ఈ ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్పై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడీ జాబితాలోకి టీమ్ఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేరాడు. మహీపై హాస్యభరిత సెటైర్లు వేశాడు. అతడు నాలుగో స్థానంలో దిగాలని మనసు మార్చుకునే సరికి దేశంలో బులెట్ రైళ్లు తిరుగుతాయని అన్నాడు.
"ఇంతమంది చెబుతున్నా ధోనీ, తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవట్లేదు. ఒకవేళ నాలుగో స్థానంలో రావాలని అతడు అనుకునేసరికి భారత్లో బులెట్ రైళ్లు కూడా వచ్చేస్తాయి. ధోనీసేన, టీ20 లీగ్లో టెస్టులు ఆడుతున్నట్లు ఉంది. నేను వెళ్లి ఇక సినిమా చూసుకుంటా"
-సెహ్వాగ్, టీమ్ఇండియా మాజీ ఓపెనర్
ఐపీఎల్ ప్రారంభమ్యాచ్లో ముంబయిపై గెలిచిన చెన్నై.. తర్వాత రాజస్థాన్, దిల్లీ జట్ల చేతిలో ఓడిపోయింది. ఈ మూడు మ్యాచుల్లోనూ ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగి, సరిగా ఆడలేకపోయాడు. ఈ క్రమంలోనే చాలామంది మాజీలు సహా వీరేంద్ర సెహ్వాగ్.. మహీని విమర్శిస్తునాారు.
ఇదీ చూడండి చెన్నై ట్విట్టర్ను రైనా అన్ఫాలో చేశాడా?