ETV Bharat / sports

దిల్లీ తడ'బ్యాటు'.. రాజస్థాన్ లక్ష్యం 148

author img

By

Published : Apr 15, 2021, 9:17 PM IST

వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల రాజస్థాన్​కు 148 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది దిల్లీ. ముంబయి వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది.

IPL: Delhi capitlas first innings against Rajasthan royals
దిల్లీ తడ'బ్యాటు'.. రాజస్థాన్ లక్ష్యం 150

రాజస్థాన్​ జట్టుతో మ్యాచ్​లో దిల్లీ బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది దిల్లీ. కెప్టెన్ పంత్ అర్ధశతకంతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీకి ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీషా(2), ధావన్​(9) సహా రహానె(8), స్టోయినిస్(0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం కెప్టెన్ పంత్​(51) కొత్త కుర్రాడు లలిత్ యాదవ్​తో(20) కలిసి స్కోరును మెల్లగా పెంచాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు.

IPL: Delhi capitlas first innings against Rajasthan royals
పంత్

మిగతా బ్యాట్స్​మెన్​లో టామ్ కరన్(21), వోక్స్(15), అశ్విన్(7).. ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ 2, మోరిస్ ఓ వికెట్ పడగొట్టారు.

రాజస్థాన్​ జట్టుతో మ్యాచ్​లో దిల్లీ బ్యాట్స్​మెన్​ తడబడ్డారు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం వల్ల, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది దిల్లీ. కెప్టెన్ పంత్ అర్ధశతకంతో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన దిల్లీకి ప్రారంభంలో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు పృథ్వీషా(2), ధావన్​(9) సహా రహానె(8), స్టోయినిస్(0) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం కెప్టెన్ పంత్​(51) కొత్త కుర్రాడు లలిత్ యాదవ్​తో(20) కలిసి స్కోరును మెల్లగా పెంచాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం చేసిన తర్వాత రనౌట్ అయ్యాడు.

IPL: Delhi capitlas first innings against Rajasthan royals
పంత్

మిగతా బ్యాట్స్​మెన్​లో టామ్ కరన్(21), వోక్స్(15), అశ్విన్(7).. ఎక్కువ పరుగులు చేయలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో ఉనద్కత్ 3, ముస్తాఫిజుర్ 2, మోరిస్ ఓ వికెట్ పడగొట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.