ETV Bharat / sports

థియేటర్లలో టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లు ప్రత్యక్షప్రసారం

టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) భారత్​ ఆడనున్న మ్యాచ్​లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు పీవీఆర్​(PVR Cinemas News) ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్​ మండలితో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు పీవీఆర్​ సినిమాస్​ సీఈఓ గౌతమ్​ దత్తా తెలిపారు.

author img

By

Published : Oct 15, 2021, 8:00 PM IST

PVR Cinemas to live screen ICC Men's T20 World Cup 2021
థియేటర్లలో టీ20 ప్రపంచకప్​ మ్యాచ్​లు ప్రత్యక్షప్రసారం

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) భారత్ ఆడే మ్యాచ్​లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్​(PVR Cinemas News) ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్​ మండలితో(ICC News) ఒప్పందం చేసుకున్నట్లు పీవీఆర్​ లిమిటెడ్ సీఈఓ గౌతమ్​ దత్తా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, పూణె, అహ్మదాబాద్​ సహా దేశంలోని 35 నగరాల్లో 75కు పైగా పీవీఆర్​ స్క్రీన్లలో టీమ్ఇండియా మ్యాచ్​లను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచకప్​ మ్యాచ్​లను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయవచ్చని పీవీఆర్​ సీఈఓ గౌతమ్​ దత్తా అన్నారు. సినిమా, క్రికెట్​ రెండూ ఎంతో వినోదాన్ని అందిస్తాయన్న గౌతం దత్తా మ్యాచ్​ను తెరపై చూస్తున్నప్పుడు స్టేడియంలో వీక్షించిన అనుభూతి.. అభిమానులకు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో భారత్​(IND Vs PAK Match Live) తలపడనుండగా థియేటర్లలో వీక్షించే వారికి ఈ మ్యాచ్​ మరింత వినోదాన్ని పంచనుందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) భారత్ ఆడే మ్యాచ్​లను తమ థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ థియేటర్ల సంస్థ పీవీఆర్​(PVR Cinemas News) ప్రకటించింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్​ మండలితో(ICC News) ఒప్పందం చేసుకున్నట్లు పీవీఆర్​ లిమిటెడ్ సీఈఓ గౌతమ్​ దత్తా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, పూణె, అహ్మదాబాద్​ సహా దేశంలోని 35 నగరాల్లో 75కు పైగా పీవీఆర్​ స్క్రీన్లలో టీమ్ఇండియా మ్యాచ్​లను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రదర్శనల ద్వారా ప్రపంచకప్​ మ్యాచ్​లను మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయవచ్చని పీవీఆర్​ సీఈఓ గౌతమ్​ దత్తా అన్నారు. సినిమా, క్రికెట్​ రెండూ ఎంతో వినోదాన్ని అందిస్తాయన్న గౌతం దత్తా మ్యాచ్​ను తెరపై చూస్తున్నప్పుడు స్టేడియంలో వీక్షించిన అనుభూతి.. అభిమానులకు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. అక్టోబర్ 24న పాకిస్థాన్​తో భారత్​(IND Vs PAK Match Live) తలపడనుండగా థియేటర్లలో వీక్షించే వారికి ఈ మ్యాచ్​ మరింత వినోదాన్ని పంచనుందని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌.. ఆ సూపర్​ యాడ్​ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.