ETV Bharat / sports

దీపక్​ హుడా, ఆయుష్​ బదోని హాఫ్​ సెంచరీ.. గుజరాత్​ లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Mar 28, 2022, 9:34 PM IST

Updated : Mar 28, 2022, 9:52 PM IST

IPL 2022 GT VS LSG: వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో గుజరాత్​ జట్టుకు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​. దీపక్​ హుడా, ఆయుష్​ బదోని అర్థ శతకాలతో మెరిశారు.

IPL 2022 GT VS LSG
IPL 2022 GT VS LSG

IPL 2022 GT VS LSG: ఐపీఎల్​ 2022లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టుకు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లఖ్​నవూ బ్యాటర్లు దీపక్​ హుడా(55), ఆయుష్​ బదోని(54) అర్థ శతకాలు సాధించారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​కు ఆదిలోనే భారీ షాక్​ తగిలింది. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ తొలి బంతికే డకౌట్​గా వెనుదిరిగాడు. మహమ్మద్​ షమీ బౌలింగ్​లో పెవిలియన్​కు చేరాడు. ఇక మరో ఓపెనర్​ డికాక్​ కూడా షమీ బంతికే క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎవిన్​ ​(10), మనీష్​ పాండే(6) వరుసగా పెవిలియన్​ బాట పట్టారు. సగం ఓవర్లు అయ్యేసరికి లఖ్​నవూ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు దీపక్​ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్​ ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే వీరిని కూడా గుజరాత్​ బౌలర్లు తమ బంతులతో పెవిలియన్​కు పంపారు. ఇక, ఇన్నింగ్స్ ముగిసే సమయానికి క్రీజులో కృనాల్​ పాండ్య(21), చమీరా(1) నాటౌట్​గా నిలిచారు. గుజరాత్​ బౌలర్లలో మహమ్మద్​ షమీ 3, వరుణ్​ ఆరోన్​ 2 వికెట్లు​ పడగొట్టగా.. రషీద్​ ఖాన్​ ఒక వికెట్​ తీశాడు.

ఇదీ చదవండి: మహిళల ఐపీఎల్​ జట్టును కొనేందుకు​ పంజాబ్​ ఆసక్తి!

IPL 2022 GT VS LSG: ఐపీఎల్​ 2022లో భాగంగా గుజరాత్​ టైటాన్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​ బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేశారు. ప్రత్యర్థి జట్టుకు 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. లఖ్​నవూ బ్యాటర్లు దీపక్​ హుడా(55), ఆయుష్​ బదోని(54) అర్థ శతకాలు సాధించారు.

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన లఖ్​నవూ సూపర్​ జెయింట్స్​కు ఆదిలోనే భారీ షాక్​ తగిలింది. కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ తొలి బంతికే డకౌట్​గా వెనుదిరిగాడు. మహమ్మద్​ షమీ బౌలింగ్​లో పెవిలియన్​కు చేరాడు. ఇక మరో ఓపెనర్​ డికాక్​ కూడా షమీ బంతికే క్లీన్​ బౌల్డ్​ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఎవిన్​ ​(10), మనీష్​ పాండే(6) వరుసగా పెవిలియన్​ బాట పట్టారు. సగం ఓవర్లు అయ్యేసరికి లఖ్​నవూ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన బ్యాటర్లు దీపక్​ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో కీలక ఇన్నింగ్స్​ ఆడి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. అయితే వీరిని కూడా గుజరాత్​ బౌలర్లు తమ బంతులతో పెవిలియన్​కు పంపారు. ఇక, ఇన్నింగ్స్ ముగిసే సమయానికి క్రీజులో కృనాల్​ పాండ్య(21), చమీరా(1) నాటౌట్​గా నిలిచారు. గుజరాత్​ బౌలర్లలో మహమ్మద్​ షమీ 3, వరుణ్​ ఆరోన్​ 2 వికెట్లు​ పడగొట్టగా.. రషీద్​ ఖాన్​ ఒక వికెట్​ తీశాడు.

ఇదీ చదవండి: మహిళల ఐపీఎల్​ జట్టును కొనేందుకు​ పంజాబ్​ ఆసక్తి!

Last Updated : Mar 28, 2022, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.