ETV Bharat / sports

Ind vs Pak​: పాక్​ అభిమానికి గూగుల్ సీఈఓ అదిరిపోయే కౌంటర్​!

author img

By

Published : Oct 24, 2022, 1:13 PM IST

Updated : Oct 24, 2022, 1:49 PM IST

ఓటమితో అసహనానికి గురైన ఓ పాకిస్థాన్​ జట్టు​ అభిమానికి అదిరిపోయే కౌంటర్ వేశారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్​. ఎందుకంటే?

Ind vs Pak ceo
పాక్​తో మ్యాచ్​ గూగుల్ సీఈఓ కౌంటర్​

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్​కు ఉండే క్రేజ్​ గురించి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య జరిగే రసవత్త పోరును ఎన్ని సార్లు చూసినా తనవి తీరదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారంతే. అయితే టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ, హార్దిక్​ అద్భుత ప్రదర్శనతో టీమ్​ఇండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. దీంతో భారత క్రికెట్​ ప్రేమికులకు దీపావళి పండగ ఒక్కరోజు ముందుగానే వచ్చేసింది. ఒకేసారి రెండిటినీ కలిపి సంబరాలు చేసుకున్ననారు. అయితే ఈ క్రమంలోనే దీపావళి విషెస్​ తెలుపుతూ పాక్​తో జరిగిన మ్యాచ్​కు సంబంధించి గూగుల్ సీఈఓ ఓ ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్​ అవుతోంది. ఈ మ్యాచ్​ను తాను వీక్షించినట్లు తెలిపారు. అలాగే ఓ అభిమానికి కౌంటర్ వేశారు. ఏంటంటే..

'హ్యాపీ దీపావళి.. అందరు ఈ పండగను మీ ఫ్రెండ్స్​, అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను మాత్రం ఈ పండగను టీమ్​ఇండియా ఇన్నింగ్స్​ ఆఖరి మూడు ఓవర్లను మళ్లీ చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటాను. అద్భుతమైన గొప్ప ప్రదర్శన' అంటూ సుందర్​ ట్వీట్ చేశారు. అయితే మ్యాచ్​ కోల్పోయిన బాధలో ఉన్న ఓ పాక్ అభిమానికి దానికి కామెంట్ చేశాడు. 'మొదటి మూడు ఓవర్లు చూడండి' అంటూ కామెంట్​ చేయగా.. దానికి అదిరిపోయే రిప్లై ఇచ్చారు పిచాయ్​. 'హా అది కూడా చూశాను. భువి, అర్షదీప్​ స్పెల్ అద్భుతం' అని పాక్​ ఇన్నింగ్స్​ను ఉద్దేశించి తిరిగి కౌంటర్ వేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్​ అవుతోంది.

Google CEO Epic Response To Pakistan Fans Tweet Goes Viral
గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ దీపావళి శుభాకాంక్షలు
Google CEO Epic Response To Pakistan Fans Tweet Goes Viral
పాక్​ జట్టు అభిమానికి గూగుల్ సీఈఓ అదిరిపోయే కౌంటర్

ఇదీ చూడండి: T20 worldcup: కోహ్లీ.. ఆ ఒక్కటి కూడా పూర్తి చేసేశాడుగా!

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్​కు ఉండే క్రేజ్​ గురించి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య జరిగే రసవత్త పోరును ఎన్ని సార్లు చూసినా తనవి తీరదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులంతా టీవీలకు అతుక్కుపోతారంతే. అయితే టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో కోహ్లీ, హార్దిక్​ అద్భుత ప్రదర్శనతో టీమ్​ఇండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. దీంతో భారత క్రికెట్​ ప్రేమికులకు దీపావళి పండగ ఒక్కరోజు ముందుగానే వచ్చేసింది. ఒకేసారి రెండిటినీ కలిపి సంబరాలు చేసుకున్ననారు. అయితే ఈ క్రమంలోనే దీపావళి విషెస్​ తెలుపుతూ పాక్​తో జరిగిన మ్యాచ్​కు సంబంధించి గూగుల్ సీఈఓ ఓ ట్వీట్ చేశారు. అది ప్రస్తుతం వైరల్​ అవుతోంది. ఈ మ్యాచ్​ను తాను వీక్షించినట్లు తెలిపారు. అలాగే ఓ అభిమానికి కౌంటర్ వేశారు. ఏంటంటే..

'హ్యాపీ దీపావళి.. అందరు ఈ పండగను మీ ఫ్రెండ్స్​, అలాగే ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను మాత్రం ఈ పండగను టీమ్​ఇండియా ఇన్నింగ్స్​ ఆఖరి మూడు ఓవర్లను మళ్లీ చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటాను. అద్భుతమైన గొప్ప ప్రదర్శన' అంటూ సుందర్​ ట్వీట్ చేశారు. అయితే మ్యాచ్​ కోల్పోయిన బాధలో ఉన్న ఓ పాక్ అభిమానికి దానికి కామెంట్ చేశాడు. 'మొదటి మూడు ఓవర్లు చూడండి' అంటూ కామెంట్​ చేయగా.. దానికి అదిరిపోయే రిప్లై ఇచ్చారు పిచాయ్​. 'హా అది కూడా చూశాను. భువి, అర్షదీప్​ స్పెల్ అద్భుతం' అని పాక్​ ఇన్నింగ్స్​ను ఉద్దేశించి తిరిగి కౌంటర్ వేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్​ అవుతోంది.

Google CEO Epic Response To Pakistan Fans Tweet Goes Viral
గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ దీపావళి శుభాకాంక్షలు
Google CEO Epic Response To Pakistan Fans Tweet Goes Viral
పాక్​ జట్టు అభిమానికి గూగుల్ సీఈఓ అదిరిపోయే కౌంటర్

ఇదీ చూడండి: T20 worldcup: కోహ్లీ.. ఆ ఒక్కటి కూడా పూర్తి చేసేశాడుగా!

Last Updated : Oct 24, 2022, 1:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.