ETV Bharat / sports

తొలి టెస్ట్​: ఇంగ్లాండ్​ విజయం- సిరీస్​లో 1-0 ఆధిక్యం

author img

By

Published : Feb 9, 2021, 1:38 PM IST

Updated : Feb 9, 2021, 2:31 PM IST

చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్​ భారీ విజయం సాధించింది. టీమ్​ఇండియాను రెండో ఇన్నింగ్స్​లో 192 పరుగులకు ఆలౌట్​ చేసి 227 పరగుల తేడాతో గెలుపొందింది. జాక్​ లీచ్​​, అండర్సన్​లు తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

ENGLAND BEAT INDIA IN FIRST TEST
తొలి టెస్టులో ఇంగ్లాండ్​ ఘనవిజయం

స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో భారత్​ ఘోర పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనలో ఇండియా బ్యాట్స్​మెన్లు చేతులేత్తేశారు. ఏ దశలోనూ కనీస ప్రతిఘటన చూపలేదు. పర్యటక జట్టు కట్టుదిట్టమైన ఫీల్డింగ్​కు తోడు పిచ్​ కూడా వారికి సహకరించింది. అద్భుత ద్విశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జో రూట్​ను ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు వరించింది.

అయిదవ రోజు మరో 45.1 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా.. 192 పరుగులకు ఆలౌటైంది. 227 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన రూట్​ సేన నాలుగు టెస్టుల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(72), గిల్(50) మినహా ఎవరూ రాణించలేదు. రహానె, సుందర్​, నదీమ్​లు డకౌటయ్యారు. జాక్​ లీచ్​(4 వికెట్లు), జేమ్స్​ అండర్సన్​(3 వికెట్లు)లు తీసి ఇంగ్లాండ్​ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఓవర్​నైట్​ స్కోరు 39/1తో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన భారత్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రీజులో కుదురుకుంటున్న పుజారాను లీచ్​ పెవిలియన్​ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన కెప్టెన్​ కోహ్లీ.. గిల్​తో కలిసి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. 26వ ఓవర్లో బౌలింగ్​కు దిగిన అండర్సన్​ టీమ్​ఇండియాను గట్టి దెబ్బ కొట్టాడు. వరుసగా గిల్​, రహానెలను క్లీన్​ బౌల్డ్​ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను అంచనా వేయడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. తర్వాత ఏ దశలోనూ భారత్​ కోలుకోలేదు.

పోరాడిన కోహ్లీ..

లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్​మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్​ గిల్​, విరాట్​ కోహ్లీలు అర్ధ సెంచరీలు చేసి ఊపుమీద కనిపించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఓ ఎండ్​లో కెప్టెన్​ కోహ్లీ ప్రతిఘటించిన అతనికి సహకారం అందించేవారే కరవయ్యారు. కొద్ది సేపు అశ్విన్​ అండగా నిలిచాడు. 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది ఈ జోడీ. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను లీచ్​ విడగొట్టాడు. కోహ్లీ.. చివరికి స్టోక్స్​ బౌలింగ్​లో 8వ వికెట్​గా వెనుదిరిగాడు.

అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన వారంతా త్వరగానే అవుటయ్యారు. నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో రెండో టెస్టు ఈనెల 13 నుంచి చెన్నై వేదికగా ప్రారంభమవుతుంది.

30 ఏళ్ల రికార్డును తిరగరాసిన రూట్ సేన..

ఆస్ట్రేలియా గబ్బా స్టేడియంలో కంగారూలకు 32 ఏళ్లుగా ఎదురేలేదు. కానీ, ఇటీవల జరిగిన టెస్టులో అజింక్య రహానె నాయకత్వంలోని టీమ్​ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అదే విధంగా చెపాక్​ స్టేడియంలో 30 ఏళ్లుగా ఇంగ్లాండ్​కు విజయమే దక్కలేదు. ఈ టెస్టు విజయంతో రూట్​ సేన తాజాగా రికార్డు సృష్టించింది.

ఇదీ చదవండి: ఆ విషయంపై ఐసీసీకి దక్షిణాఫ్రికా బోర్డ్​ లేఖ

స్వదేశంలో ఇంగ్లాండ్​తో జరిగిన తొలి టెస్టులో భారత్​ ఘోర పరాజయం పాలైంది. లక్ష్య ఛేదనలో ఇండియా బ్యాట్స్​మెన్లు చేతులేత్తేశారు. ఏ దశలోనూ కనీస ప్రతిఘటన చూపలేదు. పర్యటక జట్టు కట్టుదిట్టమైన ఫీల్డింగ్​కు తోడు పిచ్​ కూడా వారికి సహకరించింది. అద్భుత ద్విశతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జో రూట్​ను ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్​ అవార్డు వరించింది.

అయిదవ రోజు మరో 45.1 ఓవర్ల పాటు బ్యాటింగ్​ చేసిన టీమ్​ఇండియా.. 192 పరుగులకు ఆలౌటైంది. 227 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన రూట్​ సేన నాలుగు టెస్టుల సిరీస్​లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కెప్టెన్​ విరాట్​ కోహ్లీ(72), గిల్(50) మినహా ఎవరూ రాణించలేదు. రహానె, సుందర్​, నదీమ్​లు డకౌటయ్యారు. జాక్​ లీచ్​(4 వికెట్లు), జేమ్స్​ అండర్సన్​(3 వికెట్లు)లు తీసి ఇంగ్లాండ్​ విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఓవర్​నైట్​ స్కోరు 39/1తో రెండో ఇన్నింగ్స్​ ప్రారంభించిన భారత్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. క్రీజులో కుదురుకుంటున్న పుజారాను లీచ్​ పెవిలియన్​ చేర్చాడు. అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన కెప్టెన్​ కోహ్లీ.. గిల్​తో కలిసి జట్టును కాపాడే ప్రయత్నం చేశాడు. 26వ ఓవర్లో బౌలింగ్​కు దిగిన అండర్సన్​ టీమ్​ఇండియాను గట్టి దెబ్బ కొట్టాడు. వరుసగా గిల్​, రహానెలను క్లీన్​ బౌల్డ్​ చేశాడు. తక్కువ ఎత్తులో వచ్చిన బంతులను అంచనా వేయడంలో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. తర్వాత ఏ దశలోనూ భారత్​ కోలుకోలేదు.

పోరాడిన కోహ్లీ..

లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్​మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్​ గిల్​, విరాట్​ కోహ్లీలు అర్ధ సెంచరీలు చేసి ఊపుమీద కనిపించినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఓ ఎండ్​లో కెప్టెన్​ కోహ్లీ ప్రతిఘటించిన అతనికి సహకారం అందించేవారే కరవయ్యారు. కొద్ది సేపు అశ్విన్​ అండగా నిలిచాడు. 54 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది ఈ జోడీ. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను లీచ్​ విడగొట్టాడు. కోహ్లీ.. చివరికి స్టోక్స్​ బౌలింగ్​లో 8వ వికెట్​గా వెనుదిరిగాడు.

అనంతరం బ్యాటింగ్​కు వచ్చిన వారంతా త్వరగానే అవుటయ్యారు. నాలుగు మ్యాచ్​ల సిరీస్​లో రెండో టెస్టు ఈనెల 13 నుంచి చెన్నై వేదికగా ప్రారంభమవుతుంది.

30 ఏళ్ల రికార్డును తిరగరాసిన రూట్ సేన..

ఆస్ట్రేలియా గబ్బా స్టేడియంలో కంగారూలకు 32 ఏళ్లుగా ఎదురేలేదు. కానీ, ఇటీవల జరిగిన టెస్టులో అజింక్య రహానె నాయకత్వంలోని టీమ్​ఇండియా విజయకేతనం ఎగురవేసింది. అదే విధంగా చెపాక్​ స్టేడియంలో 30 ఏళ్లుగా ఇంగ్లాండ్​కు విజయమే దక్కలేదు. ఈ టెస్టు విజయంతో రూట్​ సేన తాజాగా రికార్డు సృష్టించింది.

ఇదీ చదవండి: ఆ విషయంపై ఐసీసీకి దక్షిణాఫ్రికా బోర్డ్​ లేఖ

Last Updated : Feb 9, 2021, 2:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.