టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా అక్టోబర్ 24న పాకిస్థాన్తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్లో టీమ్ఇండియా అన్ని మ్యాచ్లు దాదాపు సాయంత్రం సమయంలోనే ఉన్నాయి. ఈ క్రమంలో పొగమంచు ఆటపై ప్రభావం చూపనుంది. దీనిపై టీమ్ఇండియా కోచ్ రవి శాస్త్రి స్పందించారు. పొగమంచు అధికంగా ఉంటే పేసర్లను రంగంలోకి దించుతామని పేర్కొన్నారు. వార్మప్ మ్యాచ్లోనే ఈ విషయాన్ని గ్రహించిన్నట్లు వెల్లడించారు.
"మ్యాచ్పై మంచు ఎంత మేరకు ప్రభావం చూపుతుందనే దానిపై ఆధారపడి మొదట బౌలింగ్/బ్యాటింగ్ ఏది తీసుకోవాలో నిర్ణయించుకుంటాం. దీనికి అనుగుణంగానే స్పిన్నర్ల/ ఫేసర్లను ఎవరిని బరిలోకి దించాలో తేలుస్తాం."
-రవిశాస్త్రి, టీమ్ఇండియా కెప్టెన్
పొగమంచు ఎక్కువగా ఉంటే స్పిన్నర్లకు బాల్పై గ్రిప్ దొరకదు. అందువల్ల బ్యాట్స్మెన్ అలవోకగా ఆడతారు. ఇలాంటి సమయంలో పిచ్ పేసర్లకు అనుకూలిస్తుంది. అందువల్లే ఏ జట్టైనా తేమను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును మారుస్తూ ఉంటుంది.
ఇదీ చదవండి: T20 world cup: 'ఇలా అయితే టీమ్ఇండియాకు విజయం కష్టమే..