ETV Bharat / sports

ఛేదనలో తేలిపోయిన రాజస్థాన్​.. చెన్నైదే గెలుపు

author img

By

Published : Apr 19, 2021, 11:21 PM IST

Updated : Apr 19, 2021, 11:28 PM IST

రాజస్థాన్​ రాయల్స్​​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్​కే బౌలర్లు మొయిన్​ అలీ, సామ్​ కరన్​, జడేజా ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు పరిమితం చేసి.. చెన్నై జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

CSK Vs RR 2021
ఛేదనలో తేలిపోయిన రాజస్థాన్​.. చెన్నైదే గెలుపు

ముంబయి వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్​ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 రన్స్​కే పరిమితమైంది. దీంతో రాజస్థాన్​ జట్టుపై 45 పరుగుల తేడాతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది ధోనీసేన. ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​(49) మినహా మిగిలిన బ్యాట్స్​మన్​ ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. సీఎస్​కే స్పిన్నర్​ మొయిన్​ అలీ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్​ కరన్​, జడేజా చెరో 2 వికెట్లను సాధించి, జట్టు గెలుపులో భాగమ్యయ్యారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ సమష్టిగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మధ్యలో చేతన్‌ సకారియా 3/36 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే, చెన్నై జట్టులో ఎవరూ పెద్ద స్కోర్లు చేయకపోయినా తలా వీలైనన్ని పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

సీఎస్​కే బ్యాట్స్​మెన్.. డుప్లెసిస్‌(33), మొయిన్‌ అలీ(26), అంబటి రాయుడు(27), సురేశ్‌ రైనా(18), ధోనీ(18), బ్రావో(20నాటౌట్‌; 8 బంతుల్లో 2x4, 1x6) ఇలా ప్రతి ఒక్కరూ బౌండరీలు బాది స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో సకారియా 3, మోరిస్‌ 2, ముస్తాఫిజుర్‌ 1, రాహుల్‌ తెవాతియా 1 వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: సీఎస్కే సమష్టి కృషి.. రాజస్థాన్ లక్ష్యం 189

ముంబయి వేదికగా రాజస్థాన్​ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాజస్థాన్​ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 రన్స్​కే పరిమితమైంది. దీంతో రాజస్థాన్​ జట్టుపై 45 పరుగుల తేడాతో టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది ధోనీసేన. ఓపెనింగ్​ బ్యాట్స్​మన్​ జోస్​ బట్లర్​(49) మినహా మిగిలిన బ్యాట్స్​మన్​ ఎవరూ ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు. సీఎస్​కే స్పిన్నర్​ మొయిన్​ అలీ 3 వికెట్లు పడగొట్టగా.. సామ్​ కరన్​, జడేజా చెరో 2 వికెట్లను సాధించి, జట్టు గెలుపులో భాగమ్యయ్యారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ సమష్టిగా రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. మధ్యలో చేతన్‌ సకారియా 3/36 వికెట్లతో ఆకట్టుకున్నాడు. అయితే, చెన్నై జట్టులో ఎవరూ పెద్ద స్కోర్లు చేయకపోయినా తలా వీలైనన్ని పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు.

సీఎస్​కే బ్యాట్స్​మెన్.. డుప్లెసిస్‌(33), మొయిన్‌ అలీ(26), అంబటి రాయుడు(27), సురేశ్‌ రైనా(18), ధోనీ(18), బ్రావో(20నాటౌట్‌; 8 బంతుల్లో 2x4, 1x6) ఇలా ప్రతి ఒక్కరూ బౌండరీలు బాది స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఇక రాజస్థాన్‌ బౌలర్లలో సకారియా 3, మోరిస్‌ 2, ముస్తాఫిజుర్‌ 1, రాహుల్‌ తెవాతియా 1 వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: సీఎస్కే సమష్టి కృషి.. రాజస్థాన్ లక్ష్యం 189

Last Updated : Apr 19, 2021, 11:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.