ETV Bharat / sports

భారీ ఆధిక్యం దిశగా భారత్​- లంచ్​ సమయానికి 156/6

author img

By

Published : Feb 15, 2021, 11:40 AM IST

Updated : Feb 15, 2021, 12:08 PM IST

రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో లంచ్​ సమయానికి భారత్​ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కోహ్లీ, అశ్విన్​లు క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్​ ఆధిక్యంతో కలిపి ప్రస్తుతం 351 పరుగుల లీడ్​లో ఉంది. ఇంగ్లాండ్​ బౌలర్లలో లీచ్​ 3, అలీ 2 వికెట్లు తీసుకున్నారు.

lunch time in second test
భారీ ఆధిక్యం దిశగా భారత్​- లంచ్​ సమయానికి 150/6

చెపాక్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం 351 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కెప్టెన్​ కోహ్లీ (38), అశ్విన్​ (34) పరుగులతో నాటౌట్​గా ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో లీచ్​ 3, మొయిన్​ అలీ 2 వికెట్లు తీసుకున్నారు.

స్పిన్​కు సహకరిస్తున్న పిచ్​పై మొదట్లో కాస్త తడబడింది టీమ్​ఇండియా. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్​.. కోహ్లీతో కలిసి ధాటిగా ఆడుతున్నాడు. త్వరత్వరగా పరుగులు తీస్తూ కెప్టెన్​పై ఒత్తిడిని తొలగించాడు. ఈ క్రమంలోనే ఈ జంట 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

మూడో రోజు ఆటను కొనసాగించిన టీమ్ఇండియా ఓవర్​నైట్​ స్కోరుకు ఒక్క పరుగు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. పుజారా రనౌట్​ కాగా.. రోహిత్​ స్టంప్​ ఔట్​ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన పంత్​ కూడా ఎక్కువసేపు నిలువలేదు. లీచ్​ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి అతనూ స్టంపౌటయ్యాడు.

కోహ్లీతో కలిసిన రహానె.. 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అలీ విడగొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్​ పటేల్​ కూడా అలీ బౌలింగ్​లోనే వెనుదిరిగాడు.

ఇదీ చదవండి: 'ఐపీఎల్​ 14కు ప్రేక్షకులను అనుమతిస్తాం'

చెపాక్​ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్​ నిలకడగా ఆడుతోంది. భోజన విరామ సమయానికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం 351 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో కెప్టెన్​ కోహ్లీ (38), అశ్విన్​ (34) పరుగులతో నాటౌట్​గా ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో లీచ్​ 3, మొయిన్​ అలీ 2 వికెట్లు తీసుకున్నారు.

స్పిన్​కు సహకరిస్తున్న పిచ్​పై మొదట్లో కాస్త తడబడింది టీమ్​ఇండియా. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అశ్విన్​.. కోహ్లీతో కలిసి ధాటిగా ఆడుతున్నాడు. త్వరత్వరగా పరుగులు తీస్తూ కెప్టెన్​పై ఒత్తిడిని తొలగించాడు. ఈ క్రమంలోనే ఈ జంట 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది.

మూడో రోజు ఆటను కొనసాగించిన టీమ్ఇండియా ఓవర్​నైట్​ స్కోరుకు ఒక్క పరుగు జోడించి రెండు వికెట్లు కోల్పోయింది. పుజారా రనౌట్​ కాగా.. రోహిత్​ స్టంప్​ ఔట్​ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన పంత్​ కూడా ఎక్కువసేపు నిలువలేదు. లీచ్​ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి అతనూ స్టంపౌటయ్యాడు.

కోహ్లీతో కలిసిన రహానె.. 31 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అలీ విడగొట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్​ పటేల్​ కూడా అలీ బౌలింగ్​లోనే వెనుదిరిగాడు.

ఇదీ చదవండి: 'ఐపీఎల్​ 14కు ప్రేక్షకులను అనుమతిస్తాం'

Last Updated : Feb 15, 2021, 12:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.