించాలి.

ఆ ముగ్గురే కీలకం

T20 world cup 2021
ఫకార్​ జమాన్​

ప్రపంచకప్‌ల్లో పాక్‌పై ఎంత మంచి రికార్డున్నా.. బలాబలాల్లో భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్నా.. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే కష్టమే. 2017లో ఇలా అంచనా వేసే భారత్‌ గట్టి ఎదురు దెబ్బ తింది. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో సంచలన సెంచరీతో ఫకార్‌.. టీమ్‌ఇండియాకు విజయాన్ని దూరం చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మరోసారి భారత్‌పై సత్తాచాటేందుకు అతను సిద్ధమయ్యాడు. ఇటీవల అతని ఫామ్‌ కూడా గొప్పగా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌ల నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉంది. ఇక అన్ని ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్న బాబర్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌కు చేరిస్తే అంత మంచిది. అతను కుదురుకుంటే మన జట్టుకు ఇబ్బందులు తప్పవు. ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న రిజ్వాన్‌ (33 మ్యాచ్‌ల్లో 1462 పరుగులు)ను వీలైనంత త్వరగా ఔట్‌ చేయాల్సిందే. వయసు పెరుగుతున్నా సత్తా తగ్గని మాలిక్‌, హఫీజ్‌లతోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే.

T20 world cup 2021
టాప్​ బౌలర్​ షహీన్

బౌలింగ్‌లోనూ..: పాకిస్థాన్‌ బౌలింగ్‌లో ఎప్పుడూ బలమైన జట్టే. గత రెండేళ్లలో ప్రపంచ స్థాయి పేసర్‌గా ఎదిగిన షహీన్‌ షా అఫ్రిదితో భారత బ్యాట్స్‌మెన్‌ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇంకా హసన్‌ అలీ, హారిస్‌ రవూఫ్‌ లాంటి ప్రతిభావంతులైన పేసర్లు ఆ జట్టు సొంతం. షహీన్‌ను ఓపెనర్లు రోహిత్‌, రాహుల్‌ ఎలా ఎదుర్కుంటారో చూడాలి. లోపలికి వచ్చే బంతులను ఆడడంలో వాళ్ల బలహీనతను ఈ పేసర్‌ సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. స్పిన్నర్లు ఇమాద్‌, షాదాబ్‌లు ఫామ్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ మ్యాచ్‌ కోసం 12 మంది జట్టును పాక్‌ ప్రకటించింది.

"పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనగానే ఒత్తిడి ఉంటుంది. అంతేకాదు బయట నుంచి రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మామూలే. మేం ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌. క్రికెట్‌ గురించి మాత్రమే ఆలోచించాలి. మిగిలిన మ్యాచ్‌ల్లాగే ఇదొక మ్యాచ్‌లా భావించాలి. పాక్‌తో మ్యాచ్‌లో మైదానంలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. కానీ మా మానసిక స్థితి, సన్నద్ధత మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి. తుది జట్టు వివరాలు వెల్లడించలేను. వీలైనంత సమతూకంతో కూడిన జట్టునే పాక్‌తో మ్యాచ్‌లో బరిలో దించుతాం. ప్రస్తుతం భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇటీవల ఐపీఎల్‌ ఆడిన అనుభవంతో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తమ పాత్రలేంటో స్పష్టత ఉంది. టోర్నీకి మంచి సన్నద్ధతతో వచ్చాం"

- కోహ్లి

"గతం గురించి మాకవసరం లేదు. ఈ ప్రపంచకప్‌పైనే మా దృష్టి. మా సామర్థ్యం, నైపుణ్యాలపై శ్రద్ధ పెట్టి మ్యాచ్‌లో వాటిని ప్రదర్శిస్తాం. పరిస్థితులను సాధారణంగా ఉంచడం, ప్రాథమిక అంశాలను పట్టించుకోవడం ముఖ్యం. ఇప్పటికే భారత్‌తో ప్రపంచకప్‌ల్లో ఆడాం. ఛాంపియన్స్‌ ట్రోఫీలో అత్యుత్తమ ప్రదర్శన చేశాం. ఆ జట్టుతో పోరును ఎంత సాధారణంగా ఉంచితే అంత మాకే మంచిది. ప్రశాంతంగా ఉండడం ప్రధానం. షోయబ్‌ స్పిన్‌ బాగా ఆడగలడు. అందుకే సర్ఫరాజ్‌ను కాదని అతణ్ని తుది జట్టులోకి తీసుకున్నాం"

- పాక్‌ కెప్టెన్‌ బాబర్‌

  • ఇప్పటివరకూ టీ20ల్లో భారత్‌, పాకిస్థాన్‌ తలపడ్డ మ్యాచ్‌లు 8. భారత్‌ ఏడు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. పాక్‌ ఓ విజయం సాధించింది.
  • గత మూడేళ్లలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో బాబర్‌ (1173) అగ్రస్థానంలో ఉన్నాడు. 993 పరుగులతో కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
  • టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌తో ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లి అజేయంగా నిలవడం విశేషం. 2012లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసిన అతను.. ఒక్కసారి కూడా ఔట్‌ కాలేదు.
  • టీ20 ప్రపంచకప్‌ల్లో రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు 5. ఈ అన్ని మ్యాచ్‌ల్లోనూ భారతే గెలిచింది.
  • టీ20 ప్రపంచకప్‌ల్లో పాక్‌పై భారత్‌ నమోదు చేసిన అత్యధిక స్కోరు 157/5. 2007 ఫైనల్లో ప్రత్యర్థిపై భారత్‌ ఈ స్కోరు చేసింది.
    ఇదీ చదవండి:INS VS PAK T20: హై ఓల్టేజీ మ్యాచ్​లో పైచేయి ఎవరిదో!
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.