ETV Bharat / sports

ఈ ఓటమి మాకొక గుణపాఠం: రూట్​

author img

By

Published : Feb 16, 2021, 5:41 PM IST

చెపాక్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్​ పూర్తి ఆధిపత్యం చెలాయించిందని ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తెలిపాడు. ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని పేర్కొన్నాడు. క్రెడిటంతా కోహ్లీ సేనకే దక్కుతుందని వెల్లడించాడు.

India outplayed us; it was an education for us: England captain Root
ఈ ఓటమి మాకొక గుణపాఠం: రూట్​

చెపాక్​ వేదికగా జరిగిన రెండో టెస్టు ఓటమిపై ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్ స్పందించాడు. మూడు విభాగాల్లోనూ భారత్​ తమపై ఆధిపత్యం ప్రదర్శించిందని తెలిపాడు. విజయానికి వారే సంపూర్ణ అర్హులని పేర్కొన్నాడు.

ఈ టెస్టులో భారత్​ బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్​ ఆసాంతం ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్​ చేశారు. విజయానికి వారు సంపూర్ణంగా అర్హులు. క్రెడిటంతా టీమ్​ఇండియాకు దక్కుతుంది. ఈ ఓటమి మాకొక గుణపాఠం. రెండో రోజు నుంచి పిచ్​ బ్యాటింగ్​కు కష్టంగా మారింది. సిరీస్​ 1-1తో సమమైంది. తదుపరి రెండు టెస్టులపై మేము దృష్టి పెట్టనున్నాము. అహ్మదాబాద్​ వేదికగా జరిగే డే/నైట్​ టెస్టుకు అదనపు స్పిన్నర్​తో బరిలోకి దిగుతాం.

-జో రూట్, ఇంగ్లాండ్​ కెప్టెన్​.

రొటేషన్ పాలసీపై స్పందిస్తూ..

తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన అండర్సన్, జోస్​ బట్లర్​ లాంటి ఆటగాళ్లను రొటేషన్​ పాలసీపై పక్కకు పెట్టడం జట్టుకు చేటు చేసిందని ఇంగ్లాండ్​ మాజీలు విమర్శించారు. దీనిపై ఇంగ్లీష్ జట్టు​ సారథి స్పందించాడు. ఓటమికి ఆ విధానం కారణం కాదని తెలిపాడు. ఇక్కడ గెలుపొందడానికి కావాల్సిన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని రూట్​ పేర్కొన్నాడు.

జట్టులో ఉన్న ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోవడం నా బాధ్యత. అందుకు నా శక్తి మేరకు నేను పని చేస్తున్నాను. కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు మా టీమ్​లో ఉన్నారు. ఇక్కడ గెలవడానికి కావాల్సిన సత్తా వారిలో ఉంది.

-జో రూట్​, ఇంగ్లాండ్ కెప్టెన్.

ఇదీ చదవండి: ' టాస్ వాళ్లు గెలిచినా మ్యాచ్ మేమే గెలిచే వాళ్లం '

చెపాక్​ వేదికగా జరిగిన రెండో టెస్టు ఓటమిపై ఇంగ్లాండ్​ కెప్టెన్​ రూట్ స్పందించాడు. మూడు విభాగాల్లోనూ భారత్​ తమపై ఆధిపత్యం ప్రదర్శించిందని తెలిపాడు. విజయానికి వారే సంపూర్ణ అర్హులని పేర్కొన్నాడు.

ఈ టెస్టులో భారత్​ బ్యాటింగ్​, బౌలింగ్​, ఫీల్డింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. మ్యాచ్​ ఆసాంతం ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్​ చేశారు. విజయానికి వారు సంపూర్ణంగా అర్హులు. క్రెడిటంతా టీమ్​ఇండియాకు దక్కుతుంది. ఈ ఓటమి మాకొక గుణపాఠం. రెండో రోజు నుంచి పిచ్​ బ్యాటింగ్​కు కష్టంగా మారింది. సిరీస్​ 1-1తో సమమైంది. తదుపరి రెండు టెస్టులపై మేము దృష్టి పెట్టనున్నాము. అహ్మదాబాద్​ వేదికగా జరిగే డే/నైట్​ టెస్టుకు అదనపు స్పిన్నర్​తో బరిలోకి దిగుతాం.

-జో రూట్, ఇంగ్లాండ్​ కెప్టెన్​.

రొటేషన్ పాలసీపై స్పందిస్తూ..

తొలి టెస్టులో అద్భుతంగా రాణించిన అండర్సన్, జోస్​ బట్లర్​ లాంటి ఆటగాళ్లను రొటేషన్​ పాలసీపై పక్కకు పెట్టడం జట్టుకు చేటు చేసిందని ఇంగ్లాండ్​ మాజీలు విమర్శించారు. దీనిపై ఇంగ్లీష్ జట్టు​ సారథి స్పందించాడు. ఓటమికి ఆ విధానం కారణం కాదని తెలిపాడు. ఇక్కడ గెలుపొందడానికి కావాల్సిన ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని రూట్​ పేర్కొన్నాడు.

జట్టులో ఉన్న ఆటగాళ్లను సరిగా ఉపయోగించుకోవడం నా బాధ్యత. అందుకు నా శక్తి మేరకు నేను పని చేస్తున్నాను. కొంతమంది అద్భుతమైన ఆటగాళ్లు మా టీమ్​లో ఉన్నారు. ఇక్కడ గెలవడానికి కావాల్సిన సత్తా వారిలో ఉంది.

-జో రూట్​, ఇంగ్లాండ్ కెప్టెన్.

ఇదీ చదవండి: ' టాస్ వాళ్లు గెలిచినా మ్యాచ్ మేమే గెలిచే వాళ్లం '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.