ETV Bharat / sports

IPL 2022: పంజాబ్ బోణీ.. ఆర్సీబీ​పై ఘన విజయం

author img

By

Published : Mar 27, 2022, 11:26 PM IST

Updated : Mar 28, 2022, 12:36 AM IST

ఐపీఎల్​ 2022లో భాగంగా రాయల్​ ఛాలెంజర్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ ఘన విజయం సాధించింది. ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

IPL 2022
IPL 2022

బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదించేసింది పంజాబ్‌. మెగా టీ20 టోర్నీలో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో 208 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్‌ బ్యాటర్లు సమష్ఠిగా రాణించడంతో బెంగళూరు బౌలర్లు అడ్డుకోలేకపోయారు. పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్ (32), శిఖర్ ధావన్‌ (43), భానుక రాజపక్స (43), లియామ్‌ లివింగ్ స్టోన్‌ (19) రాణించారు.

అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినా పంజాబ్‌ గెలవడానికి ప్రధాన కారణం.. షారుఖ్ ఖాన్‌ (24*), ఓడియన్‌ స్మిత్ (25*). వీరిద్దరూ కలిసి కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులు సాధించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు తీసినా భారీగా (59) పరుగులు సమర్పించుకున్నాడు. అకాశ్‌ దీప్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: డుప్లెసిస్ విధ్వంసం.. డీకే ధనాధన్​​​​​.. పంజాబ్​ లక్ష్యం ఎంతంటే?

బౌలర్లను ఊచకోత కోస్తూ భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా ఛేదించేసింది పంజాబ్‌. మెగా టీ20 టోర్నీలో భాగంగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ ఐదు వికెట్లను మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో 208 పరుగులు చేసి విజయం సాధించింది. పంజాబ్‌ బ్యాటర్లు సమష్ఠిగా రాణించడంతో బెంగళూరు బౌలర్లు అడ్డుకోలేకపోయారు. పంజాబ్‌ ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్ (32), శిఖర్ ధావన్‌ (43), భానుక రాజపక్స (43), లియామ్‌ లివింగ్ స్టోన్‌ (19) రాణించారు.

అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినా పంజాబ్‌ గెలవడానికి ప్రధాన కారణం.. షారుఖ్ ఖాన్‌ (24*), ఓడియన్‌ స్మిత్ (25*). వీరిద్దరూ కలిసి కేవలం 25 బంతుల్లోనే 52 పరుగులు సాధించారు. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ 2 వికెట్లు తీసినా భారీగా (59) పరుగులు సమర్పించుకున్నాడు. అకాశ్‌ దీప్‌, హసరంగ, హర్షల్‌ పటేల్‌ తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి: డుప్లెసిస్ విధ్వంసం.. డీకే ధనాధన్​​​​​.. పంజాబ్​ లక్ష్యం ఎంతంటే?

Last Updated : Mar 28, 2022, 12:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.