ETV Bharat / sports

తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా ఆలౌట్​.. శ్రేయస్​ అయ్యర్ సెంచరీ మిస్​

author img

By

Published : Mar 12, 2022, 4:13 PM IST

Updated : Mar 12, 2022, 6:45 PM IST

Bangalore test news: రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా 252 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్​ అయ్యర్ అర్ధ సెంచరీతో రాణించగా.. విహారి, పంత్​ పర్వాలేదనిపించారు. విరాట్ కోహ్లీ ఈసారి కూడా నిరాశపరిచాడు.

తిప్పేస్తున్న లంక బౌలర్లు
india vs Srilanka second test match

india Vs Sl second Test: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే నైట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 252 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్​ అయ్యర్ ఒక్కడే అర్ధ సెంచరీ(92)తో రాణించి ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, దనంజయ డిసిల్వ 2 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు రెండో ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 15 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత శర్మ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఎంబుల్డేనియా బౌలింగ్​లో దనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత 31 పరుగులు చేసిన హనుమ విహారి.. జయవిక్రమ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే కోహ్లీ 23 పరగుల చేసి దనంజయ డిసిల్వ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికాడు. దీంతో

టీ బ్రేక్ సమయానికి 93 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది టీమ్​ ఇండియా.

అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్​..

ఆ తర్వాత ధాటిగా ఆడుతున్నట్లు కనిపించిన రిషభ్ పంత్​ 39 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓ వైపు శ్రెయస్ అయ్యర్ పరుగులు రాబడుతున్నా.. అవతలి ఎండ్​లో సహకరించే వారు లేరు. పంత్​ ఔటయ్యాక జడేజా(4), అశ్విన్​(13), అక్షర్ పటేల్(9), షమి(5) పరుగులకే టక టకా ఔటయ్యారు. అయ్యర్​ మాత్రం తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ అర్ధశతకం పూర్తి చేశాడు. చివరివరకు పోరాడాడు. ఈ క్రమంలోనే 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయవిక్రమ బౌలింగ్​లో స్టంప్ ఔట్​గా వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

కోహ్లీ మళ్లీ నిరాశ..

తనకు అచ్చొచ్చిన చిన్నస్వామి స్టేడియంలోనైనా ఈసారి సెంచరీ చేస్తాడని అశించిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చాడు విరాట్​ కోహ్లీ. స్పిన్​ను చక్కగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా.. డిసిల్వ వేసిన ఓ అనూహ్య బౌంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి అంచనా వేసిన దానికంటే తక్కువ ఎత్తులో రావడం వల్ల ఔట్​ అయ్యాడు. దీంతో కోహ్లీ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. బంతి కచ్చితంగా వికెట్లను తగిలే అవకాశం ఉన్నందున రివ్యూ కూడా తీసుకోకుండా వెనుదిరిగాడు.

రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంతో ఉంది టీమ్ఇండియా.

ఇదీ చదవండి: అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్​పై భారీ విజయం

india Vs Sl second Test: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న డే నైట్​ టెస్టు తొలి ఇన్నింగ్స్​లో టీమ్​ఇండియా 252 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయస్​ అయ్యర్ ఒక్కడే అర్ధ సెంచరీ(92)తో రాణించి ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, దనంజయ డిసిల్వ 2 వికెట్లు తీశారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేనకు రెండో ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 7 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే 15 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత శర్మ కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఎంబుల్డేనియా బౌలింగ్​లో దనంజయ డిసిల్వకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత 31 పరుగులు చేసిన హనుమ విహారి.. జయవిక్రమ బౌలింగ్​లో కీపర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటికే కోహ్లీ 23 పరగుల చేసి దనంజయ డిసిల్వ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వికెట్ల ముందు దొరికాడు. దీంతో

టీ బ్రేక్ సమయానికి 93 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది టీమ్​ ఇండియా.

అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్​..

ఆ తర్వాత ధాటిగా ఆడుతున్నట్లు కనిపించిన రిషభ్ పంత్​ 39 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓ వైపు శ్రెయస్ అయ్యర్ పరుగులు రాబడుతున్నా.. అవతలి ఎండ్​లో సహకరించే వారు లేరు. పంత్​ ఔటయ్యాక జడేజా(4), అశ్విన్​(13), అక్షర్ పటేల్(9), షమి(5) పరుగులకే టక టకా ఔటయ్యారు. అయ్యర్​ మాత్రం తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ అర్ధశతకం పూర్తి చేశాడు. చివరివరకు పోరాడాడు. ఈ క్రమంలోనే 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జయవిక్రమ బౌలింగ్​లో స్టంప్ ఔట్​గా వెనుదిరిగాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు.

కోహ్లీ మళ్లీ నిరాశ..

తనకు అచ్చొచ్చిన చిన్నస్వామి స్టేడియంలోనైనా ఈసారి సెంచరీ చేస్తాడని అశించిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిల్చాడు విరాట్​ కోహ్లీ. స్పిన్​ను చక్కగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా.. డిసిల్వ వేసిన ఓ అనూహ్య బౌంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. బంతి అంచనా వేసిన దానికంటే తక్కువ ఎత్తులో రావడం వల్ల ఔట్​ అయ్యాడు. దీంతో కోహ్లీ కూడా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. బంతి కచ్చితంగా వికెట్లను తగిలే అవకాశం ఉన్నందున రివ్యూ కూడా తీసుకోకుండా వెనుదిరిగాడు.

రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​లో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంతో ఉంది టీమ్ఇండియా.

ఇదీ చదవండి: అదరగొట్టిన అమ్మాయిలు.. విండీస్​పై భారీ విజయం

Last Updated : Mar 12, 2022, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.