ETV Bharat / sports

'ఐదారు గేమ్​లు ఓడిపోతే తప్ప ముంబయి నిద్రలేవదు'

author img

By

Published : Apr 16, 2022, 1:50 PM IST

Mumbai Indians Shoaib Akthar: వరుస ఓటములతో చతికిలపడిన ముంబయి ఇండియన్స్ జట్టు తిరిగి పుంజుకుంటుందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ధీమా వ్యక్తం చేశాడు. ఆ జట్టుకు మంచి మేనేజ్​మెంట్ ఉందని... గతంలోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొందని చెప్పుకొచ్చాడు.

mumbai indians shoaib akthar
mumbai indians shoaib akthar

Mumbai Indians Shoaib Akthar: ఐపీఎల్​లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్​లో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్​లలో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే, శనివారం లఖ్​నవూతో జరిగే మ్యాచ్​లో ముంబయి తిరిగి గాడిన పడుతుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్​ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్​లో తొలి విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గతంలోనూ ముంబయి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొందని గుర్తు చేశాడు.

IPL 2022: 'ఐదు, ఆరు గేమ్​లు ఓడిపోతే తప్ప ముంబయి నిద్రలో నుంచి లేవదు. ఇది గత ఐపీఎల్ సీజన్లలోనూ చూశాం. వరుస ఓటముల నుంచి పుంజుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆ జట్టుకు మంచి మేనేజ్​మెంట్ ఉంది. వేలంలో కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ.. ఇప్పుడు వారు మెరుగ్గా ఆడతారనే నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చాడు అక్తర్. అదేసమయంలో.. గుజరాత్, లఖ్​నవూ జట్లు చాలా బాగా ఆడుతున్నాయని ప్రశంసించాడు. ఈ రెండు టీమ్​లలో ఒకటి ఫైనల్​కు వెళ్తే బాగుంటుందని అన్నాడు.

Mumbai Indians Akash Chopra: మరోవైపు, ముంబయి తీరుపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులోని ఆటగాళ్లను ముంబయి ఇండియన్స్ సరిగా ఉపయోగించుకోవడం లేదని అన్నాడు. టిమ్ డేవిడ్ వంటి ఆటగాడికి రెండో అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. 'మా బెస్ట్ టీమ్​తో ఆడుతున్నామని ముంబయి హెడ్ కోచ్ మహేల జయవర్ధనె చెబుతున్నాడు. కానీ, తుది జట్టు విషయంలో ముంబయి స్పష్టతతో లేదని తెలుస్తోంది. ఇదే వారి ఉత్తమ జట్టు అయితే టిమ్ డేవిడ్, ఫాబియన్ అలెన్, రిలీ మెరెడిత్ వంటి ఆటగాళ్లను ఎందుకు వేలంలో కొనుగోలు చేశారు? ఇద్దరు లేదా ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఆడాలనుకుంటే వీరంతా ఎందుకు?' అని ప్రశ్నించాడు.

అదేసమయంలో, పొలార్డ్ విషయంలోనూ ఆకాశ్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫామ్​లో లేని పొలార్డ్​ను తుది జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించాడు. 'టీమ్​లో బ్యాలెన్స్ లేదు. ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో ముంబయి బరిలోకి దిగుతోంది. లోయర్ ఆర్డర్​లో ఆల్​రౌండర్లు ఉండటం లేదు. సూపర్ ఫామ్​లో ఉన్న సూర్యకుమార్ యాదవ్​ను ఐదో స్థానంలో పంపిస్తున్నారు. ఇలాగేనా అతడిని ఉపయోగించుకునేది?' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. సింగపూర్ ఆల్​రౌండర్ అయిన టిమ్ డేవిడ్​ను రూ.8.25 కోట్లకు ముంబయి కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్​లలో విఫలమైన నేపథ్యంలో తుది జట్టు నుంచి తప్పించింది.

ఇదీ చదవండి: ధనాధన్‌ బ్యాటింగ్‌.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రికార్డు అర్ధశతకాలివే

Mumbai Indians Shoaib Akthar: ఐపీఎల్​లో అత్యధిక టైటిళ్లు గెలిచిన ముంబయి ఇండియన్స్.. ఈ సీజన్​లో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్​లలో ఒక్కదాంట్లోనూ గెలవలేదు. దీంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. అయితే, శనివారం లఖ్​నవూతో జరిగే మ్యాచ్​లో ముంబయి తిరిగి గాడిన పడుతుందని పాకిస్థాన్ మాజీ ఫాస్ట్​ బౌలర్ షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్​లో తొలి విజయాన్ని నమోదు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. గతంలోనూ ముంబయి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొందని గుర్తు చేశాడు.

IPL 2022: 'ఐదు, ఆరు గేమ్​లు ఓడిపోతే తప్ప ముంబయి నిద్రలో నుంచి లేవదు. ఇది గత ఐపీఎల్ సీజన్లలోనూ చూశాం. వరుస ఓటముల నుంచి పుంజుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆ జట్టుకు మంచి మేనేజ్​మెంట్ ఉంది. వేలంలో కొన్ని తప్పిదాలు చేసినప్పటికీ.. ఇప్పుడు వారు మెరుగ్గా ఆడతారనే నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చాడు అక్తర్. అదేసమయంలో.. గుజరాత్, లఖ్​నవూ జట్లు చాలా బాగా ఆడుతున్నాయని ప్రశంసించాడు. ఈ రెండు టీమ్​లలో ఒకటి ఫైనల్​కు వెళ్తే బాగుంటుందని అన్నాడు.

Mumbai Indians Akash Chopra: మరోవైపు, ముంబయి తీరుపై భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టులోని ఆటగాళ్లను ముంబయి ఇండియన్స్ సరిగా ఉపయోగించుకోవడం లేదని అన్నాడు. టిమ్ డేవిడ్ వంటి ఆటగాడికి రెండో అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాడు. 'మా బెస్ట్ టీమ్​తో ఆడుతున్నామని ముంబయి హెడ్ కోచ్ మహేల జయవర్ధనె చెబుతున్నాడు. కానీ, తుది జట్టు విషయంలో ముంబయి స్పష్టతతో లేదని తెలుస్తోంది. ఇదే వారి ఉత్తమ జట్టు అయితే టిమ్ డేవిడ్, ఫాబియన్ అలెన్, రిలీ మెరెడిత్ వంటి ఆటగాళ్లను ఎందుకు వేలంలో కొనుగోలు చేశారు? ఇద్దరు లేదా ముగ్గురు విదేశీ ఆటగాళ్లతోనే ఆడాలనుకుంటే వీరంతా ఎందుకు?' అని ప్రశ్నించాడు.

అదేసమయంలో, పొలార్డ్ విషయంలోనూ ఆకాశ్ చోప్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఫామ్​లో లేని పొలార్డ్​ను తుది జట్టులోకి ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించాడు. 'టీమ్​లో బ్యాలెన్స్ లేదు. ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్లతో ముంబయి బరిలోకి దిగుతోంది. లోయర్ ఆర్డర్​లో ఆల్​రౌండర్లు ఉండటం లేదు. సూపర్ ఫామ్​లో ఉన్న సూర్యకుమార్ యాదవ్​ను ఐదో స్థానంలో పంపిస్తున్నారు. ఇలాగేనా అతడిని ఉపయోగించుకునేది?' అని చెప్పుకొచ్చాడు ఆకాశ్. సింగపూర్ ఆల్​రౌండర్ అయిన టిమ్ డేవిడ్​ను రూ.8.25 కోట్లకు ముంబయి కొనుగోలు చేసింది. తొలి మ్యాచ్​లలో విఫలమైన నేపథ్యంలో తుది జట్టు నుంచి తప్పించింది.

ఇదీ చదవండి: ధనాధన్‌ బ్యాటింగ్‌.. ఈ ఐపీఎల్ సీజన్‌లో రికార్డు అర్ధశతకాలివే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.