ETV Bharat / sports

ఐపీఎల్​ వేటలో 'హిట్​మ్యాన్​', 'మిస్టర్​ కూల్'​.. ప్రాక్టీస్​ షురూ

author img

By

Published : Mar 19, 2022, 7:51 PM IST

Updated : Mar 20, 2022, 8:54 AM IST

IPL 2022: ఐపీఎల్​ 15వ సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. మార్చి 26న కోల్​కతా- చెన్నై మధ్య జరగనున్న మ్యాచ్​తో ఈ లీగ్​ మొదలవ్వనుంది. ఈ నేపథ్యంలో అన్ని జట్లు ప్రాక్టీస్​లో మునిగిపోయాయి. చెన్నై , ముంబయి జట్లు కెప్టెన్లు ధోనీ, రోహిత్​ శర్మ ప్రాక్టీస్​ను మొదలుపెట్టారు.

dhoni
rohit sharma

IPL 2022: ఐపీఎల్-2022 మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26న కోల్​కతా నైట్​రైడర్స్​- చెన్నై సూపర్ కింగ్స్​ మధ్య మ్యాచ్​తో ఈ లీగ్ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్​లో మునిగి తేలుతున్నాయి. నెట్స్​లో బ్యాటర్లు, బౌలర్లు చెమటోడుస్తున్నారు.

ఐపీఎల్​ చరిత్రలోనే అత్యున్నత కెప్టెన్​గా పేరు సంపాదించిన ముంబయి జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ ప్రాక్టీస్​ను మొదలుపెట్టాడు. లీగ్​ డిఫెండింగ్ ఛాంపియన్​ ​చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్​ ధోనీ కూడా ప్రాక్టీస్​ స్టార్ట్​ చేశాడు. రెండు జట్ల సారథులకు సంబంధించిన వీడియోలు ఆయా ఫ్రాంచైజీలు సోషల్​మీడియాలో పోస్టు చేశాయి. తమ అభిమాన క్రికెటర్ల కళ్లు చెదిరే షాట్లు చూసి అభిమానులు ఎంజాయ్​ చేస్తున్నారు. ఇదే దూకుడును టోర్నీలోనూ కొనసాగించాలని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.

కోల్​కతా నైట్​రైడర్స్​ తరఫున ఆడబోతున్న టీమ్​ఇండియా బ్యాటర్​.. అజింక్య రహానే కూడా ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్నాడు.

ఐపీఎల్​ 15వ సీజన్​ మార్చి 26న ప్రారంభమై.. మే 29న జరిగే ఫైనల్​తో​ ముగియనుంది. ఈసారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడుతున్నాయి. లీగ్​ మ్యాచ్​లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.

ఈ సీజన్​లో మొత్తం 12 డబుల్​ హెడ్డర్​ మ్యాచ్​లు జరుగుతుండగా దిల్లీ, ముంబయి మధ్య తొలి డబుల్​ హెడ్డర్​ జరగనుంది. రాత్రి మ్యాచ్​లు.. 7.30 గంటలకు, సాయంత్రం మ్యాచ్​లు 3.30 గంటలకు మొదలవుతాయి. 65 రోజుల పాటు సాగే సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్​లో చివరి మ్యాచ్​ వాంఖడే వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​, పంజాబ్​ కింగ్స్​ మధ్య జరగనుంది.

ఇదీ చదవండి: IPL 2022: విధ్వంస వీరులు.. తక్కువ బంతుల్లో అర్ధశతకాలు!

IPL 2022: ఐపీఎల్-2022 మరో 7 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26న కోల్​కతా నైట్​రైడర్స్​- చెన్నై సూపర్ కింగ్స్​ మధ్య మ్యాచ్​తో ఈ లీగ్ మొదలుకానుంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్​లో మునిగి తేలుతున్నాయి. నెట్స్​లో బ్యాటర్లు, బౌలర్లు చెమటోడుస్తున్నారు.

ఐపీఎల్​ చరిత్రలోనే అత్యున్నత కెప్టెన్​గా పేరు సంపాదించిన ముంబయి జట్టు కెప్టెన్​ రోహిత్​ శర్మ ప్రాక్టీస్​ను మొదలుపెట్టాడు. లీగ్​ డిఫెండింగ్ ఛాంపియన్​ ​చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్రసింగ్​ ధోనీ కూడా ప్రాక్టీస్​ స్టార్ట్​ చేశాడు. రెండు జట్ల సారథులకు సంబంధించిన వీడియోలు ఆయా ఫ్రాంచైజీలు సోషల్​మీడియాలో పోస్టు చేశాయి. తమ అభిమాన క్రికెటర్ల కళ్లు చెదిరే షాట్లు చూసి అభిమానులు ఎంజాయ్​ చేస్తున్నారు. ఇదే దూకుడును టోర్నీలోనూ కొనసాగించాలని నెటిజన్లు తమ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పెడుతున్నారు.

కోల్​కతా నైట్​రైడర్స్​ తరఫున ఆడబోతున్న టీమ్​ఇండియా బ్యాటర్​.. అజింక్య రహానే కూడా ముమ్మరంగా ప్రాక్టీస్​ చేస్తున్నాడు.

ఐపీఎల్​ 15వ సీజన్​ మార్చి 26న ప్రారంభమై.. మే 29న జరిగే ఫైనల్​తో​ ముగియనుంది. ఈసారి లఖ్​నవూ, గుజరాత్​ జట్ల రాకతో పది జట్లు కప్పుకోసం పోటీ పడుతున్నాయి. లీగ్​ మ్యాచ్​లన్నీ మహారాష్ట్రలోనే జరుగుతాయని బీసీసీఐ ప్రకటించింది. ప్లేఆఫ్స్​కు సంబంధించిన షెడ్యూల్​ను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.

ఈ సీజన్​లో మొత్తం 12 డబుల్​ హెడ్డర్​ మ్యాచ్​లు జరుగుతుండగా దిల్లీ, ముంబయి మధ్య తొలి డబుల్​ హెడ్డర్​ జరగనుంది. రాత్రి మ్యాచ్​లు.. 7.30 గంటలకు, సాయంత్రం మ్యాచ్​లు 3.30 గంటలకు మొదలవుతాయి. 65 రోజుల పాటు సాగే సీజన్​లో 70 లీగ్‌మ్యాచ్‌లు, 4 ప్లే ఆఫ్‌మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్​లో చివరి మ్యాచ్​ వాంఖడే వేదికగా సన్​రైజర్స్​ హైదరాబాద్​, పంజాబ్​ కింగ్స్​ మధ్య జరగనుంది.

ఇదీ చదవండి: IPL 2022: విధ్వంస వీరులు.. తక్కువ బంతుల్లో అర్ధశతకాలు!

Last Updated : Mar 20, 2022, 8:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.