ETV Bharat / sports

ఆత్రుతతో ఉన్నామన్న వార్నర్​.. ఫ్యాన్స్​కు కోహ్లీ థ్యాంక్స్

author img

By

Published : Nov 7, 2020, 7:58 AM IST

Updated : Nov 7, 2020, 10:12 AM IST

ఎలిమినేటర్​ మ్యాచ్​లో బెంగళూరు కథ ముగిసింది. ఘన విజయం సాధించిన హైదరాబాద్​ జట్టు క్వాలిఫయర్​కు అర్హత సాధించింది. అయితే.. తమ గెలుపులో కీలకంగా నిలిచిన ఆటగాళ్లను ప్రశంసలతో ముంచెత్తాడు సారథి డేవిడ్​ వార్నర్​. మరో వైపు.. ఈ సీజన్​లో తమకు అండగా ఉన్న అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు బెంగళూరు సారథి కోహ్లీ.

ipl eliminator match has won  hyderabad against bangalore and both captains are shared their opinions
ఆతృతతో ఉన్నామన్న వార్నర్​.. ధన్యవాదాలు తెలపిన కోహ్లీ

అబుదాబి వేదికగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్​ పోరులో సన్​రైజర్స్​ హైదరాబాద్​ అదరగొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్​లో బెంగళూరును ఇంటికి పంపి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తమ​ విజయంలో కీలక పాత్ర పోషించిన హోల్డర్​, విలియమ్సన్, నటరాజన్​లపై ప్రశంసల జల్లులు కురిపించాడు హైదరాబాద్​ సారథి డేవిడ్​ వార్నర్​. దిల్లీతో జరిగే క్వాలిఫయర్​-2 మ్యాచ్​ కోసం ఆత్రుతతో ఉన్నామని చెప్పాడు.

"సందీప్​ శర్మ, హోల్డర్​ను తొలి ఐదు ఓవర్లలో బౌలింగ్​కు దింపాలనుకున్నాం. తర్వాత రషీద్​, నటరాజన్​కు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. రషీద్​ ఖాన్​ మీద చాలా ఒత్తిడి ఉంది. నటరాజన్​ అదరగొట్టాడు.​ పరుగులు సాధించడంలో కేన్​ కీలకంగా నిలిచాడు. ఒత్తిడితో కూడిన ఇన్నింగ్స్​ను​ అద్భుతంగా ఆడాడు. మిడిల్​ ఓవర్లలో మా బౌలర్లు చాలా చక్కగా రాణించారు. మేము ఇంకా దిల్లీతో ఆడాల్సి ఉంది. ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న ఆ జట్టుపై ఆడడానికి చాలా ఆత్రుతతో ఉన్నాం."

-- డేవిడ్​ వార్నర్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​.

ఒత్తిడికి గురిచేశారు..

హైదరాబాద్​ జట్టు సమష్టి ప్రదర్శనతో తమను ఒత్తిడికి గురి చేసిందని అన్నాడు బెంగళూరు సారథి కోహ్లీ. సెకండ్​ హాఫ్​లో తాము తగినట్టుగా ప్రదర్శన చేయలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీజన్​లో కీలకంగా నిలిచిన దేవ్​దత్​ పడిక్కల్​ను కోహ్లీ అభినందించాడు.

"మా తొలి ఇన్నింగ్స్​లో మేము పరుగుల్ని రాబట్టలేక తడబడ్డాము. రెండో భాగంలో మేము సరిగా ప్రదర్శన చేయలేకపోయాం. హైదరాబాద్​ జట్టు సమష్టిగా ఆడి మమ్మల్ని ఒత్తిడికి గురి చేసింది. మా జట్టులో ఈ సీజన్​లో కొంత మంది చాలా చక్కగా ప్రదర్శన చేశారు. వారిలో దేవ్​దత్​ పడిక్కల్​ ఒకడు. మాకు ఉన్న సానుకూలాంశాలలో అతడు కీలకమైన వాడు. సిరాజ్​ తిరిగి పుంజుకున్నాడు. చాహల్​ అండగా నిలిచాడు. ఎప్పటిలాగే ఏబీ ఆదుకున్నాడు. మిగతా వాళ్లు ఇంకా రాణించాల్సి ఉంది. క్లిష్ట పరిస్థితుల మధ్య యూఏఈలో జరిగిన ఈ సీజన్​ రసవత్తరంగా సాగింది. ప్రతి ఏడాది మాకు మద్దతునిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు."

-- విరాట్​ కోహ్లీ, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. 132 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఇన్నింగ్స్​లో మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. కేన్​ విలియమ్సన్​ అర్ధశతకంతో అలరించగా.. జేసన్​ హోల్డర్​ ఆల్​రౌండర్​ ప్రదర్శనతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

బెంగళూరు తరఫున ఈ సీజన్​లో 473 పరుగులతో అత్యధిక రన్స్​ చేసిన ఆటగాడిగా నిలిచాడు దేవ్​దత్​ పడిక్కల్​.

ఇదీ చూడండి:వార్నర్​ సేన అదరహో.. బెంగళూరు ఇంటికి

అబుదాబి వేదికగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్​ పోరులో సన్​రైజర్స్​ హైదరాబాద్​ అదరగొట్టింది. ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్​లో బెంగళూరును ఇంటికి పంపి, 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తమ​ విజయంలో కీలక పాత్ర పోషించిన హోల్డర్​, విలియమ్సన్, నటరాజన్​లపై ప్రశంసల జల్లులు కురిపించాడు హైదరాబాద్​ సారథి డేవిడ్​ వార్నర్​. దిల్లీతో జరిగే క్వాలిఫయర్​-2 మ్యాచ్​ కోసం ఆత్రుతతో ఉన్నామని చెప్పాడు.

"సందీప్​ శర్మ, హోల్డర్​ను తొలి ఐదు ఓవర్లలో బౌలింగ్​కు దింపాలనుకున్నాం. తర్వాత రషీద్​, నటరాజన్​కు అవకాశం ఇవ్వాలని అనుకున్నాం. రషీద్​ ఖాన్​ మీద చాలా ఒత్తిడి ఉంది. నటరాజన్​ అదరగొట్టాడు.​ పరుగులు సాధించడంలో కేన్​ కీలకంగా నిలిచాడు. ఒత్తిడితో కూడిన ఇన్నింగ్స్​ను​ అద్భుతంగా ఆడాడు. మిడిల్​ ఓవర్లలో మా బౌలర్లు చాలా చక్కగా రాణించారు. మేము ఇంకా దిల్లీతో ఆడాల్సి ఉంది. ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్న ఆ జట్టుపై ఆడడానికి చాలా ఆత్రుతతో ఉన్నాం."

-- డేవిడ్​ వార్నర్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్​.

ఒత్తిడికి గురిచేశారు..

హైదరాబాద్​ జట్టు సమష్టి ప్రదర్శనతో తమను ఒత్తిడికి గురి చేసిందని అన్నాడు బెంగళూరు సారథి కోహ్లీ. సెకండ్​ హాఫ్​లో తాము తగినట్టుగా ప్రదర్శన చేయలేకపోయామని అసంతృప్తి వ్యక్తం చేశాడు. సీజన్​లో కీలకంగా నిలిచిన దేవ్​దత్​ పడిక్కల్​ను కోహ్లీ అభినందించాడు.

"మా తొలి ఇన్నింగ్స్​లో మేము పరుగుల్ని రాబట్టలేక తడబడ్డాము. రెండో భాగంలో మేము సరిగా ప్రదర్శన చేయలేకపోయాం. హైదరాబాద్​ జట్టు సమష్టిగా ఆడి మమ్మల్ని ఒత్తిడికి గురి చేసింది. మా జట్టులో ఈ సీజన్​లో కొంత మంది చాలా చక్కగా ప్రదర్శన చేశారు. వారిలో దేవ్​దత్​ పడిక్కల్​ ఒకడు. మాకు ఉన్న సానుకూలాంశాలలో అతడు కీలకమైన వాడు. సిరాజ్​ తిరిగి పుంజుకున్నాడు. చాహల్​ అండగా నిలిచాడు. ఎప్పటిలాగే ఏబీ ఆదుకున్నాడు. మిగతా వాళ్లు ఇంకా రాణించాల్సి ఉంది. క్లిష్ట పరిస్థితుల మధ్య యూఏఈలో జరిగిన ఈ సీజన్​ రసవత్తరంగా సాగింది. ప్రతి ఏడాది మాకు మద్దతునిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు."

-- విరాట్​ కోహ్లీ, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​.

తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. 132 పరుగులే లక్ష్యంగా బరిలో దిగిన సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఇన్నింగ్స్​లో మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది. కేన్​ విలియమ్సన్​ అర్ధశతకంతో అలరించగా.. జేసన్​ హోల్డర్​ ఆల్​రౌండర్​ ప్రదర్శనతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.

బెంగళూరు తరఫున ఈ సీజన్​లో 473 పరుగులతో అత్యధిక రన్స్​ చేసిన ఆటగాడిగా నిలిచాడు దేవ్​దత్​ పడిక్కల్​.

ఇదీ చూడండి:వార్నర్​ సేన అదరహో.. బెంగళూరు ఇంటికి

Last Updated : Nov 7, 2020, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.