ETV Bharat / sports

'జట్టులో స్థానం గురించి అసలు ఆలోచించను!'

author img

By

Published : Feb 28, 2022, 12:52 PM IST

IND VS SL Shreyas Iyer: శ్రీలంక సిరీస్​లో ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ సాధించిన శ్రేయస్​ అయ్యర్​ తన ప్రదర్శనపై స్పందించాడు. ఆడిన మూడు మ్యాచుల్లోను అర్థశతకాలు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. జట్టులో తన బ్యాటింగ్​ స్థానం గురించి అసలు ఆలోచించనని చెప్పాడు.

Shreyas iyer
శ్రేయస్​ అయ్యర్

IND VS SL Shreyas Iyer: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అవార్డు అందుకున్న శ్రేయస్​ అయ్యర్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మూడు మ్యాచులాడిన అయ్యర్​ అన్నింటిలోనూ అర్థశతకాలు సాధించి 204 పరుగులు చేశాడు. చివరి టీ20లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్​ అనంతరం తన ప్రదర్శనపై స్పందించిన అతడు హర్షం వ్యక్తం చేశాడు.

"ఈ టీ20 సిరీస్​లో మంచి ప్రదర్శన చేశాను. ప్రస్తుతం నాకు కొంత విశ్రాంతి కావాలి. ఎక్కువగా ఆలోచించకుండా ఈ క్షణాన్ని అనుభవిస్తాను. టీ20లో టాప్​ ఆర్డర్​లో ఆడేటప్పుడు మంచి ఇన్నింగ్స్​ను నిర్మించగలం. మిడిల్​ఆర్డర్​లో వస్తే మెుదటి బాల్​ నుంచి ధాటిగా ఆడాల్సి ఉంటుంది. మా జట్టులో చాలా పోటి ఉంది. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సంతోషంగా గడుపుతాను. ప్రతి ఆటను ముగించాలనే ఉద్దేశంతోనే ఆడతాను. నా బ్యాటింగ్​ స్థానం, పోటీ గురించి ఆలోచించను. ఏ స్థానంలోనైనా ఆడేలా మలుచుకుంటాను. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే అనుకుంటాను. దాని కోసమే శాయశక్తులా కృషిచేస్తాను. దీనికోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాను. ప్రతి ఆటగాడికి బలం, బలహీనత ఉంటాయి. నా బలాల పైన దృష్టి పెడతాను. షార్ట్​ బాల్​ నా బలహీనత అని అనుకుంటారు. కానీ నేను దాన్ని పట్టించుకోను. శ్రీలంక ప్లేయర్​ షనక గత రెండు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడాడు. బంతులను అలవోకగా బౌండరీలు దాటించాడు. ఈ పరిస్థితుల్లో మా బౌలర్లను నిదించలేము. మా ప్లాన్లతో వచ్చాము కానీ అతడు మా బౌలర్లపై పైచేయి సాధించాడు."

-శ్రేయస్​ అయ్యర్​, టీమ్​ఇండియా బ్యాటర్​.

శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచులో భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును 146 పరుగులకే కట్టడి చేశారు. లంక కెప్టెన్​ షనక 74 పరుగులతో పోరాడాడు. అవేశ్​ఖాన్​ రెండు వికెట్లు, సిరాజ్​,హర్షల్​ పటేల్​, రవి బిష్ణోయ్​ తలో వికెట్​ తీశారు. ఈ లక్ష్యాన్ని భారత్​ 16.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఇదీ చదవండి: పంజాబ్​ కింగ్స్ కొత్త​ కెప్టెన్​గా మయాంక్​.. అధికార ప్రకటన

IND VS SL Shreyas Iyer: శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో ప్లేయర్​ ఆఫ్​ ది సిరీస్​ అవార్డు అందుకున్న శ్రేయస్​ అయ్యర్​పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మూడు మ్యాచులాడిన అయ్యర్​ అన్నింటిలోనూ అర్థశతకాలు సాధించి 204 పరుగులు చేశాడు. చివరి టీ20లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. మ్యాచ్​ అనంతరం తన ప్రదర్శనపై స్పందించిన అతడు హర్షం వ్యక్తం చేశాడు.

"ఈ టీ20 సిరీస్​లో మంచి ప్రదర్శన చేశాను. ప్రస్తుతం నాకు కొంత విశ్రాంతి కావాలి. ఎక్కువగా ఆలోచించకుండా ఈ క్షణాన్ని అనుభవిస్తాను. టీ20లో టాప్​ ఆర్డర్​లో ఆడేటప్పుడు మంచి ఇన్నింగ్స్​ను నిర్మించగలం. మిడిల్​ఆర్డర్​లో వస్తే మెుదటి బాల్​ నుంచి ధాటిగా ఆడాల్సి ఉంటుంది. మా జట్టులో చాలా పోటి ఉంది. నాకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సంతోషంగా గడుపుతాను. ప్రతి ఆటను ముగించాలనే ఉద్దేశంతోనే ఆడతాను. నా బ్యాటింగ్​ స్థానం, పోటీ గురించి ఆలోచించను. ఏ స్థానంలోనైనా ఆడేలా మలుచుకుంటాను. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే అనుకుంటాను. దాని కోసమే శాయశక్తులా కృషిచేస్తాను. దీనికోసం ప్రత్యేకంగా సన్నద్ధం కాను. ప్రతి ఆటగాడికి బలం, బలహీనత ఉంటాయి. నా బలాల పైన దృష్టి పెడతాను. షార్ట్​ బాల్​ నా బలహీనత అని అనుకుంటారు. కానీ నేను దాన్ని పట్టించుకోను. శ్రీలంక ప్లేయర్​ షనక గత రెండు మ్యాచుల్లోనూ అద్భుతంగా ఆడాడు. బంతులను అలవోకగా బౌండరీలు దాటించాడు. ఈ పరిస్థితుల్లో మా బౌలర్లను నిదించలేము. మా ప్లాన్లతో వచ్చాము కానీ అతడు మా బౌలర్లపై పైచేయి సాధించాడు."

-శ్రేయస్​ అయ్యర్​, టీమ్​ఇండియా బ్యాటర్​.

శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచులో భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును 146 పరుగులకే కట్టడి చేశారు. లంక కెప్టెన్​ షనక 74 పరుగులతో పోరాడాడు. అవేశ్​ఖాన్​ రెండు వికెట్లు, సిరాజ్​,హర్షల్​ పటేల్​, రవి బిష్ణోయ్​ తలో వికెట్​ తీశారు. ఈ లక్ష్యాన్ని భారత్​ 16.5 ఓవర్లలోనే ఛేదించింది.

ఇదీ చదవండి: పంజాబ్​ కింగ్స్ కొత్త​ కెప్టెన్​గా మయాంక్​.. అధికార ప్రకటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.