టీమ్ఇండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ఎందరో యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీయడం సహా వారిని మెరికల్లా తీర్చిదిద్ది భారత జట్టుకు అందించాడు. అయితే ఇదంతా ఆస్ట్రేలియా క్రికెట్లోని మేధాసంపత్తిని ఉపయోగించి ఈ ఫలితాలు సాధించాడని ఆసీస్ దిగ్గజం గ్రెగ్ చాపెల్ అన్నాడు.
"నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లను గుర్తించి వారిని సరైన రీతిలో శిక్షణ ఇవ్వడంలో ఆస్ట్రేలియా కన్నా భారత్, ఇంగ్లాండ్ విజయవంతమయ్యాయి. ద్రవిడ్.. ఆస్ట్రేలియా తరహా మేధాసంపత్తిని ఉపయోగించి, భారత్లో ఆటగాళ్లను మెరుగ్గా తీర్చిదిద్దే శిక్షణ వ్యవస్థను పటిష్ఠంగా చేశాడు. అందుకే భారత్ విజయవంతమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా ఘన విజయం సాధించడమే ఇందుకు ఉదాహరణ. సాధారణంగా ఈ ప్రక్రియలో మేం ముందుంటాం. కానీ గత రెండేళ్లుగా వెనుకపడ్డామని అనుకుంటున్నాం. సామర్థ్యం ఉన్న చాలా మంది యువక్రికెటర్లు ఇక్కడా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని కోల్పోకూడదు"
-గ్రెగ్ ఛాపెల్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ద్రవిడ్ 2016 నుంచి 2019 వరకు అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచ్గా వ్యవహరించారు. అతడి నేతృత్వంలోనే రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్, నవ్దీప్ సైనీ, నటరాజన్, వాషింగ్టన్ సుందర్, శుభ్మన్గిల్ లాంటి యువకులు మెరుగయ్యారు.
ఇదీ చూడండి: 'యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు ఆయనే కారణం'