ETV Bharat / sports

భారత్​- పాక్​ మ్యాచ్​.. హాట్ ​కేకుల్లా అమ్ముడైన టికెట్లు..!

author img

By

Published : Feb 7, 2022, 4:46 PM IST

ICC T20 World Cup 2022: టీ20 వరల్డ్​కప్​ 2022లో భాగంగా భారత్​- పాకిస్థాన్​ మ్యాచ్​ టికెట్లు హాట్​ కేకుల్లా అమ్ముడై పోయాయి. బుకింగ్స్ ప్రారంభించిన గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడైపోయినట్లు ఐసీసీ తన వెబ్​సైట్లో పేర్కొంది.

ICC T20 World Cup 2022
టీ20 వరల్డ్​కప్​, 2022

ICC T20 World Cup 2022: భారత్​- పాక్ మ్యాచ్​ అంటే ఆ కిక్కే వేరప్పా.. దాయాది దేశాల మధ్య పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే టీ20 వరల్డ్​కప్​ 2022లో భాగంగా భారత్- పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అక్టోబరు 23న మెల్​బోర్న్​లో జరగనుంది.

ఈ క్రమంలో ఈ మ్యాచ్​ టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లాగా అమ్ముడై పోయాయి. స్టేడియం పూర్తిసామర్థ్యం లక్ష మంది కాగా.. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడై పోయినట్లు ఐసీసీ తన వెబ్​సైట్లో పేర్కొంది.

టీ20 వరల్డ్​ కప్​ 2022లో భాగంగా భారత్, పాకిస్థాన్​, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ జట్లు గ్రూప్ 2 కేటగిరిలో ఉన్నాయి.

గత పొట్టి ప్రపంచకప్‌లోనూ (2021) మొదటి మ్యాచ్‌లో పాక్‌తోనే టీమ్‌ఇండియా తలపడింది. కోహ్లీ నాయకత్వంలోని భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడి సెమీస్‌ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.

టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా.. భారత్‌ ఐదు సార్లు విజయం సాధించింది. అయితే ఈసారి రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ జట్టు ప్రపంచకప్‌ బరిలోకి దిగనుంది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి.

ఇదీ చూడండి: క్రికెట్​ ఫ్యాన్స్​కు శుభవార్త​.. అమ్మకానికి టీ20 ప్రపంచకప్​ టికెట్లు

ICC T20 World Cup 2022: భారత్​- పాక్ మ్యాచ్​ అంటే ఆ కిక్కే వేరప్పా.. దాయాది దేశాల మధ్య పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అయితే టీ20 వరల్డ్​కప్​ 2022లో భాగంగా భారత్- పాకిస్థాన్ జట్లు మరోసారి తలపడనున్నాయి. ఈ మ్యాచ్ అక్టోబరు 23న మెల్​బోర్న్​లో జరగనుంది.

ఈ క్రమంలో ఈ మ్యాచ్​ టికెట్లు గంటల వ్యవధిలోనే హాట్ కేకుల్లాగా అమ్ముడై పోయాయి. స్టేడియం పూర్తిసామర్థ్యం లక్ష మంది కాగా.. బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడై పోయినట్లు ఐసీసీ తన వెబ్​సైట్లో పేర్కొంది.

టీ20 వరల్డ్​ కప్​ 2022లో భాగంగా భారత్, పాకిస్థాన్​, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​ జట్లు గ్రూప్ 2 కేటగిరిలో ఉన్నాయి.

గత పొట్టి ప్రపంచకప్‌లోనూ (2021) మొదటి మ్యాచ్‌లో పాక్‌తోనే టీమ్‌ఇండియా తలపడింది. కోహ్లీ నాయకత్వంలోని భారత్‌ వరుసగా రెండు మ్యాచ్‌లను ఓడి సెమీస్‌ అవకాశాలను చేజార్చుకుంది. మిగిలిన మూడు మ్యాచుల్లో గెలిచినా ప్రయోజనం లేకుండా పోయింది. గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టాల్సి వచ్చింది.

టీ20 ప్రపంచకప్‌ పోటీల్లో ఇప్పటి వరకు ఆరు సార్లు తలపడగా.. భారత్‌ ఐదు సార్లు విజయం సాధించింది. అయితే ఈసారి రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత్‌ జట్టు ప్రపంచకప్‌ బరిలోకి దిగనుంది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు ఆస్ట్రేలియా వేదికగా ప్రపంచకప్‌ పోటీలు జరుగుతాయి.

ఇదీ చూడండి: క్రికెట్​ ఫ్యాన్స్​కు శుభవార్త​.. అమ్మకానికి టీ20 ప్రపంచకప్​ టికెట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.