శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వరుస ఓటములు, బోర్డు-క్రికెటర్ల మధ్య విభేదాలు రావడమే ఇందుకు కారణం. ఇందులో భాగంగా జాతీయ కాంట్రాక్ట్పై సంతకం చేయడానికి అక్కడి స్టార్ క్రికెటర్లు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. సీనియర్ బ్యాట్స్మన్ ఏంజిలో మాథ్యూస్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని బోర్డుకు కూడా చెప్పినట్లు తెలిసింది.
భారత్తో సిరీస్కు ఔట్
మరోవైరు భారత్తో జరిగే మూడు వన్డేలు(జులై 13-18) మూడు టీ20లు(జూలై 21-25) సిరీస్కు 30మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది లంకబోర్డు. వీరంతా జాతీయ కాంట్రాక్ట్పై సంతకాలు చేయడానికి అంగీకరించడం వల్ల వీరిని బోర్డు తీసుకుంది. ఇందులో మాథ్యూస్ కూడా ఉన్నాడు. అయితే ప్రస్తుతం వ్యక్తిగత కారణాల వల్ల అతడు ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించింది.
లంక బోర్డు కాంట్రాక్ట్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన ఆటగాళ్లను ముందుండి నడిపించిన మాథ్యూస్.. అనూహ్యంగా కాంట్రాక్ట్పై సంతకం చేయడానికి అంగీకరించడం గమనార్హం. 2009లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి మాథ్యూస్.. కెరీర్లో 90 టెస్టులు(6,236), 218 వన్డేలు(5,835), 78 టీ20లు(1148) ఆడాడు.
ఇదీ చూడండి: 'ప్లేయర్ ఆఫ్ ది మంత్' రేసులో షెఫాలీ, స్నేహ్ రాణా