ETV Bharat / sports

గెలిచినా.. ఇంకా మెరుగవ్వాలి: ధోనీ

author img

By

Published : Sep 20, 2020, 11:29 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

తొలి మ్యాచ్​లో తమ జట్టుకు అనేక సానుకూల అంశాలు ఎదురయ్యాయని అన్నాడు చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ. ముంబయిపై విజయం సాధించినప్పటికీ ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని మహీ అభిప్రాయపడ్డాడు.

Plenty of positives, but plenty of areas to improve: MS Dhoni
'ముంబయిపై గెలిచినా.. అనేక అంశాల్లో మెరుగవ్వాలి'

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) 13వ సీజన్​లోని తొలి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. బ్యాటింగ్​, బౌలింగ్​ రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది సీఎస్కే. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ జట్టు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

'ముంబయిపై గెలిచినా.. అనేక అంశాల్లో మెరుగవ్వాలి'
టాస్ వేసిన తర్వాత అభివాదం చేసుకుంటున్న రోహిత్​, ధోనీ

"అంతా భిన్నంగా ఉంది. ఇది మ్యాచ్​ అనంతరం కార్యక్రమంలా అనిపించట్లేదు. చాలా సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగినా మేం ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్​ చేయాలో అర్థం చేసుకోవడానికి మేం కాస్త సమయం తీసుకున్నాం. ముంబయి బ్యాట్స్​మెన్​ బాగా ఆడి మాపై ఒత్తిడి తీసుకురాగలిగారు. మొత్తంగా ఈ మ్యాచ్​లో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. మాలో ఎక్కువమంది రిటైరైన వాళ్లే. అయినప్పటికీ వాళ్ల అనుభవం జట్టుకు, యువ ఆటగాళ్లకు పనికొస్తుంది."

- మహేంద్రసింగ్ ధోనీ, చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​

శనివారం జరిగిన మ్యాచ్​లో ముంబయిపై విజయంతో ఐపీఎల్​ కెరీర్​లో కెప్టెన్​గా వందో విజయాన్ని అందుకున్నాడు చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్​లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్​లలో రాణిస్తామని తెలిపాడు. డుప్లెసిస్​, రాయుడులా తమ బ్యాట్స్​మెన్​ ప్రదర్శన చేయలేదని వెల్లడించాడు. "డుప్లెసిస్​, రాయుడు లాగా మా బ్యాట్స్​మెన్​ ఎవరూ ఆడలేదు. మొదటి 10 ఓవర్లలో మేం 85 పరుగులు చేశాం. చివర్లో సీఎస్కే బౌలర్లు ఎంతో చక్కగా బౌలింగ్​ చేశారు. టోర్నీ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ మ్యాచ్​లో మేం చేసిన తప్పులను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్​లో తెలివిగా రాణిస్తాం. పిచ్​లకు అనుగుణంగా మా జట్టులో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు రోహిత్​ శర్మ.

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) 13వ సీజన్​లోని తొలి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. బ్యాటింగ్​, బౌలింగ్​ రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది సీఎస్కే. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ జట్టు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

'ముంబయిపై గెలిచినా.. అనేక అంశాల్లో మెరుగవ్వాలి'
టాస్ వేసిన తర్వాత అభివాదం చేసుకుంటున్న రోహిత్​, ధోనీ

"అంతా భిన్నంగా ఉంది. ఇది మ్యాచ్​ అనంతరం కార్యక్రమంలా అనిపించట్లేదు. చాలా సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగినా మేం ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్​ చేయాలో అర్థం చేసుకోవడానికి మేం కాస్త సమయం తీసుకున్నాం. ముంబయి బ్యాట్స్​మెన్​ బాగా ఆడి మాపై ఒత్తిడి తీసుకురాగలిగారు. మొత్తంగా ఈ మ్యాచ్​లో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. మాలో ఎక్కువమంది రిటైరైన వాళ్లే. అయినప్పటికీ వాళ్ల అనుభవం జట్టుకు, యువ ఆటగాళ్లకు పనికొస్తుంది."

- మహేంద్రసింగ్ ధోనీ, చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​

శనివారం జరిగిన మ్యాచ్​లో ముంబయిపై విజయంతో ఐపీఎల్​ కెరీర్​లో కెప్టెన్​గా వందో విజయాన్ని అందుకున్నాడు చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్​లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్​లలో రాణిస్తామని తెలిపాడు. డుప్లెసిస్​, రాయుడులా తమ బ్యాట్స్​మెన్​ ప్రదర్శన చేయలేదని వెల్లడించాడు. "డుప్లెసిస్​, రాయుడు లాగా మా బ్యాట్స్​మెన్​ ఎవరూ ఆడలేదు. మొదటి 10 ఓవర్లలో మేం 85 పరుగులు చేశాం. చివర్లో సీఎస్కే బౌలర్లు ఎంతో చక్కగా బౌలింగ్​ చేశారు. టోర్నీ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ మ్యాచ్​లో మేం చేసిన తప్పులను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్​లో తెలివిగా రాణిస్తాం. పిచ్​లకు అనుగుణంగా మా జట్టులో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు రోహిత్​ శర్మ.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.