ETV Bharat / sports

IND vs SL: భారత్​తో సిరీస్​కు లంక స్క్వాడ్​ ఇదే

టీమ్ఇండియాతో పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం జట్టును ప్రకటించింది లంక బోర్డు(IND vs SL). దసున్​ శనక(Dasun Shanaka) నేత్వత్వంలోని 23 మంది స్క్వాడ్​ను వెల్లడించింది. జులై 18 నుంచి ఈ సిరీస్​ ప్రారంభం కానుంది.

author img

By

Published : Jul 16, 2021, 7:18 PM IST

Updated : Jul 16, 2021, 7:32 PM IST

india vs sri lanka, dasun shanaka
ఇండియా vs శ్రీలంక, దసున్ శనక

టీమ్ఇండియాతో సిరీస్​ కోసం ఎట్టకేలకు స్క్వాడ్​ను ప్రకటించింది శ్రీలంక బోర్డు(IND vs SL). 23 మందితో కూడిన జట్టును దసున్​ శనక(Dasun Shanaka) సారథ్యం వహించనున్నాడు. శ్రీలంక క్రీడల మంత్రి నమల్​ రాజపక్సా నుంచి అధికారిక అనుమతి వచ్చాకే.. జట్టును ప్రకటించింది లంక బోర్డు.

ఈ పరిమిత ఓవర్ల సిరీస్​కు రెగ్యులర్​ కెప్టెన్ కుశాల్​ పెరీరా.. మోకాలి గాయంతో దూరం కాగా.. లెఫ్టార్మ్​ స్పిన్నర్​ బినురా ఫెర్నాండో చీలమండ గాయంతో తప్పుకున్నాడు.

బోర్డుతో సీనియర్​ క్రికెటర్లకు వేతనాల విషయంలో వివాదమున్నప్పటికీ.. వారిని స్క్వాడ్​లో చేర్చింది లంక బోర్డు. అయితే ఏంజెలో మాథ్యూస్​ మాత్రం.. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్​కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.

ఇంగ్లాండ్ పర్యటన అనంతరం బ్యాటింగ్ కోచ్​ గ్రాంట్​ ఫ్లవర్​, డేటా అనలిస్ట్​ జీటీ నిరోషన్​ కొవిడ్ బారిన పడ్డారు. దీంతో తొలుత సిరీస్​ జరగడం అనుమానంగా మారింది. కానీ చివరికి జులై 13న మొదలవ్వాల్సిన సిరీస్​.. జులై 18 నుంచి​ ప్రారంభంకానుంది. వన్డేల​తో మొదలు కానున్న పర్యటన టీ20లతో ముగుస్తుంది. జులై 18, 20, 23న వన్డేలు.. 25, 27, 29న టీ20లు జరుగుతాయి. ఈ మ్యాచ్​లన్నింటికి కొలోంబోలోని ఆర్​ ప్రేమదాస స్డేడియం వేదిక కానుంది.

శ్రీలంక స్క్వాడ్​..

దసున్​ శనక(కెప్టెన్), ధనంజయ డి సిల్వా(వైస్ కెప్టెన్), అవిశ్క ఫెర్నాండో, భానుక రాజపక్సా, పాథుమ్​ నిస్సాంక, చరిత్​ అసలంక, వనిందు హసరంగ, అశేన్​ బండారా, మినోద్​ భానుక, లాహిరు ఉదర, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుశ్మంత చమీరా, లక్షన్​ సందకన్​, అఖిల ధనంజయ, శిరన్ ఫెర్నాండో, ధనంజయ లక్షన్​, ఇషాన్​ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రమే, అశిత్​ ఫెర్నాండో, కసున్​ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదన.

ఇదీ చదవండి: 'వీళ్లు క్రికెటర్లా.. లేక రెజ్లర్లా?'

టీమ్ఇండియాతో సిరీస్​ కోసం ఎట్టకేలకు స్క్వాడ్​ను ప్రకటించింది శ్రీలంక బోర్డు(IND vs SL). 23 మందితో కూడిన జట్టును దసున్​ శనక(Dasun Shanaka) సారథ్యం వహించనున్నాడు. శ్రీలంక క్రీడల మంత్రి నమల్​ రాజపక్సా నుంచి అధికారిక అనుమతి వచ్చాకే.. జట్టును ప్రకటించింది లంక బోర్డు.

ఈ పరిమిత ఓవర్ల సిరీస్​కు రెగ్యులర్​ కెప్టెన్ కుశాల్​ పెరీరా.. మోకాలి గాయంతో దూరం కాగా.. లెఫ్టార్మ్​ స్పిన్నర్​ బినురా ఫెర్నాండో చీలమండ గాయంతో తప్పుకున్నాడు.

బోర్డుతో సీనియర్​ క్రికెటర్లకు వేతనాల విషయంలో వివాదమున్నప్పటికీ.. వారిని స్క్వాడ్​లో చేర్చింది లంక బోర్డు. అయితే ఏంజెలో మాథ్యూస్​ మాత్రం.. వ్యక్తిగత కారణాలతో ఈ సిరీస్​కు దూరమవుతున్నట్లు ప్రకటించాడు.

ఇంగ్లాండ్ పర్యటన అనంతరం బ్యాటింగ్ కోచ్​ గ్రాంట్​ ఫ్లవర్​, డేటా అనలిస్ట్​ జీటీ నిరోషన్​ కొవిడ్ బారిన పడ్డారు. దీంతో తొలుత సిరీస్​ జరగడం అనుమానంగా మారింది. కానీ చివరికి జులై 13న మొదలవ్వాల్సిన సిరీస్​.. జులై 18 నుంచి​ ప్రారంభంకానుంది. వన్డేల​తో మొదలు కానున్న పర్యటన టీ20లతో ముగుస్తుంది. జులై 18, 20, 23న వన్డేలు.. 25, 27, 29న టీ20లు జరుగుతాయి. ఈ మ్యాచ్​లన్నింటికి కొలోంబోలోని ఆర్​ ప్రేమదాస స్డేడియం వేదిక కానుంది.

శ్రీలంక స్క్వాడ్​..

దసున్​ శనక(కెప్టెన్), ధనంజయ డి సిల్వా(వైస్ కెప్టెన్), అవిశ్క ఫెర్నాండో, భానుక రాజపక్సా, పాథుమ్​ నిస్సాంక, చరిత్​ అసలంక, వనిందు హసరంగ, అశేన్​ బండారా, మినోద్​ భానుక, లాహిరు ఉదర, రమేష్ మెండిస్, చమిక కరుణరత్నే, దుశ్మంత చమీరా, లక్షన్​ సందకన్​, అఖిల ధనంజయ, శిరన్ ఫెర్నాండో, ధనంజయ లక్షన్​, ఇషాన్​ జయరత్నే, ప్రవీణ్ జయవిక్రమే, అశిత్​ ఫెర్నాండో, కసున్​ రజిత, లాహిరు కుమార, ఇసురు ఉదన.

ఇదీ చదవండి: 'వీళ్లు క్రికెటర్లా.. లేక రెజ్లర్లా?'

Last Updated : Jul 16, 2021, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.