ETV Bharat / sports

IPL 2021: ఆర్​సీబీలోకి వరల్డ్​ నెం.2 బౌలర్​!​

author img

By

Published : Jul 31, 2021, 12:31 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​-14 రెండో అర్ధభాగం సెప్టెంబర్​ 19 నుంచి షురూ కానుంది. అయితే.. కరోనా నేపథ్యంలో జట్ల నుంచి తప్పుకున్న కొందరు ప్లేయర్ల స్థానంలో వేరే వారిని తీసుకునేందుకు ఫ్రాంఛైజీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో బాగా రాణిస్తున్న ఓ క్రికెటర్​ను తీసుకునేందుకు ఆర్​సీబీ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

RCB likely to rope in Wanindu Hasaranga
ఆర్​సీబీలోకి వనిందు హసరంగ

ఐపీఎల్​.. ప్రతిభ కలిగిన క్రికెటర్లు తమను తాము నిరూపించుకునేందుకు చక్కని వేదిక. ఈ ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.. ఎంతో మంది కుర్రాళ్లను భారత క్రికెట్​కు అందించింది. వారంతా చక్కగా రాణిస్తున్నారు కూడా. టీమ్​ ఇండియాలో పాండ్య బ్రదర్స్​, బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, పృథ్వీ షా.. ఇలా ఎందరో ఐపీఎల్​లో చెలరేగి జాతీయ జట్టులోకి వచ్చిన వాళ్లే.

కాసుల వర్షం కురిపించే ఈ లీగ్​లో ఆడాలని.. విదేశీ ఆటగాళ్లూ ఊవిళ్లూరుతుంటారు. ఎక్కడైనా ఎవరైనా బాగా ఆడితే.. వారు తమ జట్టులో ఉండాలని కోరుకొనే ఫ్రాంఛైజీలకు కొదువే ఉండదు. ఇటీవలి కాలంలో.. బాగా రాణించిన శ్రీలంక స్పిన్​ ఆల్​రౌండర్​ వనిందు హసరంగపైనా ఇప్పుడు ఫ్రాంఛైజీల దృష్టి పడింది. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్​సీబీ) ఇతడిని తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Wanindu Hasaranga
వనిందు హసరంగ

కరోనా సహా వ్యక్తిగత కారణాలతో భారత్​లో నిర్వహించిన ఐపీఎల్​-14కు(తొలి అర్ధభాగం) చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఆర్​సీబీ నుంచి కూడా ఆస్ట్రేలియా స్పిన్నర్​ ఆడమ్​ జంపా.. ఆదిలోనే తప్పుకున్నాడు. ఇతని స్థానంలోనే ఇప్పుడు హసరంగను తీసుకోవాలని ఆర్​సీబీ అనుకుంటున్నట్లు తెలిసింది. ఒకవేళ.. హసరంగ బెంగళూరు జట్టులో చేరితే స్పిన్​ విభాగం బలంగా తయారవుతుంది. టాప్​ స్పిన్నర్లైన యుజ్వేంద్ర చాహల్​, హసరంగను ఎదుర్కోవడం బ్యాట్స్​మెన్​కు కష్టమే. హసరంగ.. బ్యాట్​తోనూ చివర్లో వేగంగా పరుగులు చేయగలడు.

ఐపీఎల్​-14 తొలి అర్ధభాగంలో ఏడు మ్యాచ్​లాడిన బెంగళూరు 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఇండియా సిరీస్​తో వెలుగులోకి..

24 ఏళ్ల ఈ లంక స్పిన్నర్​.. ఇటీవల ఇండియాతో జరిగిన సిరీస్​లో రాణించాడు. టీ-20 సిరీస్​లో 7 వికెట్లు తీసి ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నీగా నిలిచాడు. చివరి మ్యాచ్​లో 4 ఓవర్లు వేసి.. 9 పరుగులకే 4 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే రోజు అతని పుట్టినరోజు కావడం మరో విశేషం.

Wanindu Hasaranga
ఇండియాతో టీ-20 సిరీస్​లో ధావన్​ను ఔట్​ చేసిన ఆనందంలో లంక స్పిన్నర్​

ఇటీవల ప్రకటించిన టీ-20 బౌలర్ల ర్యాంకింగ్స్​లో హసరంగ.. తన కెరీర్​లో అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం ఐపీఎల్​లో ఒక్క లంక ప్లేయర్​ను కూడా ప్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.

సెప్టెంబర్​ 19 నుంచి షురూ..

ఐపీఎల్​ 2021.. యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19న తిరిగి ప్రారంభం కానుంది. రెండో దశలో తొలి మ్యాచ్​ ముంబయి ఇండియన్స్​- చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరగనుంది.

క్వాలిఫయర్​ 1, క్వాలిఫయర్​ 2.. అక్టోబర్​ 10, 13 తేదీల్లో జరగనుండగా.. ఎలిమినేటర్​ అక్టోబర్​ 11న నిర్వహించనున్నారు. ఇక ఫైనల్​ అక్టోబర్​ 15న జరగనుంది.

యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​కు విదేశీ క్రికెటర్లు అందరూ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్​కు ముందే కరిబీయన్ ప్రీమియర్​ లీగ్​ ముగించేలా వెస్టిండీస్​ క్రికెట్​తో చర్చలు జరిపింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్​ 15 వరకు కరిబీయన్​ ప్రీమియర్ లీగ్​ జరిగేలా ఏర్పాట్లు చేశారు అక్కడి నిర్వాహకులు.

ఇదీ చూడండి: IPL 2021: సెప్టెంబర్​ 19 నుంచి ఐపీఎల్​.. పూర్తి షెడ్యూల్​ ఇదే

ఐపీఎల్​.. ప్రతిభ కలిగిన క్రికెటర్లు తమను తాము నిరూపించుకునేందుకు చక్కని వేదిక. ఈ ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​.. ఎంతో మంది కుర్రాళ్లను భారత క్రికెట్​కు అందించింది. వారంతా చక్కగా రాణిస్తున్నారు కూడా. టీమ్​ ఇండియాలో పాండ్య బ్రదర్స్​, బుమ్రా, సూర్యకుమార్​ యాదవ్​, ఇషాన్​ కిషన్​, పృథ్వీ షా.. ఇలా ఎందరో ఐపీఎల్​లో చెలరేగి జాతీయ జట్టులోకి వచ్చిన వాళ్లే.

కాసుల వర్షం కురిపించే ఈ లీగ్​లో ఆడాలని.. విదేశీ ఆటగాళ్లూ ఊవిళ్లూరుతుంటారు. ఎక్కడైనా ఎవరైనా బాగా ఆడితే.. వారు తమ జట్టులో ఉండాలని కోరుకొనే ఫ్రాంఛైజీలకు కొదువే ఉండదు. ఇటీవలి కాలంలో.. బాగా రాణించిన శ్రీలంక స్పిన్​ ఆల్​రౌండర్​ వనిందు హసరంగపైనా ఇప్పుడు ఫ్రాంఛైజీల దృష్టి పడింది. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్​సీబీ) ఇతడిని తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Wanindu Hasaranga
వనిందు హసరంగ

కరోనా సహా వ్యక్తిగత కారణాలతో భారత్​లో నిర్వహించిన ఐపీఎల్​-14కు(తొలి అర్ధభాగం) చాలా మంది విదేశీ ఆటగాళ్లు దూరమయ్యారు. ఆర్​సీబీ నుంచి కూడా ఆస్ట్రేలియా స్పిన్నర్​ ఆడమ్​ జంపా.. ఆదిలోనే తప్పుకున్నాడు. ఇతని స్థానంలోనే ఇప్పుడు హసరంగను తీసుకోవాలని ఆర్​సీబీ అనుకుంటున్నట్లు తెలిసింది. ఒకవేళ.. హసరంగ బెంగళూరు జట్టులో చేరితే స్పిన్​ విభాగం బలంగా తయారవుతుంది. టాప్​ స్పిన్నర్లైన యుజ్వేంద్ర చాహల్​, హసరంగను ఎదుర్కోవడం బ్యాట్స్​మెన్​కు కష్టమే. హసరంగ.. బ్యాట్​తోనూ చివర్లో వేగంగా పరుగులు చేయగలడు.

ఐపీఎల్​-14 తొలి అర్ధభాగంలో ఏడు మ్యాచ్​లాడిన బెంగళూరు 5 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.

ఇండియా సిరీస్​తో వెలుగులోకి..

24 ఏళ్ల ఈ లంక స్పిన్నర్​.. ఇటీవల ఇండియాతో జరిగిన సిరీస్​లో రాణించాడు. టీ-20 సిరీస్​లో 7 వికెట్లు తీసి ప్లేయర్​ ఆఫ్​ ది టోర్నీగా నిలిచాడు. చివరి మ్యాచ్​లో 4 ఓవర్లు వేసి.. 9 పరుగులకే 4 వికెట్లు తీసి అందరి దృష్టినీ ఆకర్షించాడు. అదే రోజు అతని పుట్టినరోజు కావడం మరో విశేషం.

Wanindu Hasaranga
ఇండియాతో టీ-20 సిరీస్​లో ధావన్​ను ఔట్​ చేసిన ఆనందంలో లంక స్పిన్నర్​

ఇటీవల ప్రకటించిన టీ-20 బౌలర్ల ర్యాంకింగ్స్​లో హసరంగ.. తన కెరీర్​లో అత్యుత్తమంగా రెండో స్థానంలో నిలిచాడు.

ప్రస్తుతం ఐపీఎల్​లో ఒక్క లంక ప్లేయర్​ను కూడా ప్రాంఛైజీలు కొనుగోలు చేయలేదు.

సెప్టెంబర్​ 19 నుంచి షురూ..

ఐపీఎల్​ 2021.. యూఏఈ వేదికగా సెప్టెంబర్​ 19న తిరిగి ప్రారంభం కానుంది. రెండో దశలో తొలి మ్యాచ్​ ముంబయి ఇండియన్స్​- చెన్నై సూపర్​ కింగ్స్​ మధ్య జరగనుంది.

క్వాలిఫయర్​ 1, క్వాలిఫయర్​ 2.. అక్టోబర్​ 10, 13 తేదీల్లో జరగనుండగా.. ఎలిమినేటర్​ అక్టోబర్​ 11న నిర్వహించనున్నారు. ఇక ఫైనల్​ అక్టోబర్​ 15న జరగనుంది.

యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్​కు విదేశీ క్రికెటర్లు అందరూ అందుబాటులో ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్​కు ముందే కరిబీయన్ ప్రీమియర్​ లీగ్​ ముగించేలా వెస్టిండీస్​ క్రికెట్​తో చర్చలు జరిపింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్​ 15 వరకు కరిబీయన్​ ప్రీమియర్ లీగ్​ జరిగేలా ఏర్పాట్లు చేశారు అక్కడి నిర్వాహకులు.

ఇదీ చూడండి: IPL 2021: సెప్టెంబర్​ 19 నుంచి ఐపీఎల్​.. పూర్తి షెడ్యూల్​ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.