ETV Bharat / sports

21వ ప్రయత్నంలో లంక సక్సెస్​- భారత్​ వరుస విజయాలకు బ్రేక్​

author img

By

Published : Jul 30, 2021, 9:27 AM IST

భారత్​పై టీ-20 సిరీస్​ నెగ్గిన శ్రీలంకలో నూతనోత్తేజం నెలకొంది. 5 టీ-20 సిరీస్​ల ఓటమి తర్వాత వారికి దక్కిన టోర్నీ ఇది. గత 13 సంవతరాలలో.. శ్రీలంకకు భారత్​పై ఇదే తొలి సిరీస్​ విజయం. ఈ మ్యాచ్​లో నమోదైన గణాంకాలను ఓసారి చూద్దాం.

First bilateral series win in 21 attempts for Sri Lanka
ఇండియా- శ్రీలంక టీ-20 సిరీస్​లో రికార్డులు

టీమ్​ ఇండియా.. శ్రీలంక చేతిలో టీ-20 సిరీస్​ ఓడింది. వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెల్చిన యువభారత్​.. పొట్టి ఫార్మాట్​లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. అయితే ప్రధాన ఆటగాళ్లు లేని ఆ జట్టులో అనుభవలేమి దెబ్బతీసిందని చెప్పొచ్చు. ధావన్​, భువనేశ్వర్​, కుల్​దీప్​ యాదవ్​ మినహా అంతా కొత్తవాళ్లే. ఇదే మంచి అవకాశంగా భావించిన.. లంక జట్టు సమష్టి ప్రదర్శనతో టీ-20 ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

IND VS SL T20 SERIES
టీమ్​ ఇండియా- శ్రీలంక ఆటగాళ్లు

ఈ మ్యాచ్​లో నమోదైన గణాంకాలు ఓ సారి పరిశీలిద్దాం..

2019 నుంచి టీమ్​ ఇండియాకు టీ-20 సిరీస్​ ఓటమే లేదు. మొత్తం 8 సిరీస్​లకు 7 గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ వరుస విజయాల రికార్డుకు ఇప్పుడు బ్రేక్​ పడింది.

  • భారత్​పై గెలుపుతో టీ-20 సిరీస్ పరాజయాలకు ​బ్రేక్​ వేసింది లంక. గత ఐదు టీ-20 సిరీస్​లలోనూ లంక ఓడింది.
  • 2008 ఆగస్టు తర్వాత.. శ్రీలంక, ఇండియాపై ఓ ద్వైపాక్షిక సిరీస్​(అన్ని ఫార్మాట్లు) గెలవడం ఇదే తొలిసారి.
  • ఈ సిరీస్​కు ముందు మొత్తం 13 సంవత్సరాల్లో 20 సిరీస్​లు జరగ్గా.. అన్నింటా టీమ్​ ఇండియాదే పైచేయి.
  • 21వ ప్రయత్నంలో సఫలమైంది శ్రీలంక.
  • ద్వైపాక్షిక టీ-20 సిరీస్​ల పరంగా చూసుకుంటే.. ఇది 8వ సారి.
  • గత 7 సిరీస్​ల్లోనూ భారత్​ చేతిలో లంకేయులు టీ-20 సిరీస్​ల్లో ఓడారు.
    IND VS SL T20 SERIES:
    ధావన్​ను ఔట్​ చేసిన చమీరా

టీ-20ల్లో తమ మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది టీమ్​ ఇండియా. ఆస్ట్రేలియాపై 2008లో చేసిన 74 పరుగులే ఇప్పటివరకు భారత్​కు టీ-20ల్లో అత్యల్ప స్కోరు.

  • 74(ఆస్ట్రేలియాపై)- మెల్​బోర్న్​-2008
  • 79(న్యూజిలాండ్​పై)- నాగ్​పుర్​- 2016
  • 81/8(శ్రీలంకపై)- కొలంబో 2021
  • 92(సౌతాఫ్రికాపై)- కటక్​-2015

20 ఓవర్లు ఆడి.. తక్కువ స్కోరు చేసిన జట్లు..

  • వెస్టిండీస్​- 79/7 (జింబాబ్వేపై)- 2010
  • ఇండియా- 81/8 (శ్రీలంకపై)- 2021
  • బంగ్లాదేశ్​- 85/9 (పాకిస్థాన్​పై)- 2011
  • ఐర్లాండ్​- 85/8(వెస్టిండీస్​పై)- 2014
    IND VS SL T20 SERIES
    సిరీస్​లో అద్భుతంగా రాణించిన దనంజయ డి సిల్వా

బర్త్​ డే ఘనత..

పుట్టినరోజు నాడు టీ-20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు శ్రీలంక బౌలర్​ వనిందు హసరంగ. 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడీ స్పిన్నర్​.

2014లో ఇమ్రాన్​ తాహిర్​ (4/21), 2019లో యువరాజ్​ సింగ్​ (3/23) బర్త్​ డే రోజు మంచి ప్రదర్శనలు చేశారు.

ఫోర్​ లేకుండా 32 బంతులు..

మొత్తం స్పిన్​కు అనుకూలించిన కొలంబో ప్రేమదాస స్టేడియంలో.. బౌండరీలు రావడమే గగనమైంది. టీమ్​ఇండియా మొత్తంగా 4 ఫోర్లు, శ్రీలంక 5 ఫోర్లు కొట్టింది.

IND VS SL T20 SERIES
వికెట్​ తీసిన ఆనందంలో టీమ్​ ఇండియా క్రికెటర్లు

ఓ టీ-20 ఇన్నింగ్స్​లో ఎక్కువ బంతులు ఆడి.. బౌండరీ సాధించని ఆటగాడిగా నిలిచాడు భువనేశ్వర్​. మొత్తం 32 బంతులాడిన భువీ.. 16 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క ఫోరు కూడా లేదు.

అంతకుముందు 2008లో ఆస్ట్రేలియాపై ఇర్ఫాన్​ పఠాన్​ 30, ధోనీ 27 బంతులాడి బౌండరీ కొట్టలేకపోయారు.

సిరీస్​ కైవసం..

భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా సంచలనంగా సిరీస్‌ కైవసం చేసుకుంది. భారత్‌ నిర్దేశించిన 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ధనంజయ డిసిల్వ (23 నాటౌట్‌; 20 బంతుల్లో 2x4), వానిండు హసరంగ (14 నాటౌట్‌; 9 బంతుల్లో 1x4) చివరి వరకు క్రీజులో నిల్చొని జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఇవీ చూడండి:

Olympics: ఒలింపిక్స్‌కు ఇక 'వేగ'మొస్తుంది!

IND VS SL: మూడో టీ20లో లంక విజయం.. సిరీస్​ కైవసం

టీమ్​ ఇండియా.. శ్రీలంక చేతిలో టీ-20 సిరీస్​ ఓడింది. వన్డే సిరీస్​ను 2-1 తేడాతో గెల్చిన యువభారత్​.. పొట్టి ఫార్మాట్​లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేయలేకపోయింది. అయితే ప్రధాన ఆటగాళ్లు లేని ఆ జట్టులో అనుభవలేమి దెబ్బతీసిందని చెప్పొచ్చు. ధావన్​, భువనేశ్వర్​, కుల్​దీప్​ యాదవ్​ మినహా అంతా కొత్తవాళ్లే. ఇదే మంచి అవకాశంగా భావించిన.. లంక జట్టు సమష్టి ప్రదర్శనతో టీ-20 ట్రోఫీని ఎగరేసుకుపోయింది.

IND VS SL T20 SERIES
టీమ్​ ఇండియా- శ్రీలంక ఆటగాళ్లు

ఈ మ్యాచ్​లో నమోదైన గణాంకాలు ఓ సారి పరిశీలిద్దాం..

2019 నుంచి టీమ్​ ఇండియాకు టీ-20 సిరీస్​ ఓటమే లేదు. మొత్తం 8 సిరీస్​లకు 7 గెలిచి, ఒకటి డ్రా చేసుకుంది. ఈ వరుస విజయాల రికార్డుకు ఇప్పుడు బ్రేక్​ పడింది.

  • భారత్​పై గెలుపుతో టీ-20 సిరీస్ పరాజయాలకు ​బ్రేక్​ వేసింది లంక. గత ఐదు టీ-20 సిరీస్​లలోనూ లంక ఓడింది.
  • 2008 ఆగస్టు తర్వాత.. శ్రీలంక, ఇండియాపై ఓ ద్వైపాక్షిక సిరీస్​(అన్ని ఫార్మాట్లు) గెలవడం ఇదే తొలిసారి.
  • ఈ సిరీస్​కు ముందు మొత్తం 13 సంవత్సరాల్లో 20 సిరీస్​లు జరగ్గా.. అన్నింటా టీమ్​ ఇండియాదే పైచేయి.
  • 21వ ప్రయత్నంలో సఫలమైంది శ్రీలంక.
  • ద్వైపాక్షిక టీ-20 సిరీస్​ల పరంగా చూసుకుంటే.. ఇది 8వ సారి.
  • గత 7 సిరీస్​ల్లోనూ భారత్​ చేతిలో లంకేయులు టీ-20 సిరీస్​ల్లో ఓడారు.
    IND VS SL T20 SERIES:
    ధావన్​ను ఔట్​ చేసిన చమీరా

టీ-20ల్లో తమ మూడో అత్యల్ప స్కోరు నమోదు చేసింది టీమ్​ ఇండియా. ఆస్ట్రేలియాపై 2008లో చేసిన 74 పరుగులే ఇప్పటివరకు భారత్​కు టీ-20ల్లో అత్యల్ప స్కోరు.

  • 74(ఆస్ట్రేలియాపై)- మెల్​బోర్న్​-2008
  • 79(న్యూజిలాండ్​పై)- నాగ్​పుర్​- 2016
  • 81/8(శ్రీలంకపై)- కొలంబో 2021
  • 92(సౌతాఫ్రికాపై)- కటక్​-2015

20 ఓవర్లు ఆడి.. తక్కువ స్కోరు చేసిన జట్లు..

  • వెస్టిండీస్​- 79/7 (జింబాబ్వేపై)- 2010
  • ఇండియా- 81/8 (శ్రీలంకపై)- 2021
  • బంగ్లాదేశ్​- 85/9 (పాకిస్థాన్​పై)- 2011
  • ఐర్లాండ్​- 85/8(వెస్టిండీస్​పై)- 2014
    IND VS SL T20 SERIES
    సిరీస్​లో అద్భుతంగా రాణించిన దనంజయ డి సిల్వా

బర్త్​ డే ఘనత..

పుట్టినరోజు నాడు టీ-20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు శ్రీలంక బౌలర్​ వనిందు హసరంగ. 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడీ స్పిన్నర్​.

2014లో ఇమ్రాన్​ తాహిర్​ (4/21), 2019లో యువరాజ్​ సింగ్​ (3/23) బర్త్​ డే రోజు మంచి ప్రదర్శనలు చేశారు.

ఫోర్​ లేకుండా 32 బంతులు..

మొత్తం స్పిన్​కు అనుకూలించిన కొలంబో ప్రేమదాస స్టేడియంలో.. బౌండరీలు రావడమే గగనమైంది. టీమ్​ఇండియా మొత్తంగా 4 ఫోర్లు, శ్రీలంక 5 ఫోర్లు కొట్టింది.

IND VS SL T20 SERIES
వికెట్​ తీసిన ఆనందంలో టీమ్​ ఇండియా క్రికెటర్లు

ఓ టీ-20 ఇన్నింగ్స్​లో ఎక్కువ బంతులు ఆడి.. బౌండరీ సాధించని ఆటగాడిగా నిలిచాడు భువనేశ్వర్​. మొత్తం 32 బంతులాడిన భువీ.. 16 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క ఫోరు కూడా లేదు.

అంతకుముందు 2008లో ఆస్ట్రేలియాపై ఇర్ఫాన్​ పఠాన్​ 30, ధోనీ 27 బంతులాడి బౌండరీ కొట్టలేకపోయారు.

సిరీస్​ కైవసం..

భారత్‌తో జరిగిన మూడో టీ20లో ఆతిథ్య శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడమే కాకుండా సంచలనంగా సిరీస్‌ కైవసం చేసుకుంది. భారత్‌ నిర్దేశించిన 82 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ధనంజయ డిసిల్వ (23 నాటౌట్‌; 20 బంతుల్లో 2x4), వానిండు హసరంగ (14 నాటౌట్‌; 9 బంతుల్లో 1x4) చివరి వరకు క్రీజులో నిల్చొని జట్టును విజయతీరాలకు చేర్చారు.

ఇవీ చూడండి:

Olympics: ఒలింపిక్స్‌కు ఇక 'వేగ'మొస్తుంది!

IND VS SL: మూడో టీ20లో లంక విజయం.. సిరీస్​ కైవసం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.