ETV Bharat / sports

ఆర్సీబీ సారథి కోహ్లీ మరో రికార్డు

author img

By

Published : Oct 11, 2020, 6:35 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. బెంగళూరు తరఫున 6 వేల పరుగులు సాధించిన ఆటగాడిగా ఘనత వహించాడు.

RCB captain Virat Kohli clinches yet another IPL record
ఆర్సీబీ సారథి కోహ్లీ మరో రికార్డు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తన జట్టు తరఫున 6 వేల పరుగులు చేసి.. ఓ జట్టుకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్​తో పాటు ఛాంపియన్స్​ లీగ్​తో కలిపి ఈ మార్క్​ను అందుకున్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్​పై అత్యధిక వ్యక్తిగత పరుగులు (90) చేసిన కెప్టెన్​గా మరో ఘనత సాధించాడు విరాట్.

చెన్నైతో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ 52 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. అయితే శనివారం జరిగిన రెండు మ్యాచ్​ల్లో మహేంద్ర సింగ్ ధోనీ మినహా మిగతా ముగ్గురు కెప్టెన్లు అర్ధసెంచరీలు చేశారు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ 58 పరుగులు చేసి పంజాబ్​పై తన జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే పంజాబ్ కెప్టెన్ రాహుల్ కూడా 74 పరుగులు సాధించాడు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. తన జట్టు తరఫున 6 వేల పరుగులు చేసి.. ఓ జట్టుకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్​తో పాటు ఛాంపియన్స్​ లీగ్​తో కలిపి ఈ మార్క్​ను అందుకున్నాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్​పై అత్యధిక వ్యక్తిగత పరుగులు (90) చేసిన కెప్టెన్​గా మరో ఘనత సాధించాడు విరాట్.

చెన్నైతో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ 52 బంతుల్లో 90 పరుగులు సాధించాడు. ఇందులో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సులు ఉన్నాయి. అయితే శనివారం జరిగిన రెండు మ్యాచ్​ల్లో మహేంద్ర సింగ్ ధోనీ మినహా మిగతా ముగ్గురు కెప్టెన్లు అర్ధసెంచరీలు చేశారు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ 58 పరుగులు చేసి పంజాబ్​పై తన జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే పంజాబ్ కెప్టెన్ రాహుల్ కూడా 74 పరుగులు సాధించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.