ETV Bharat / sports

క్రికెట్​ లవర్స్​కు షాక్​.. భారత్​- పాక్​ మ్యాచ్​ రీషెడ్యూల్​ ?

author img

By

Published : Jul 26, 2023, 12:14 PM IST

ICC World Cup 2023 : అహ్మదాబాద్​ వేదికగా జరగనున్న భారత్​ పాకిస్థాన్​ మ్యాచ్​ షెడ్యూల్​లో మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి కారణం ఏంటంటే..

ind vs pak
ind vs pak world cup

India Vs Pakistan World Cup : భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 5వ తేదీ నుంచి క్రికెట్‌ వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. దేశంలో వివిధ వేదికల్లో జరగనున్న ఈ పోరుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. వరల్డ్​ కప్​ అంటేనే టీవీలకు అతుక్కుపోయే క్రికెట్​ లవర్స్​ ఇక చిరకాల భారత్‌-పాక్​ మ్యాచ్​ అంటే చాలు కళ్లార్పకుండా చూస్తారు. దాయాదుల పోరు అంత రసవత్తరంగా ఉంటుంది. ఈ క్రమంలో అక్టోబర్‌ 15న భారత్​-పాకిస్థాన్​ తొలిసారి పోటీపడనుంది. ఇక ఈ మ్యాచ్​ను ఆసక్తిగా చూసేందుకు సర్వం సిద్ధం అవుతున్న వేళ క్రికెట్​ లవర్స్​కు ఐసీసీ ఓ పెద్ద షాక్ ఇవ్వనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఆ తేదీ ఖారారు ?
ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. అయితే అదే రోజు గుజరాత్‌ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు తెలిపింది.

"మేం దీనిపై మా దగ్గరున్న ఆప్షన్ల గురించి చర్చిస్తున్నాం. త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకుంటాం. భారత్‌, పాక్‌ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ కోసం భారీగా అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివస్తారు. అయితే ఓ పక్క నవరాత్రి ఉత్సవాలు, మరో వైపు మ్యాచ్‌తో తమపై భారం పెరుగుతుందని సెక్యూరిటీ ఏజెన్సీలు మాకు సూచనలు చేశాయి" అని బీసీసీఐ ఉన్నతాధికారులు చెప్పినట్లు ఆ మీడియా పేర్కొంది.

మరోవైపు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర సంఘాలు జులై 27న రాజధాని దిల్లీలో సమావేశం కావాలని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలోనే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కొత్త తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ఒక్క రోజు ముందుకు అంటే.. అక్టోబర్‌ 14కు మార్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ మ్యాచ్​కు ఇప్పటి నుంచే ఓ రేంజ్​లో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్​ జరిగే వారంలో.. అహ్మదాబాద్​ సహా, సమీప నగరాల్లో లగ్జరీ హోటల్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని హోటల్స్​లో ఒక రోజు బస చేసేందుకు సుమారు రూ. 80 వేల ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం. పాక్ ప్రపంచ కప్​లో​ తమ మిగతా మ్యాచ్​లను కోల్​కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​లలో ఆడనుంది.

India Vs Pakistan World Cup : భారత్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 5వ తేదీ నుంచి క్రికెట్‌ వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానుంది. దేశంలో వివిధ వేదికల్లో జరగనున్న ఈ పోరుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. వరల్డ్​ కప్​ అంటేనే టీవీలకు అతుక్కుపోయే క్రికెట్​ లవర్స్​ ఇక చిరకాల భారత్‌-పాక్​ మ్యాచ్​ అంటే చాలు కళ్లార్పకుండా చూస్తారు. దాయాదుల పోరు అంత రసవత్తరంగా ఉంటుంది. ఈ క్రమంలో అక్టోబర్‌ 15న భారత్​-పాకిస్థాన్​ తొలిసారి పోటీపడనుంది. ఇక ఈ మ్యాచ్​ను ఆసక్తిగా చూసేందుకు సర్వం సిద్ధం అవుతున్న వేళ క్రికెట్​ లవర్స్​కు ఐసీసీ ఓ పెద్ద షాక్ ఇవ్వనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్‌ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఆ తేదీ ఖారారు ?
ఇటీవలే ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. అయితే అదే రోజు గుజరాత్‌ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్‌ తేదీని మార్చాలని భద్రతా సంస్థలు బీసీసీఐకి సూచించినట్లు ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ అధికారులు చెప్పినట్లు తెలిపింది.

"మేం దీనిపై మా దగ్గరున్న ఆప్షన్ల గురించి చర్చిస్తున్నాం. త్వరలోనే ఓ నిర్ణయాన్ని తీసుకుంటాం. భారత్‌, పాక్‌ల మధ్య జరిగే ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ కోసం భారీగా అభిమానులు అహ్మదాబాద్‌కు తరలివస్తారు. అయితే ఓ పక్క నవరాత్రి ఉత్సవాలు, మరో వైపు మ్యాచ్‌తో తమపై భారం పెరుగుతుందని సెక్యూరిటీ ఏజెన్సీలు మాకు సూచనలు చేశాయి" అని బీసీసీఐ ఉన్నతాధికారులు చెప్పినట్లు ఆ మీడియా పేర్కొంది.

మరోవైపు వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు నిర్వహించే రాష్ట్ర సంఘాలు జులై 27న రాజధాని దిల్లీలో సమావేశం కావాలని బీసీసీఐ కార్యదర్శి జైషా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలోనే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కొత్త తేదీని నిర్ణయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను ఒక్క రోజు ముందుకు అంటే.. అక్టోబర్‌ 14కు మార్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ మ్యాచ్​కు ఇప్పటి నుంచే ఓ రేంజ్​లో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్​ జరిగే వారంలో.. అహ్మదాబాద్​ సహా, సమీప నగరాల్లో లగ్జరీ హోటల్స్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. కొన్ని హోటల్స్​లో ఒక రోజు బస చేసేందుకు సుమారు రూ. 80 వేల ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం. పాక్ ప్రపంచ కప్​లో​ తమ మిగతా మ్యాచ్​లను కోల్​కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్​లలో ఆడనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.